
గంజాయి రవాణా చేస్తున్న నలుగురి అరెస్టు
గణపవరం : చెడు వ్యసనాలకు బానిసలై, గంజాయి అమ్మకాలు చేస్తున్న నలుగురు యువకులు పోలీసుల వలలో చిక్కారు. గణపవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద పోలీసులు శనివారం ఉదయం మాటువేసి గంజాయి అక్రమంగా రవాణాచేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.50వేల విలువైన 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శనివారం సాయంత్రం ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన ఖార అర్జున్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ దొంగతనంగా గంజాయి అమ్మేవాడు. ఇతనికి గణపవరం వెలంపేటకు చెందిన రాయపురెడ్డి తరుణ్, ఇందిరమ్మ కాలనీకి చెందినయాళ్ల సాయికిషోర్, ఉండిమండలం కోలమూరుకు చెందిన దగుగ్పల్లి జోగామారిష్ పరిచయం ఆయ్యారు. ఈ ముగ్గురు యువకులు గంజాయి సేవించడమే కాక, చుట్టుపక్కల యువకులకు గంజాయి అమ్మవారు. ఈ ముగ్గురు యువకులు అర్జున్తో కలసి అరకు వెళ్లి గంజాయి కొని తెచ్చి స్థానికంగా అమ్ముతున్నారు. తనకు అందిన సమాచారం ఆధారంగా సీఐ సుభాష్ సిబ్బందితో కలసి మాటువేసి వీరిని పట్టుకున్నారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్టు
తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెం పట్టణంలోని దానమ్మగుడి సమీపంలో ఆటో డ్రైవర్ పద్మాకర్ ఇటీవల ఇంటి ముందు గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. శనివారం ఇది గమనించిన స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎకై ్సజ్ ఎస్సై రాంబాబు, పట్టణ ఎస్సై బాదం శ్రీనివాసు పద్మాకర ఇంటికి వెళ్లి అక్కడి గంజాయి మొక్కలను పరిశీలించి నిర్ధారించారు. పద్మాకర్ను విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అరెస్టు చేసి విచారణ చేపట్టారు.