
పొగాకు బారిన పడవద్దు
పొగాకు వాడకం వల్ల ప్రజల జీవితాలు నాశనం చేసుకొంటున్నారు. ప్రధానంగా నోటి, స్వరపేటిక, ఊపిరితిత్తులు, క్లోమగ్రంధి, మూత్రాశయ కేన్సర్లు సంభవిస్తాయి. గుండె పోటుతో అకాల మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. జిల్లా సర్వజన ఆస్పత్రిలో పొగాకు విరమణ వైద్యశాల(టీసీసీ) అందుబాటులో ఉంది. పొగాకు ఉత్పత్తులకు అందరూ దూరంగా ఉండండి.
– డాక్టర్ ఆర్.మాలిని, జిల్లా వైద్యాధికారి, ఏలూరు
పీల్చడమూ ప్రమాదమే
సిగిరెట్లులను కాల్చడమే కాదు.. ఆ పొగను పీల్చినా ప్రమాదమే. కొందరు సరదాగా పొగాకునకు అలవాటు పడి వ్యసనపరులుగా మారుతున్నారు. ప్రధానంగా యువత వీటికి ఆకర్షితులవుతున్నారు. గుండె పోటు మరణాల్లో ధూమపానం అలవాటు ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారు. పొగాకు రహిత సమాజానికి అందరూ సహకరించాలి.
– డాక్టర్ నరేంద్ర, ప్రొగ్రాం ఆఫీసర్, ఎన్సీడీ, ఏలూరు
వ్యసనపరుల్లో మార్పు
ఏలూరు సర్వజన ఆస్పత్రిలో టొబోకో ససైషన్ క్లీనిక్(టీసీసీ) అందుబాటులో ఉంది. ఈ సెంటర్లో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 5 వేల మందికి వైద్య సేవలు అందించాం. వ్యసనపరులకు నికోటివ్ రీప్లేస్మెంట్ థెరపీని అందిస్తున్నాం. పూర్తిగా పొగాకు మానివేసిన వాళ్లను ఆరు నెలల వరకు పరిశీలిస్తున్నాం. ధూమపానానికి అలవాటు పడిన వారిని టీసీసీ ద్వారా మామూలు స్థితికి తీసుకొస్తున్నాం.
– కె.చిన వీర్రాజు, సైకాలజిస్టు, గవర్నమెంట్ జనరల్ హాస్పటల్, ఏలూరు

పొగాకు బారిన పడవద్దు

పొగాకు బారిన పడవద్దు