జిరాయితీ భూముల సర్వే ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జిరాయితీ భూముల సర్వే ప్రారంభం

Apr 30 2025 2:02 AM | Updated on Apr 30 2025 2:02 AM

జిరాయితీ భూముల సర్వే ప్రారంభం

జిరాయితీ భూముల సర్వే ప్రారంభం

నిడమర్రు: నిడమర్రు కొల్లేరు అభయారణ్య పరిధిలో జిరాయితీ, అన్‌సర్వే భూముల సర్వే మంగళవారం నుంచి ప్రారంభించినట్లు తహసీల్దారు ఎన్‌.నాగరాజు తెలిపారు. శనివారం గండి కొట్టిన చెరువు సరిహద్దులు నిర్ణయించేందుకు అధికారులు సర్వే నిర్వహించారు. ఈ చెరువులో కొంత భాగం భీమడోలు మండలం చెట్టున్నపాడులో మరి కొంతభాగం నిడమర్రు వెంకటాపురంలో ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో రెండు మండలాల రెవిన్యూ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేకు అటవీ శాఖ అధికారులు హాజరవని కారణంగా మరో రోజుకు వాయిదా వేస్తున్నట్లు తహసీల్దారు నాగరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement