
జిరాయితీ భూముల సర్వే ప్రారంభం
నిడమర్రు: నిడమర్రు కొల్లేరు అభయారణ్య పరిధిలో జిరాయితీ, అన్సర్వే భూముల సర్వే మంగళవారం నుంచి ప్రారంభించినట్లు తహసీల్దారు ఎన్.నాగరాజు తెలిపారు. శనివారం గండి కొట్టిన చెరువు సరిహద్దులు నిర్ణయించేందుకు అధికారులు సర్వే నిర్వహించారు. ఈ చెరువులో కొంత భాగం భీమడోలు మండలం చెట్టున్నపాడులో మరి కొంతభాగం నిడమర్రు వెంకటాపురంలో ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో రెండు మండలాల రెవిన్యూ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేకు అటవీ శాఖ అధికారులు హాజరవని కారణంగా మరో రోజుకు వాయిదా వేస్తున్నట్లు తహసీల్దారు నాగరాజు తెలిపారు.