సమష్టి కృషితోనే ఎన్‌బీఏ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

సమష్టి కృషితోనే ఎన్‌బీఏ గుర్తింపు

Jun 6 2025 12:24 AM | Updated on Jun 6 2025 12:24 AM

సమష్టి కృషితోనే ఎన్‌బీఏ గుర్తింపు

సమష్టి కృషితోనే ఎన్‌బీఏ గుర్తింపు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సమష్టి కృషితోనే జేఎన్‌టీయూ కాకినాడ ఇంజినీరింగ్‌ కళాశాలకు నేషనల్‌ బోర్డు అక్రిడిటేషన్‌ (ఎ న్‌బీఏ) యూజీ స్థాయి గుర్తింపు వచ్చిందని జేఎన్‌టీయూకే వైస్‌ చాన్సలర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ మో హనరావు అధ్యక్షతన అలుమ్నీ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం జరిగిన అభినందన సభలో ఆయ న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీటెక్‌ కోర్సులైన ఈఈఈ, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్‌, సివిల్‌ విభాగాలను ఎన్‌బీఏ బృందం గత నెలలో సందర్శించిందని, ఈ గుర్తింపు 2028 వరకూ ఉంటుందని చెప్పారు. పీజీ ప్రోగ్రామ్‌కు ఎన్‌బీఏ గుర్తింపు వచ్చేలా ఇదే తరహాలో కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ స్వరూపరాణి, ఆర్‌.దీక్షితులు, వివిధ విభాగాల అధిపతులు కోటేశ్వరరావు, కె.వెంకటరెడ్డి, ఆర్‌.మధు, ఎస్‌.సురేఖ, కల్యాణ్‌ మనోహర్‌, సత్యవేణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement