ఉపాధ్యాయుడికి జాతీయ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడికి జాతీయ పురస్కారం

Dec 1 2025 7:26 AM | Updated on Dec 1 2025 7:26 AM

ఉపాధ్యాయుడికి జాతీయ పురస్కారం

ఉపాధ్యాయుడికి జాతీయ పురస్కారం

ఉప్పలగుప్తం: మండలంలోని చినగాడవల్లి మండల ప్రజా పరిషత్‌ పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుడు అంకం చంద్రసూర్యం ఆదివారం నేషనల్‌ ఇన్‌స్పిరేషన్‌ టీచర్‌ అవార్డు అందుకున్నారు. ఈ విషయాన్ని చంద్రసూర్యం విలేకరులకు తెలిపారు. అంతర్జాతీయ టీచర్స్‌ డే సెలబ్రేషన్స్‌ను పురస్కరించుకుని హైదరాబాద్‌కు చెందిన శారదా ఎడ్యుకేషనల్‌ సొసైటీ 2025 సంవత్సరానికి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు వివరించారు. విద్యా బోధనలో వినూత్న విధానాలు, రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వడంతో ఈ అవార్డుకు ఎంపిక చేసిందన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ల చేతుల మీదుగా శారదా ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధినేత పట్నం కమల మనోహర్‌ అవార్డును అందజేశారన్నారు. చంద్రసూర్యంను మండల విద్యాశాఖాధికారులు ఎన్‌వీ శంకరరావు, ఎస్‌.సత్యకృష్ణ, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement