
సాక్షి,ముంబై: స్టాక్మార్కెట్లు చివరికి భారీ నష్టాలతోనే ముగిసింది. ఆరంభంలోనే బలహీనంగా ఉన్న సూచీలు రోజంతా అదే ధోరణి కొనసాగించాయి. తీవ్రంగా ఊగిసలాట మధ్య సూచీలుచివరికి వారాంతంలో మద్దతు స్థాయిలకు దిగువకు చేరడం గమనార్హం.సెన్సెక్స్ 441 నష్టంతో 50405 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు పతనమై 14938 వద్ద క్లోజ్ అయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్తోపాటు దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలనే మూటగట్టుకున్నాయి.