
ఇంకుడు గుంతల పరిశీలన
జూలూరుపాడు: మండలంలో పలు గ్రామాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన ఇంకుడు గుంతలు, కందకాలను ఆదివారం సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారి పృథ్వీరాజ్ పరిశీలించారు. జూలూరుపాడు, కొత్తూరు, పాపకొల్లు, అన్నారుపాడు, భేతాళపాడు, కరివారిగూడెం, కొమ్ముగూడెం, మాచినేనిపేట, మాచినేనిపేటతండా, పడమటనర్సాపురం, సాయిరాంతండా, కాకర్ల, శంభునిగూడెం, తదితర గ్రామాల్లో పర్యటించారు. ఇంటి ప్రాంగణాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రహదారుల పక్కన నిర్మించిన ఇంకుడు గుంతల నిర్మాణాలను పరిశీలించారు. పడమటనర్సాపురం సమీపంలో గుట్ట చుట్టూ చేపట్టిన కందకం పనులను సందర్శించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఈసీ రాజు, ఈజీఎస్ ఏపీఓ రవికుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.