రక్షణతో.. సులువుగా.. | - | Sakshi
Sakshi News home page

రక్షణతో.. సులువుగా..

Jun 8 2025 12:17 AM | Updated on Jun 8 2025 12:17 AM

రక్షణతో.. సులువుగా..

రక్షణతో.. సులువుగా..

మణుగూరు టౌన్‌: సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనపై మరింత దృష్టి సారించింది. ఇప్పటికే రోజు, నెల వారీ లక్ష్యాలు, వార్షిక లక్ష్యాల సాధనకు బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీతపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. సంస్థ ఉన్నాధికారులు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ, గనులను సందర్శిస్తూ ఉత్పత్తి పెంపునకు కృషి చేస్తున్నారు. ఇకపై కార్యాలయం నుంచి కూడా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం సంస్థవ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మెయింటెనెన్స్‌లో ఉన్న యంత్రాల వద్దకు తక్షణమే డంపర్‌లు పంపడం సులువు కానుంది. గనులు, డిపార్ట్‌మెంట్లలో చోరీలను కూడా నివారించవచ్చు. నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణతో ప్రమాదాలను అరికట్టడం, యంత్ర విరామ సమయం తగ్గించడం వంటి చర్యలతో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సునాయాసంగా సాధించే అవకాశం ఉంది.

ఉత్పత్తి పెంచే దిశగా...

బొగ్గు ఉత్పత్తిలో ఏటా అగ్రగామిగా నిలుస్తున్న మణుగూరు ఏరియాలో వానాకాలం అతివృష్టి అధికారులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఫలితంగా వర్షాకాలంలో ఒక్కోసారి క్వారీల్లోకి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో అవకాశం ఉన్న రోజుల్లో ఉత్పత్తి నిరాటంకంగా కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం మణుగూరులోని గనులు, డిపార్ట్‌మెంట్లలో 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పటిష్ట రక్షణ చర్యలు పాటించేలా, యంత్రాల విరామ సమయం తగ్గించేలా, డంపర్ల వేగాన్ని నియంత్రించి ప్రమాదాలను నిరోధించేలా సీసీ కెమెరాలతో పర్య వేక్షించనున్నారు.

వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధన..

పూర్తిస్థాయిలో యంత్రాలు వినియోగించేలా అధికారుల చర్యలు

సింగరేణిలో పర్యవేక్షణకు

సీసీ కెమెరాల ఏర్పాటు

సీసీ కెమెరాల తోడ్పాటుతో...

సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా చోరీలతోపాటు మైన్‌ను పూర్తిస్థాయి పర్యవేక్షణ చేసే వీలు కలుగుతుంది. యంత్రాల విరామం తగ్గించుకునే చర్యలతోపాటు పెంచిన పనిగంటలను పూర్తిస్థాయిలో వినియోగించి ఉత్పత్తి లక్ష్యాన్ని సునాయాసంగా చేరేందుకు దోహదపడుతుంది. మారుతున్న సాంకేతికత, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గనుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది.

– లక్ష్మీపతిగౌడ్‌, ఇన్‌చార్జి జీఎం, మణుగూరు ఏరియా

సూపర్‌వైజర్‌స్థాయి అధికారి పర్యవేక్షణలో..

గని సైట్‌ కార్యాలయంలోని ఓ గదిలో పెద్ద డిస్‌ప్లేను ఏర్పాటు చేసి క్వారీలోని బెంచీల్లో జరిగే ఉత్పత్తి, ఓబీ వెలికితీత ప్రక్రియను నిత్యం ఓ సూపర్‌వైజర్‌ స్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు. గనుల్లో ఉత్పత్తి యంత్రాలు, రవాణా వాహనాలు మరమ్మతులకు గురైనపుడు సీసీ కెమెరాల ద్వారా గమనించి తక్షణమే అక్కడికి ఇతర యంత్రాలు, వాహనాలను పంపించే అవకాశం ఉంటుంది. హాల్‌ రోడ్లపై సాంకేతిక లోపంతో నిలిచిన డంపర్లను వెనక్కి రప్పించే వెసులుబాటు ఏర్పడనుంది. యంత్ర సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ, ఒక బెంచ్‌ నుంచి మరో బెంచ్‌కి డంపర్లు ఖాళీగా తిరగకుండా, సమయం వృథా కాకుండా చర్యలు చేపట్టి ట్రిప్పులు పెంచే అవకాశం ఉంటుంది. డంపర్ల వేగ నియంత్రణ, ఎదురెదురుగా వచ్చే డంపర్లు, ఒక దాని తర్వాత మరొకటి వెళ్తున్న డంపర్లు నిబంధనల ప్రకారం వెళ్తున్నాయో లేదో కూడా తెలుసుకోవచ్చు. దీంతో వానాకాలం వచ్చే ఉత్పత్తి లోటును తగ్గించుకునే అవకాశం ఉంటుందని యాజమాన్యం భావిస్తోంది. ఉత్పత్తి లక్ష్యం సునాయాసంగా సాధించే వీలు కలుగుతుందని అధికార వర్గాలు, కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement