రామయ్యకు సువర్ణ తులసీ అర్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Jun 8 2025 12:17 AM | Updated on Jun 8 2025 12:17 AM

రామయ్యకు  సువర్ణ తులసీ అర్చన

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని రామయ్య మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజ లు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భ గుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణా న్ని శాస్త్రో కంగా జరిపారు. వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో భక్తులు అధికంగా వచ్చారు.

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదల

కొత్తగూడెంఅర్బన్‌: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో గత ఏప్రిల్‌లో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి, ఉమ్మడి జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో–ఆర్డినేటర్‌ మద్దినేని పాపారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పదోతరగతి పరీక్షలకు 654 మంది హాజరు కాగా 203 మంది ఉత్తీర్ణులయ్యారని, 31.04 శాతం ఉత్తీర్ణత నమోదైందని పేర్కొన్నారు. ఇంటర్‌లో 758మంది పరీక్ష రాయగా, 388 మంది పాసయ్యారని, 51.19 శాతం ఉత్తీర్ణత నమోదయిందని తెలిపారు. రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు ఈ నెల 12 నుంచి 18వ తేదీ లోగా వెబ్‌సైట్‌, మీసేవ సెంటర్లలో ఫీజుచెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రీ కౌంటింగ్‌ కోసం ఒక్కో సబ్జెక్ట్‌కు ఇంటర్మీడియట్‌లో రూ.400, పదో తరగతిలో రూ.350, రీ వెరిఫికేషన్‌ కోసం ఒక్కో సబ్జెక్ట్‌కు ఇంటర్‌, పదోతరగతిలో రూ.1200 చెల్లించా లని వివరించారు.

11న చండీహోమం

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఈ నెల 11న చండీహోమ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్‌. రజనీకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. పూజలో పాల్గొనే భక్తులు రూ. 2,516 చెల్లించి గోత్రనామాలను నమోదు చేసుకోవా లని కోరారు. పూజలో సంప్రదాయ దుస్తులు మగవారు ధోతి, కండువా, మహిళలు చీర ధరించాలని సూచించారు. పూర్తి వివరాలకు 63034 08458 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

రేపటి నుంచి డీసెట్‌ కౌన్సెలింగ్‌

ఖమ్మం సహకారనగర్‌: బీఈడీ కోర్సులో ప్రవేశానికి తెలంగాణ డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు(టీజీడీఈఈ సీఈటీ – డీ సెట్‌)లో అర్హత సాధించిన అభ్యర్థులకు సోమవారం నుంచి కౌన్సెలింగ్‌ జరగనుంది. ఖమ్మం డైట్‌ కళాశాలలో ఈనెల 9నుంచి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. ఇందు కోసం నాలుగు బృందాలను నియమించారు. అర్హత సాధించిన అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో హాజరుకావాలని డైట్‌ ప్రిన్సిపాల్‌ సామినేని సత్యనారాయణ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement