
వెంగళరాయసాగర్ అలుగుకు మోక్షం
● రూ.33.55 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ● భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జారె
చండ్రుగొండ: మండలంలోని సీతాయిగూడెం శివారులో ఉన్న వెంగళరాయసాగర్ అలుగు నిర్మాణానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బుధవారం భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. అలుగు పునఃనిర్మాణానికి ప్రభుత్వం రూ.33.55 కోట్లు మంజూరు చేసింది. సుమారు ఐదేళ్ల కిందట అలుగుకు పెద్ద ఎత్తున గండి పడింది. ఏడు గ్రామాల రైతులకు సంబంధించి 2,200 ఎకరాల ఆయకట్టు ఈ ప్రాజెక్ట్ కింద ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అలుగు నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చానని, రెండు నెలలల్లో పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని తాను స్వయంగా కలిసి చేసిన విజ్ఞప్తి మేరకు నిధులు కేటాయించారన్నారు. అశ్వారావుపేటలోని పెద్దవాగు, ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్ట్ల అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, ఈఈ సురేశ్కుమార్, డీఈ కృష్ణశంకర్, ఏఈ నర్సింహారావు, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ అశోక్, పీఆర్ డీఈ సైదురెడ్డి, నాయకులు భోజ్యానాయక్, నల్లమోతు రమణ, సారేపల్లి శేఖర్, ఉప్పతల ఏడుకొండలు, ఫజల్, కిరణ్రెడ్డి పాల్గొన్నారు.