జీవనంలో సగపాలు | - | Sakshi
Sakshi News home page

జీవనంలో సగపాలు

Jun 1 2025 12:13 AM | Updated on Jun 1 2025 12:13 AM

జీవనం

జీవనంలో సగపాలు

జీవన ప్రమాణాలు మెరుగుపర్చేది పాడిపరిశ్ర మ●
● పౌష్టికాహారంలో పాలకే ప్రాధాన్యత ● ఉమ్మడి జిల్లాలో మెరుగ్గా పాల ఉత్పత్తి ● త్వరలోనే ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు ● నేడు ప్రపంచ పాల దినోత్సవం

ఖమ్మంవ్యవసాయం: పాలు, పాల ఉత్పత్తులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పాలు ఆరోగ్యకరమైన ఆహారం. జీవనోపాధి, సమాజ ప్రయోజనాలకు పాడి పరిశ్రమ ఎంతగానో దోహదపడుతుంది. జీవన ప్రమాణాలను మెరుగుకు పాడి పరిశ్రమ ప్రధాన భూమిక పోషిస్తుందనటంలో సందేహం లేదు. మానవాళి జీవనంలో పాలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ నేపథ్యాన ఆదివారం అంతర్జాతీయ పాల దినోత్సవం సందర్భంగా కథనం.

పాల ఉత్పత్తికి పెరుగుతున్న ప్రాధాన్యం

మనిషి ఆరోగ్యం పాల ఉత్పత్తులపై ఆధారపడటంతో ఆయా ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యాన ప్రభుత్వాలు పాడి పరిశ్రమకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. వ్యవసాయ పరంగా ముందంజలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాడి పరిశ్రమపైనా రైతులు మక్కువ కనబరుస్తునానరు. ఉమ్మడి జిల్లాలో గేదె పాలు ఉత్పత్తి ఎఉ్కవగా ఉండగా.. ప్రభుత్వం 25 వేల లీటర్ల సామర్థ్యంతో పాడి పరిశ్రమ (విజయ డెయిరీ)ను నిర్వహిస్తోంది. ఖమ్మంలోని ఈ పరిశ్రమకు అనుబంధంగా కామేపల్లి, మధిర, ఎర్రుపాలె, కల్లూరు, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెంలలో 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన పాల శీతలీకరణ కేంద్రాలు నిర్వహిస్తున్నారు.

227 గ్రామాల్లో పాల సేకరణ

పాల శీతలీకరణ కేంద్రాల ఆధారంగా ఉమ్మడి జిల్లాలో 30 మండలాల్లోని 227 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ పాల సేకరణ కేంద్రాల్లో 3,025 మంది ఉత్పత్తి చేసే పాలను విక్రయిస్తున్నారు. ఖమ్మం జిల్లా పాల ఉత్పత్తిదారుల నుంచి ప్రస్తుతం రోజుకు 7,750 లీటర్ల పాలను సేకరిస్తుండగా, కొత్తగూడెం జిల్లా నుంచి 2,500 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. ఈ మొత్తం నుంచి ఖమ్మం జిల్లాలో 1,000 లీటర్లు, కొత్తగూడెం జిల్లాలో 2,600 లీటర్లు విక్రయిస్తున్నారు. విజయ పాల ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రాధాన్యం ఆధారంగా ఉమ్మడి జిల్లాలో 6 డెయిరీ పార్లర్లు నడుస్తున్నాయి. వెన్నశాతం ఆధారంగా పాడి పరిశ్రమ రైతుల నుంచి పాలను సేకరిస్తోంది. ప్రభుత్వం ఇటీవల పాల ధరను పెంచింది. 10 వెన్నశాతం ఉన్న గేదె పాల ధరను రూ.80 నుంచి 84.60కు, వెన్నశాతం 7 ఉన్న గేదె పాల ధర రూ.56 నుంచి రూ.59.50లకు పెంచింది.

ఇందిరా డెయిరీతో పెరగనున్న ఉత్పత్తి

రాష్ట్ర ప్రభుత్వం మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళా డెయిరీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. సభ్యులైన మహిళలకు రెండు గేదెల చొప్పున సబ్సిడీపై అందించనున్నారు. మధిర, ఎర్రుపాలెం, ముదిగొండ, చింతకాని, బోనకల్‌ మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. ఇప్పటికే ఎర్రుపాలెంలో బల్క్‌ మిల్క్‌ కేంద్రం ఉండగా, బోన కల్‌, చింతకాని, మధిర, ముదిగొండల్లో ఒక్కో మండలంలో 2,500ల నుంచి 5 వేల సామర్థ్యం కలిగిన బల్క్‌మిల్క్‌ సెంటర్ల ఏర్పాటు ప్రతిపాదనలు చేశారు.

ఆరోగ్యం.. శక్తి

పాలలో మన శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, జింక్‌, పాస్ఫరస్‌, అయోడిన్‌, ఐరన్‌, పొటాషియం, ఫోలేట్స్‌, విటమిన్‌–ఏ, బిటమిన్‌–డీ, రైబోఫ్లేవిన్‌, విటమిన్‌ బీ–12, ప్రోటీన్‌, హెల్తీ ఫ్యాట్‌ వంటివి ఉంటాయి. నిత్యం సగటున ఒక మనిషికి 274 గ్రాముల పాలు, పాల పదార్థాలు అవసరం. మన దేశంలో ఒక్కో మనిషికి సగటున 186 గ్రాములు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 100 గ్రాములకు మించి పాల ఉత్పత్తులు అందటం లేదని నివేదికలు చెబుతున్నాయి.

రైతుల్లో పెరుగుతున్న అవగాహన

పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెరుగుతోంది. పాల ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుండటంతో పాడి పరిశ్రమపై కూడా రైతులు దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు గేదెలను పెంచుకొని, వాటి ద్వారా పాడిని ఉత్పత్తి చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. స్థానికంగా పాలు విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా డెయిరీలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఖమ్మం జిల్లాలో పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది.

–మోహనమురళి, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్‌, ఖమ్మం

జీవనంలో సగపాలు1
1/1

జీవనంలో సగపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement