
యువతి ప్రాణాలు కాపాడిన వైద్యులు
భద్రాచలంఅర్బన్: పురుగులమందు సేవించి, కోమాలోకి వెళ్లిన యువతికి 60 రోజులపాటు చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన వైద్యులను పలువురు అభినందించారు. వివరాలిలా ఉన్నాయి.. చర్ల మండలం లెనిన్కాలనీకి చెందిన మడకం రమేశ్ కుమార్తె శిరీష గత ఏప్రిల్ 1న పురుగులమందు తాగింది. ఆమెకు స్థానికంగా ప్రాథమిక చికిత్స చేయించి, భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి వైద్యం అందిస్తుండగా కోమాలోకి వెళ్లింది. తర్వాత 60 రోజుల పాటు ఐసీయూలోనే ఉంచి, చికిత్స అందించి, కోమా నుంచి బయటపడేలా చేశామని వైద్యులు తెలిపారు. ఇదే చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.25 లక్షలు అవుతుందని వారు వివరించారు. కాగా, ఆస్పత్రి సూపరింటెంటెండ్ రామకృష్ణ, వైద్యులు జగదీశ్ను జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అభినందించారు.
ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే
ఏరియా ఆస్పత్రిని శుక్రవారం భద్రాచలం ఎమ్యెల్యే తెల్లం వెంకట్రావు సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏసీయూలో చికిత్స పొందుతున్న శిరీషను పరామర్శించారు. కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, ఐసీయూ ఇన్చార్జ్ జగదీశ్ తదితరలు పాల్గొన్నారు.