రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

May 29 2025 12:12 AM | Updated on May 29 2025 12:12 AM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

బూర్గంపాడు: మండల కేంద్రం బూర్గంపాడులోని గౌతమిపురం వద్ద బుధవారం మోటార్‌సైకిల్‌ను కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. బూర్గంపాడులోని గిరిజన ఆశ్రమ పాఠశాల(బాలికలు)లో వంటమనిషిగా పనిచేస్తున్న కుర్సం జానకమ్మ(51) తమ బంధువు మోటార్‌సైకిల్‌పై బుధవారం మధ్యాహ్నం పాఠశాలకు వస్తోంది. ఈ క్రమంలో గౌతమిపురం వద్ద ఎదురుగా వస్తున్న కారు బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై వెనుక కూర్చున్న జానకమ్మ తారురోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్ర గాయాలు కావటంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. బైక్‌ నడుపుతున్న బంధువుకు, మధ్యలో కూర్చున్న ఆమె మనవడికి కూడా తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు ఆంధ్రప్రదేశ్‌లోని వీఆర్‌పురం మండలవాసి కాగా, ఉద్యోగరీత్యా బూర్గంపాడులో ఉంటోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement