
ఎన్ఎంఎంఎస్లో కొప్పరపాడు విద్యార్థుల ప్రతిభ
జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం
బల్లికురవ:. ఎన్ఎంఎంఎస్ ఫలితాల్లో బల్లికురవ మండలం కొప్పరపాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నట్లు ఎంఈవో–2 కె. రమేశ్బాబు శుక్రవారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఈ పరీక్షలకు 15 మంది విద్యార్థులు హాజరు కాగా పది మంది ఉపకార వేతనాలకు ఎంపికై నట్లు తెలిపారు. వీరిలో బొంతు భగత్ 149 మార్కులతో మొదటి స్థానం, పి.లక్ష్మీ అమూల్య 148 మార్కులుతో రెండో స్థానం, ఎస్కే మస్తాన్ 147 మార్కులుతో మూడో స్థానం కై వం చేసుకున్నారని తెలిపారు. వీరితోపాటు మరో ఏడుమంది స్కాలర్షిప్కు ఎంపికై నట్టు ఎంఈవో తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా కొప్పరపాడు పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం ఎన్ఎంఎంఎస్కు ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు, హెచ్ఎం పి. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు.
ఉపకార వేతనాలకు ఎంపిక
అమర్తలూరు(వేమూరు): స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్కు ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు కనపర్తి నిరీక్షణరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులకు జనవరి నెలలో పరీక్షలు నిర్వహించింది. అధిక మార్కులు సాధించిన వారికి నాలుగేళ్లు స్కాలర్షిప్లు అందించనుంది. పాఠశాలకు చెందిన విద్యార్థులు పెనుకొండ ఎందీవర్ 128 మార్కులు, షేక్ చాందిని 121 మార్కులు, జొన్నా భూమిక 102 మార్కులు సాధించారు. ఏటా రూ.12,000 చొప్పన ఇంటర్ వరకు అందనున్నాయి. విద్యార్థులను ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ వినయ్ అభినందించారు.

ఎన్ఎంఎంఎస్లో కొప్పరపాడు విద్యార్థుల ప్రతిభ

ఎన్ఎంఎంఎస్లో కొప్పరపాడు విద్యార్థుల ప్రతిభ

ఎన్ఎంఎంఎస్లో కొప్పరపాడు విద్యార్థుల ప్రతిభ

ఎన్ఎంఎంఎస్లో కొప్పరపాడు విద్యార్థుల ప్రతిభ

ఎన్ఎంఎంఎస్లో కొప్పరపాడు విద్యార్థుల ప్రతిభ