అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం

Jun 7 2025 1:46 AM | Updated on Jun 7 2025 1:46 AM

అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం

అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం

బల్లికురవ: బడుగు బలహీన వర్గాలపై అధికారులు, కూటమి నాయకులు వేధింపులకు పాల్పడుతున్నారని రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు అన్నారు. శుక్రవారం మండలంలోని రామాంజనేయపురం గ్రామానికి చెందిన నాగిపోగు ఏసురత్నం తనకు ఇచ్చిన ఇంటి స్థలంలో కొంత భాగానిన మరొకరికి పట్టా ఇవ్వడం పట్ల, కలెక్టర్‌, రెవెన్యూ అధికారులకు విన్నవించినా.. సమస్య పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తున్నారనే మనస్థాపంతో గురువారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తొలుత అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు, అనంతరం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతున్న ఏసురత్నాన్ని ఒంగోలులోని వైద్యశాలలో కొమ్మూరి కనకరావు పరామర్శించి ధైర్యం చెప్పారు. వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ దేవినేని కృష్ణబాబు, స్థానిక నేతలు ఉన్నారు. అలాగే మాదిగ సంక్షేమ పోరాట సమితి ప్రతినిధులు సుజన్‌ మాదిగ పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement