
ఆటోవాలకు మిత్ర ద్రోహం
కూటమి ఏడాది పాలనపై ఆటో డ్రైవర్ల ఆగ్రహం
చదువు లేని వారు...చదుకున్నా ఉద్యోగం రాని అనేక మంది ఆటోలనే నమ్ముకుని జీవితాలను గడుపుతున్నారు. పెరిగిన డీజిల్ ధరలు, నిత్యావసరాల ధరలు..పోలీసుల వేధింపుల కారణంగా రోజంతా కష్టపడినా వచ్చే కొద్ది సంపాదనతో కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నారు. ఆటో డ్రైవర్ల కష్టాలను గుర్తించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహన మిత్ర పేరుతో ఏడాదికి రూ.10వేలు చొప్పున ఐదేళ్లూ ఒక్కొక్క డ్రైవర్కు రూ.50 వేలు అందించారు. ఆటో డ్రైవర్లు కొంత మేర ఊపిరి పీల్చుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సాయాన్ని నిలిపివేసింది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాపట్లటౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అటకెక్కించింది. ఇచ్చిన హామీలను అమలుచేయకుండా సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఊసూరుమనిపిస్తోంది. అదే కోవలో బతుకుబండికి భరోసా లేకుండా చేసింది. ఆటో, మ్యాక్సీ, క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లకు నిరాశే మిగిలింది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా ప్రతి ఏడాదీ వాహనమిత్ర పథకం కింద ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ మొత్తాన్ని వాహనాల ఇన్స్యూరెన్స్, ఫిట్నెస్, చిన్నపాటి మరమ్మతులకు ఉపయోగపడేది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కార్ వాహనమిత్ర పథకాన్ని అమలు చేయకపోవడంతో డ్రైవర్లపైనే ఆర్థిక భారం పడుతోంది. మరోవైపు తనిఖీల పేరుతో అధిక మొత్తంలో రుసుములు విధిస్తుండటంతో రోడ్లపై వాహనాలు నడపాలంటేనే హడలిపోతున్నారు.
ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి
గతంలో వరుసగా ఐదేళ్లపాటు వాహనమిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆటోలు నడిపే మాలాంటి పేదలకు ప్రతి ఒక్కరికీ రూ.50 వేలు లబ్ధి చేకూరుంది. ఈ సొమ్మును ఆటో మరమ్మతులు, పిట్నెస్కు ఉపయోగించుకునేవారం. ప్రస్తుతం అధికారంలోఉన్న కూటమి సర్కార్ ఆర్థికసాయం అందించడం లేదు. మాలాంటి పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తే బాగుంటుంది.
–నూకబత్తుని రమేష్, కంకటపాలెం
పథకాలన్నీ అమలుచేయాలి
గతంలో మాకు ఏడాదికి వాహనమిత్ర పథకం ద్వారా రూ.10 వేల చొప్పున ఐదేళ్లపాటు రూ. 50 వేలు ఆర్థికసాయం అందజేశారు. వీటితోపాటు అమ్మఒడి, మహిళలకు డ్వాక్రా రుణాలు, రైతుభరోసా లాంటి పథకాల రూపంలో ప్రతి ఏడాదీ మా అకౌంట్లో నగదు జమ అయ్యేవి. ప్రస్తుతం ఏ పథకాలు అమలుకాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పథకాలన్నీ అమలుచేస్తే మాలాంటి పేదలకు మేలు జరుగుతుంది. –గోరిపర్తి గోపి, రేపల్లె
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
ఓ వైపు భగభగ మండుతున్న భానుడు...పెరిగిన నిత్యావసర వస్తువులు, డీజిల్ ధరలతో ఆటోలు నడపాలంటేనే సతమతమవుతున్నాం. కనీసం రోజంతా కష్టపడినా ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో ప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో వాహనాల మరమ్మతులు, ఇన్స్యూరెన్స్, ట్యాక్స్లు కట్టుకునేవాళ్లం. ప్రస్తుతం చాలా ఇబ్బందిగా ఉంది.
–మాదాసు సుబ్బారావు, బాపట్ల
వాహనమిత్ర ఊసే ఎత్తని కూటమి సర్కార్ నాడు వాహనమిత్రతో ఆటో డ్రైవర్లకు భరోసా వరుసగా ఐదేళ్లు పథకాన్ని అమలుచేసిన జగన్ సర్కార్ జిల్లాలోని లబ్ధిదారులకు రూ.31.80 కోట్లు అందజేత కూటమి సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు నాడు కేసులంటే తెలియని వైనం..నేడు రోడ్డెక్కాలంటేనే భయం ఇన్స్యూరెన్స్, ఫిట్నెస్ చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు

ఆటోవాలకు మిత్ర ద్రోహం

ఆటోవాలకు మిత్ర ద్రోహం

ఆటోవాలకు మిత్ర ద్రోహం

ఆటోవాలకు మిత్ర ద్రోహం