
ఎనిమిదేళ్ల కష్టమే కన్నప్ప
నగరంపాలెం(గుంటూరువెస్ట్):ఎనిమిదేళ్ల కష్టమే కన్నప్ప చిత్రమని సినీనటుడు మంచు మోహన్బాబు అన్నారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం సాయంత్రం కన్నప్ప చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ సంయుక్త ఆధ్వర్యంలో జరగ్గా, ఏసీ కళాశాల నుంచి ఈవెంట్ వరకు ర్యాలీ కొనసాగింది. నటుడు మోహన్బాబు మాట్లాడుతూ కన్నప్పను పరమేశ్వరుడు ఆశ్వీరదించారని అన్నారు. ఈ చిత్రంలో నటుడు మంచు విష్ణు రెండు పాత్రలు పోషించారని, చాలా అద్భుతంగా నటించాడని చెప్పారు. మళయాళం, తమిళం, హిందీ, తెలుగు భాషల్లోని అగ్రనటులు పలు పాత్రల్లో పోషించారని, ఆయా పాత్రలకు వారిని అడిగిన వెంటనే ఒప్పుకున్నారన్నారు. అగ్రనటుడు ప్రభాస్, నేను బావ అని అప్యాయంగా పిలుచుకుంటామని, పాత్ర గురించి చెప్పగానే అందులో నటించేందుకు అంగీకరించాడని అన్నారు. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతిలో ఈవెంట్ చేద్దామని భావించామని, అయితే గుంటూరులో చేయడం ఆనందంగా ఉందన్నారు. చాన్నాళ్ల తర్వాత గుంటూరు వచ్చానని పేర్కొన్నారు. 1991 నుంచి తాడిశెట్టి వెంకట్రావుతో పరిచయం ఉందన్నారు.
కన్నప్ప నాలో మార్పు తీసుకొచ్చింది: విష్ణు
నటుడు మంచు విష్ణు మాట్లాడుతూ నా దేవుడు నాన్న అని, ఆయన లేకపోతే నేను లేనన్నారు. నటుడు ప్రభాస్కు ఎంతగానో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. కన్నప్ప చిత్ర ప్రయాణం నాలో ఎంతగానో మార్పు తీసుకువచ్చిందన్నారు. హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ మోహన్బాబు తమపై ఉన్న వాత్సల్యంతో ఈ చిత్రంలో పాత్ర ఇచ్చారన్నారు. పది కాలలపాటు కన్నప్పగా మంచు విష్ణు నిలిచిపోతాడని పేర్కొన్నారు. గుంటూరు బాగా పరిచయమైన స్థలమని, ఇక్కడ చదువుకున్నానని తెలిపారు. గతంలో ఈ ఊరు వచ్చి లారీలకు రంగులేశానని గుర్తుచేసుకున్నారు. దర్శకుడు ముకేష్ కుమార్సింగ్, నృత్యదర్శకుడు ప్రభుదేవా, నటులు రఘుబాబు, శివబాలాజీ, సప్తగిరి, ముకేష్రుషి చిత్ర బృందం పాల్గొన్నారు. అనంతరం మోహన్బాబును వెండి కిరిటీంతో సత్కరించగా, తాడిశెట్టి సోదరులను మోహన్బాబు సత్కరించారు.
హీరో విష్ణు పది కాలాలపాటు కన్నప్పగా నిలిచిపోతాడు ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు గుంటూరులో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు మోహన్బాబు