
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు
సంబేపల్లె : మండల పరిధిలోని శెట్టిపల్లె, నారాయణరెడ్డిపల్లె గ్రామాలలో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో పలువురు గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు ... మండల పరిధిలోని నాగిరెడ్డిగారిపల్లెకు చెందిన దొరబాబు, అక్క పద్మావతమ్మతో కలిసి ద్విచక్రవాహనంలో శెట్టిపల్లె నుంచి సొంత గ్రామానికి సీకే రోడ్డుపై వెళుతుండగా గంగన్నగారిపల్లె సమీపంలోని మలుపు వద్దకు రాగానే శెట్టిపల్లె నుంచి దేవపట్లకు వెళుతున్న కారు అదుపు తప్పి ముందు వెళుతున్న బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న దొరబాబు, పద్మావతితో పాటు మరొకరికి గాయాలయ్యయి. గాయపడిన వారిని 108 సాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే సంబేపల్లె అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన నాగేంద్ర తన భార్య హరితతో కలిసి చిన్నమండెంకు వెళుతుండగా నారాయణరెడ్డిపల్లె పంచాయతీ ముదివాండ్లపల్లె సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సంబేపల్లె పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు