విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

Jun 2 2025 1:07 AM | Updated on Jun 2 2025 1:07 AM

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

ప్రొద్దుటూరు కల్చరల్‌ : విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు చేకూరుతుందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పేర్కొన్నారు. స్థానిక పద్మశాలీయ కల్యాణ మండపంలో ఆదివారం ది బీసీ ప్రజాచైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో బీసీ విద్యార్థులకు 15వ ప్రజ్ఞా పురస్కార ప్రదానోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అంతరాలను తొలగించడానికి విద్య ఒక్కటే సాధనమన్నారు. విద్యార్థులకు మంచి ఆలోచనా దృక్పథం అవరసరమన్నారు. వెనుకబాటు తనాన్ని అధిగమించాలంటే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి తొగర్ల చిరంజీవులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలన్నారు. సోషల్‌ మీడియాను మంచికే ఉపయోగించుకోవాలన్నారు.

కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement