
● అన్నదాత సుఖీభవకు ఎదురుచూపులు
సాక్షి రాయచోటి: ఎన్నెన్నో హామీలు...మరెన్నో ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ అమలులో అలక్ష్యం చేస్తోంది. గత ఖరీఫ్, రబీలో పంటలు వర్షాభావంతో ఎండిపోయి కరువు పరిస్థితుల్లో చిక్కి విలవిల్లాడిపోతున్న అన్నదాతను ఆదుకోవడంలో ఇప్పటికీ కూటమి సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. అన్నదాత సుఖీభవ అందిచడంలో శ్రద్ద కనిపించడం లేదు.
ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పినా ఇప్పటికీ చిల్లిగవ్వ ఇవ్వలేదు. ప్రభుత్వ పగ్గాలు చంద్రబాబు చేపట్టి దాదాపు ఏడాది కావస్తున్నా పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతన్న ఖరీఫ్ ఆశలపై నీలి నీడలు అలుముకున్నాయి. గతంతో వైఎస్సార్ సీపీ సర్కార్ వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించింది. ఉచిత పంటల బీమా పథకంతోపాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో వెంటనే ఇన్ఫుట్ సబ్సిడీ అందించడం, ప్రతి ఏడాది కరువు బారిన పడిన రైతులను ఆదుకోవడం, ఖరీఫ్కుముందే వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తూ రైతులను వ్యవసాయ పరంగా ఆదుకుంది.
కూటమి సర్కార్ రైతన్నకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో అన్నదాతలు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అమలు చేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. గతంలో మే నెలలో రైతు భరోసా సొమ్ములు తీసుకుని పంట సాగుకు వినియోగించుకునేవారు. అయితే ఇప్పటి కూటమి సర్కార్ ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో రైతన్నలు పంటల సాగుపై ఆలోచనలో పడ్డారు. అయితే ఇప్పటికీ కూడా ఒకే విడతలో అన్నదాత సుఖీభవకు సంబంధించి చెప్పిన ప్రకారం రూ. 20 వేలు వేస్తారా? లేక ఎన్ని విడతల్లో వేస్తారో అన్నది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాదు...కుటుంబంలో ఒకరికే ఇస్తారన్న ప్రచారంతో రైతన్నలు కృంగిపోతున్నారు. మరోవైపు జూన్ నుంచి ఖరీఫ్ సాగు మొదలు కానున్న తరుణంలో ప్రభుత్వం అన్నదాత సుఖీభవపై స్పష్టత ఇవ్వకపోవడం ఆందోళన కలిగించే పరిణామం.
● వైఎస్సార్సీపీ హయాంలో రూ.1360 కోట్ల పెట్టుబడి సాయం
ఏడాది అవుతున్నానయా పైసా విదల్చని సర్కార్
వైఎస్సార్ సీపీ హయాంలో ప్రతి ఏడాది మే నెలలో పెట్టుబడి సాయం
ఈ ఏడాది ఖరీఫ్ పెట్టుబడికిరైతన్నల ఎదురుచూపు

● అన్నదాత సుఖీభవకు ఎదురుచూపులు

● అన్నదాత సుఖీభవకు ఎదురుచూపులు