
వీడియో అనలిస్ట్గా వాల్మీకిపురం క్రీడాకారుడు
కలికిరి(వాల్మీకిపురం) : వాల్మీకిపురం పట్టణం తోటవీధిలో నివాసం ఉంటున్న శేషాద్రి ఆదినారాయణ, విజయలక్ష్మీ దంపతులు స్థానిక ఓ జనరల్ దుఖానం నిర్వహిస్తున్నారు. వీరి కుమారుడు శేషాద్రి సంపత్ చిన్ననాటి నుంచి క్రికెట్పై మక్కువతో ఉండేవాడు. స్థానికంగా జీవీసీసీలో జరిగే క్రికెట్ పోటీలలో పాల్గొని సత్తాచాటుతూ వచ్చారు. అయితే క్రికెట్తో పాటు ఎదుటి వారి ఆటను అంచనా వేయడంపై దృష్టి సారించి, ఎంచుకున్న విభిన్న పంతాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి 2023 సంవత్సరంలో అమెరికా జాతీయ క్రికెట్ జట్టులో ఫర్మార్మెన్స్, వీడియో అనలిస్ట్గా చేరడం అతని జీవితాన్ని మలుపు తిప్పినట్లైంది. యూఎస్ఏ క్రికెట్ జట్టు ఐసీసీ వరల్డ్కప్ లీగ్–2లో అగ్రస్థానంలో నిలిచి, 2027 వరల్డ్ కప్ అర్హత సాధించడానికి ముందుకెళ్ళడంలో సంపత్ విశ్లేషణా సామర్థ్యం కీలకంగా మారింది. యూఎస్ఏ తో పాటు బర్ముడా, ఇటలీ వంటి జాతీయ జట్లుతో ఫ్రాంచైజీ లీగ్లలో కూడా సంపత్ వీడియో అనలిస్ట్గా సేవలందిచాడు. క్రికెట్ దిగ్గజాలైన రాబిన్ సింగ్, ఓవైస్ షా, కెవిన్ ఓ బ్రియన్, జూలియన్వుడ్ వంటి వారితో కలిసి పనిచేసినట్లు సంపత్ తెలిపారు. పట్టణానికి చెందిన శేషాద్రి సంపత్ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటంతో తల్లిదండ్రులతో పాటు పట్టణ వాసులు హర్షం వ్యక్తపరుస్తున్నారు. ఎంచుకున్న వృత్తిలో అంకిత భావంతో పని చేసి ముందుకెళ్ళడమే చిన్ననాటి నుంచి సంపత్కు అలవాటని తల్లిదండ్రులు అంటున్నారు. క్రీడారంగంలో రాణించడానికి స్థానికులకు సంపత్ స్ఫూర్తిదాయకమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ కుటుంబం నుంచి
ఎదిగిన వైనం
స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న
సంపత్ క్రీడా ప్రస్తానం