
● జిల్లాలో ఆడబిడ్డ నిధి వివరాలు
సాక్షి రాయచోటి: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏదీ పడితే అది హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగా లేవంటూ బాబు నోట అదే మాట పదేపదే వినిపిస్తోంది..ప్రజలు అర్థం చేసుకోవాలంటూ చెబుతూనే మరోవైపు ప్రధాన హామీలను పక్కన పెడుతున్నారు. జగన్ చెప్పాడంటే....చేస్తాడంతే..అదే బాబు చెప్పాడంతే...చేయడంతే...అని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రమాణ స్వీకార అనంతరం పాలన ప్రారంభించి జూన్ 12కు సరిగ్గా ఏడాదవుతుంది. అయినా ఇచ్చిన హామీలపై కూటమి సర్కార్ ఇంకా అడుగులు ముందుకు వేయకపోవడంపై ప్రజల్లో చర్చకు దారి తీస్తోంది. అంతకుముందు 2014లోనూ అధికారంలోకి వచ్చిన బాబు రుణమాఫీతోపాటు అనేక హామీల విషయంలోనూ మాయ చేశారు. మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కింద ప్రతినెల రూ. 1500 అందజేస్తామని చెప్పినా ఊసే లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమన్నా ఇప్పటికీ వాయిదాల పర్వం కొనసాగుతోంది. తల్లికి వందనానికి సంబంధించి ఇప్పటివరకు సొమ్ము అందించలేదు. అదే వైఎస్ జగన్ సర్కార్ హయాంలో మహిళలే మహారాణులుగా...ఒక్క సమయం పెట్టుకుంటే గడువులోపు ఎన్ని కష్టాలున్నా అందించిన పరిస్థితి. పైగా వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదు రైనా వెనుకంజ వేయకుండా ప్రజలను ఆదుకున్న పరిస్థితులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.
ఆడబిడ్డకు భరోసా ఏదీ?
ఎన్నికలకు ముందు ప్రతి ఇంటిలోని ఆడబిడ్డలను ఆదుకుంటాం..నెలనెల రూ. 1500 చొప్పున అందిస్తామని ఊదరగొట్టిన అధినేత బాబు ప్రస్తుతం ఆడబిడ్డ గురించే మరిచిపోయారు. పాలనా పగ్గాలు చేపట్టి ఏడాదవుతున్నా కనీసం చూస్తాం, చేస్తాం అన్నమాట కూడా రాలేదు. ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి నెలకు రూ. 1500 చొప్పున వేసుకున్నా ఏడాదికి రూ. 18 వేలు అవుతుంది. ఈ సొమ్ములు మాకెప్పుడు ఇస్తారంటూ ఆడపడుచులు అడుగుతున్నా సమాధానం చెప్పేవారు లేరు. అన్నమయ్య జిల్లాలో సుమారు 3,65,650 మందికి పైగా ఆడబిడ్డలు ఉన్నారని అంచనా. సరాసరిని ఏడాదికి రూ. 658 కోట్లకు పైగా వారికి అందించాల్సిన పరిస్థితి ఉన్నా ప్రభుత్వం ఊసెత్తడం లేదు.
ఒక్కొక్కరికి
నెలకు
అందాల్సిన సొమ్ము
రూ.1500
మహిళలే మహారాణులు
ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి విస్మరించిన కూటమి సర్కార్
సూపర్సిక్స్వైపు అడుగులు పడకపోవడంతో అతివల్లో ఆందోళన
వైఎస్ జగన్ సర్కార్ హయాంలో అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట
అమ్మ ఒడి, సున్నావడ్డీ, చేయూతతో ఆర్థిక భరోసా
అర్హతగల మహిళలు (అంచనా):
3,65,650
2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం...వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి మహిళలకు పెద్దపీట వేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మొదలుకొని ప్రతి విభాగంలోనూ మహిళలను మహారాణులుగా చూడాలని భావించారు. అందుకు అనుగుణంగా అమ్మ ఒడి, కాపు నేస్తం, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ ఇలా ప్రతీది మహిళలను భాగస్వాములను చేయడంతోపాటు ఆర్థికంగా భరోసా కల్పించారు. అమ్మ ఒడి కింద జిల్లాలోని 1,57,292 మంది విద్యార్థులకు సంబంధించిన తల్లులకు ఒక్కొక్కరికి రూ. 15 వేలు చొప్పున ప్రతి ఏడాది రూ. 235–250 కోట్లు ఖర్చుచేసింది. అంతేకాకుండా జిల్లాలో 60,821 స్వయం సహాయక గ్రూపులు ఉండగా వారికి రూ. 166.04 కోట్లు చొప్పున సున్నా వడ్డీ అందించడం జరిగింది. వైఎస్సార్ చేయూత ద్వారా 79,157 మందికి రూ. 402.82 కోట్లు చొప్పున అందించారు. కాపు నేస్తం కింద 38,821 మంది మహిళలకు రూ. 58.23 కోట్లు, వైఎస్సార్ ఆసరా కింద 22289మందికి రూ. 395.65 కోట్లు చొప్పున అందించి మహిళల మనసుల్లో వైఎస్ జగన్ సర్కార్ చెరగని ముద్ర వేసుకుంది.
ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ఎప్పుడో?
కూటమి సర్కార్ ఉచిత బస్సు ప్రయాణంపై వాయిదా పర్వం సాగిస్తోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో అదిగో ఇదిగో అంటూ అప్పటికప్పుడు ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెడుతున్నట్లు హంగామా చేసినా తర్వాత ముందుకు అడుగు పడలేదు. ప్రతి మహిళకు ఉచిత ప్రయాణమని ఊదరగొట్టినా ఏడాదవుతున్నా..ఉచిత బస్సెక్కే అవకాశం మహిళలకు కల్పించలేదు. జిల్లాలో సుమారు 4,60,000 మంది ఉన్నారు. రోజువారిగా 482 బస్సుల్లో 1.30 లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తారు. అయితే అందులో 30 శాతం వేసుకున్నా 30 వేల మంది వరకు మహిళలు ప్రతిరోజు బస్సుల్లో రాకపోకలు సాగిస్తారని అంచనా. రోజుకు ఒక్కొక్క మహిళ సరాసరి రూ. 100 ఛార్జి వేసుకున్నా రూ. 30 లక్షల మేర ఖర్చు వస్తోందని ప్రభుత్వం అమలు చేయకుండా దాట వేస్తోంది.

● జిల్లాలో ఆడబిడ్డ నిధి వివరాలు

● జిల్లాలో ఆడబిడ్డ నిధి వివరాలు

● జిల్లాలో ఆడబిడ్డ నిధి వివరాలు

● జిల్లాలో ఆడబిడ్డ నిధి వివరాలు