పురాతన ఆలయాల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

పురాతన ఆలయాల అభివృద్ధికి కృషి

May 1 2025 2:03 AM | Updated on May 1 2025 2:03 AM

పురాతన ఆలయాల  అభివృద్ధికి కృషి

పురాతన ఆలయాల అభివృద్ధికి కృషి

పెద్దతిప్పసముద్రం : శిధిలావస్థకు చేరుకున్న పురాతన కాలం నాటి ఆలయాలను అభివృద్ధి చేస్తామని జిల్లా దేవదాయ శాఖ అధికారి విశ్వనాథ్‌ అన్నారు. విజయవాడలోని దేవదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు బుధవారం ఆయన మండలంలోని పలు ఆలయాలను అకస్మికంగా తనిఖీ చేసారు. మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి, విరూపాక్షేశ్వర్వామి, కందుకూరులోని పట్టాభి రామాలయాన్ని పరిశీలించారు. ఆలయాల్లో ఽనిత్య పూజలు, దూప,దీప నైవేధ్యాలు జరుగుతున్నాయా అని ఆరా తీశారు. అనంతరం కందుకూరు వ్యాసరాయ చెరువు కొండ వద్ద వెలసిన శ్రీ వేధగిరి నరసింహ స్వామి ఆలయాన్ని పరిశీలించారు. ఈ ఆలయం వద్ద ఎలాంటి జన సంచారం లేని విషయాన్ని గుర్తించిన పలువురు గుర్తు తెలియని దుండగులు గతంలో గుప్త నిథుల కోసం గోపురం, ధ్వజ స్తంభాలను ధ్వంసం చేశారని పూజారి గంగాధర్‌ శాస్త్రి, ఆలయ ధర్మకర్త కరణం ప్రకాష్‌రావ్‌లు దేవదాయ శాఖ అధికారికి వివరించారు. ఈ ఆలయ పునరుద్ధరణకు ప్రత్యేక చొరవ చూపాలని సూచించగా అధికారి సానుకూలంగా స్పందించి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. అనంతరం నవాబుకోట పంచాయతిలో శ్రీ భైరవేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం 363 సర్వే నంబర్‌లోని 15 సెంట్ల ప్రభుత్వ భూమి మంజూరు చేయాలని కోరుతూ భాస్కర్‌ అనే వ్యక్తి ఇటీవల జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోగా సదరు స్థలాన్ని కూడా జిల్లా అధికారి పరిశీలించారు. ఆయన వెంట అర్చకుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement