
కోదండ రాముడికి స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ టీటీడీ అధికారులు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి, పండితులచే స్వామివారిని అలంకరించి, పాలు, పెరుగు, నెయ్యి, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
రఘురామకృష్ణమరాజు డిప్యూటీ స్పీకర్గా అనర్హుడు
మదనపల్లె : నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం కమ్యూనిస్టులే. మీకు తెలియకపోతే మీ వాళ్లని అడగండి.. లేకుంటే మీ పార్టీ నేతలను అడిగి తెలుసుకోండి’ అని సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజుకు సూచించారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు అవమానకరంగా, అసభ్యకరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పేదల గుడిసెలు తొలగింపునకు నిరసనగా గళమెత్తిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పై అనుచితవ్యాఖ్యలు దారుణమన్నారు.