వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నంపై వైఎస్‌ జగన్‌ ఆవేదన | YS Jagan Takes On Chandrababu Sarkar Over YSRCP Party Supporter Incident, Check His Tweet Inside | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నంపై వైఎస్‌ జగన్‌ ఆవేదన

Jun 6 2025 10:54 PM | Updated on Jun 7 2025 11:28 AM

YS Jagan Takes on Chandrababu Sarkar

తాడేపల్లి:  సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో  వైఎస్సార్‌సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడన్నారు.  ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

‘ఆ కార్యకర్త గతంలో తన వ్యాపార భాగస్వాములు చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సీఐ, ఎస్సై విచారించినప్పటికీ, లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచిపెట్టారు. కాని, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇదే విషయంపై 2 నెలల తర్వాత సత్తెనపల్లి డీఎస్పీ పిలిపించుకుని తీవ్ర వేధింపులకు దిగారు. 

కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నువ్వు వైఎస్సార్‌సీపీలో ఎందుకున్నావు అని డీఎస్పీ తీవ్రంగా అవమానపరిచి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తామని, డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. దీంతో లక్ష్మీనారాయణ ఈ తెల్లవారు జామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ డీఎస్పీ దుర్మార్గంపై వీడియో వాంగ్మూలం ఇచ్చాడు. బాధ్యులైన వ్యక్తుల పేర్లతో లేఖ కూడా రాశాడు. ఇప్పుడు చావుబతుకుల మధ్య గుంటూరు ఆస్పత్రిలో ఉన్నాడు. లక్ష్మీనారాయణ కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనారాయణకు, ఆయన కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement