ఏపీలో 63లక్షలు దాటిన కరోనా పరీక్షలు | 63 Lakh Above Coronavirus Tests Made In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 63లక్షలు దాటిన కరోనా పరీక్షలు

Oct 8 2020 8:00 PM | Updated on Oct 8 2020 8:52 PM

63 Lakh Above Coronavirus Tests Made In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 63లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 66,944 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 5,292 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,39,719గా ఉంది. కరోనా నుంచి కొత్తగా 6,102 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,84,930గా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 42 మంది మృతి చెందగా.. మొత్తంగా రాష్ట్రంలో 6,128 కోవిడ్‌ మరణాలు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 63,49,953 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా రాష్ట్రంలో మిలియన్‌ జనాభాకు 1,18,913మందికి కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 11.65గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement