
‘మహాత్మా.. అధికారులకు బుద్ధి ప్రసాదించు’
అనంతపురం ఎడ్యుకేషన్: ‘మహాత్మా... మా పోస్టులు మాకు కేటాయించేలా అధికారులకు మంచి బుద్ధి ప్రసాదించు’ అంటూ ఇంగ్లిష్ పదోన్నతుల టీచర్లు విన్నవించుకున్నారు. మంగళవారం స్థానిక టవర్క్లాక్ సమీపంలోని మహాత్మ గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ధర్నా చేశారు. 21 జీఓ ప్రకారం 19 మాత్రమే ఖాళీలున్నాయంటూ చెబుతున్నారని వాపోయారు. కార్యక్రమంలో పదోన్నతుల జాబితాలోని సీనియర్ ఎస్జీటీలు జి. సూర్యుడు, కోనంకి చంద్రశేఖర్, జయపాల్ నాయుడు, నరసింహులు, లింగమయ్య, మహమ్మద్ రఫి, అంజి నాయక్, గోపాల్ రెడ్డి, పీరు నాయక్, వన్నారెడ్డి పాల్గొన్నారు. ఎస్టీయూ రమణారెడ్డి, యూటీఎఫ్ గోవింద రాజులు, ఏపీటీఎఫ్–1938 శ్రీనివాసులు రెడ్డి, సత్యప్రసాద్, ఆప్టా శంకరమూర్తి మద్దతు తెలిపారు.