ఆదర్శ రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ రైతు మృతి

Jun 22 2025 3:32 AM | Updated on Jun 22 2025 3:32 AM

ఆదర్శ

ఆదర్శ రైతు మృతి

కోటవురట్ల: మండలంలో కై లాస పట్నం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు, గ్రామ పెద్ద సిద్ధాబత్తుల చంటి అప్పారావు శనివారం మృతి చెందారు. చిన అప్పారావు పెద్ద కోడలు ఉమాదేవి జెడ్పీటీసీ కాగా, పెద్ద కుమారుడు సత్తిబాబు, చిన్న కుమారుడు నాగేశ్వరరావు వైఎస్సార్‌ సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. చంటి అప్పారావు మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏటికొప్పాక సుగర్‌ ఫ్యాక్టరీ నడిచే సమయంలో అత్యధికంగా చెరకు సరఫరా చేసిన రైతుగా చంటి అప్పారావు పలు అవార్డులను అందుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ కాకినాడ పార్లమెంట్‌ పరిశీలకుడు డి.వి. సూర్యనారాయణ రాజు, వైఎస్సార్‌ సీపీ జిల్లా వ్యవసాయ సలహా మండలి మండలి మాజీ చైర్మన్‌ చిక్కాల రామారావు, వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. సత్యనారాయణ రాజు తదితరులు చిన అప్పారావు కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు.

ఆదర్శ రైతు మృతి 1
1/1

ఆదర్శ రైతు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement