నిలకడగా కనిష్ట ఉష్ణోగ్రతలు
● దట్టంగా కురుస్తున్న మంచు
● వణికిస్తున్న చలిగాలులు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నిలకడగా కొనసాగుతున్నాయి. మంచు దట్టంగా కురుస్తోంది. చలిగాలులు వణికిస్తున్నాయి. బుధవారం ముంచంగిపుట్టు, అరకు వ్యాలీలో 15.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్/వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
● పాడేరు డివిజన్ పరిధి డుంబ్రిగుడలో 15.5 డిగ్రీలు, జి.మాడుగులలో 15.8 డిగ్రీలు, చింతపల్లిలో 16.0 డిగ్రీలు, పెదబయలులో 16.4 డిగ్రీలు, హుకుంపేటలో 16.5 డిగ్రీలు, పాడేరులో 16.6 డిగ్రీలు, కొయ్యూరులో 19.7 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు.
● రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 18.8 డిగ్రీలు, మారేడుమిల్లిలో 19.5 డిగ్రీలు, అడ్డతీగలలో 20.4 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 20.5 డిగ్రీలు, రంపచోడవరంలో 20.5 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. చింతూరు డివిజన్ చింతూరులో 21.6 డిగ్రీలు ఎటపాకలో 22.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు ఆయన వివరించారు.


