మత్స్యగుండానికి భక్తుల నీరాజనం | - | Sakshi
Sakshi News home page

మత్స్యగుండానికి భక్తుల నీరాజనం

Feb 28 2025 2:11 AM | Updated on Feb 28 2025 2:08 AM

సాక్షి, పాడేరు: ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం హుకుంపేట మండలంలోని మత్స్యగుండం క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు గురువారం సాయంత్రంతో ఘనంగా ముగిశాయి. చివరిరోజు ఈ క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్థానికులతోపాటు అనేక రాష్ట్రాలకు చెందిన భక్తులంతా మత్స్యలింగేశ్వరస్వామితోపాటు మత్స్యగుండంలోని మత్స్యదేవతలను దర్శించుకున్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మత్స్యలింగేశ్వరస్వామిని దర్శనం చేసుకుని లోక కల్యాణార్థం ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవాల చివరి రోజు భక్తులు భారీగా తరలిరావడంతో మత్స్యగుండం క్షేత్రమంతా రద్దీగా మారింది.

ఘనంగా రంప మల్లికార్జునుడి కల్యాణం

రంపచోడవరం: రంప భ్రమరాంబిక మల్లికార్జునస్వామి కల్యాణం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. డీఎస్పీ ప్రశాంత్‌కుమార్‌ దంపతులు, రాజవంశీకులు నరసింహరాజు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ధర్మ ప్రచార భక్తమండలి సమన్వయకర్త నల్లమిల్లి వెంకటరామారెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయని, స్వామివారికి విశేష పుష్పాలంకరణను శీతంశెట్టి రత్తిరెడ్డి (చిన్నోడు) బృందం చేసినట్లు తెలిపారు.

మత్స్యగుండం క్షేత్రంలో భక్తుల రద్దీ

మత్స్యగుండానికి భక్తుల నీరాజనం 1
1/3

మత్స్యగుండానికి భక్తుల నీరాజనం

మత్స్యగుండానికి భక్తుల నీరాజనం 2
2/3

మత్స్యగుండానికి భక్తుల నీరాజనం

మత్స్యగుండానికి భక్తుల నీరాజనం 3
3/3

మత్స్యగుండానికి భక్తుల నీరాజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement