-
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు
మరోవారం వచ్చేసింది. కాకపోతే ఈ వీకెండ్ సంక్రాంతి సందడి ఉండనుంది. ఇందుకు తగ్గట్లే 'గుంటూరు కారం', 'హనుమాన్', 'సైంధవ్', 'నా సామిరంగ' చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. ఆయా హీరోల ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్.. వీటి కోసం చాలా ఎదురుచూస్తున్నారు. మరి వీటిలో ఏది హిట్ అవుతుందనే ఆత్రుత కూడా ప్రతిఒక్కరిలో ఉంది. ఇదే టైంలో ఓటీటీలో కూడా బోలెడన్ని సినిమాలు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి. ఈ వారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే ఏకంగా 29 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. వీటిలో 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్', 'కిల్లర్ సూప్', 'అజయ్ గాడు' చిత్రాలతో పాటు 'ద లెజెండ్ ఆఫ్ హనుమాన్' సిరీస్ మూడో సీజన్ మాత్రం కాస్త ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అంటే థియేటర్లకి వెళ్లి కొత్త మూవీస్ చూసే ఇంట్రెస్ట్ లేకపోతే వీటిని ప్రిఫర్ చేయొచ్చనమాట. ఇంతకీ ఓటీటీల్లో ఏ సినిమా ఎప్పుడు రానుందనో తెలుసా? ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ (జనవరి 08 నుంచి 14 వరకు) నెట్ఫ్లిక్స్ ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా (ఇండోనేసియన్ సినిమా) - జనవరి 08 డైరీస్ సీజన్ 2 పార్ట్ 2 (ఇటాలియన్ సిరీస్) - జనవరి 09 పీట్ డేవిడ్సన్: టర్బో ఫంజరెల్లి (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 09 క్ పాయింట్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10 కింగ్డమ్ 3: ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్ సినిమా) - జనవరి 10 ద ట్రస్ట్: ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10 బాయ్ స్వాలోస్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11 ఛాంపియన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11 డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్ సిరీస్) - జనవరి 11 కిల్లర్ సూప్ (హిందీ సిరీస్) - జనవరి 11 మంత్ర సురుగణ (ఇండోనేసియన్ చిత్రం) - జనవరి 11 సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11 ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ (తెలుగు మూవీ) - జనవరి 12 అడిరే (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 12 లిఫ్ట్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 12 లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ (స్వీడిష్ సిరీస్) - జనవరి 12 డంబ్ మనీ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 13 అమెజాన్ ప్రైమ్ 90 హరి మెంకారి సువామి (ఇండోనేసియన్ సినిమా) - జనవరి 11 మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 11 రోల్ ప్లే (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 12 జీ5 అజయ్ గాడు (తెలుగు సినిమా) - జనవరి 12 హాట్స్టార్ ఎకో (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11 ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 12 సోనీ లివ్ చేరన్స్ జర్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 12 జియో సినిమా లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10 టెడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12 ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10 బుక్ మై షో జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 09 వన్ మోర్ షాట్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 09 -
OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!
సినీ ఆడియన్స్ ప్రస్తుతం ఓటీటీల పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే వారంలో సంక్రాంతి సందడి మొదలు కానుంది. ఇప్పటికే పొంగల్కు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్కు రెడీ అయిపోయాయి. ఈ వారంలో దాదాపు థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రం రిలీజ్ కానున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీల్లో ఏయే చిత్రాలు వస్తున్నాయో తెలుసుకోవాలనే ఆరాటంతో ఉన్నారు. ఈ వీకెండ్లో మిమ్మల్ని అలరించేందుకు పలు చిత్రాలు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అయితే ఈ వారంలో హాయ్ నాన్న, కంజూరింగ్ కన్నప్పన్, తేజస్, మెగ్ -2 లాంటి సినిమాలు కాస్తా ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీకీ రానుందో ఓ లుక్కేద్దాం. ఈ వీకెండ్లో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ నెట్ఫ్లిక్స్ డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) - జనవరి 04 హాయ్ నాన్న (తెలుగు సినిమా) - జనవరి 04 సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) - జనవరి 04 ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 04 కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 05 గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియోంగ్సోంగ్ క్రియేచర్ పార్ట్ 2(దక్షిణ కొరియా సిరీస్)- జనవరి 5 డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఇషురా (జపనీస్ సిరీస్) - జనవరి 03 పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) - జనవరి 05 అమెజాన్ ప్రైమ్ ఫో (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 05 లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జనవరి 05 జీ5 తేజస్ (హిందీ మూవీ) - జనవరి 05 బుక్ మై షో ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 05 వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియో సినిమా మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 03 సోనీ లివ్ క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 05 సైనా ప్లే ఉడాల్ (మలయాళ సినిమా) - జనవరి 05 క్రంచీ రోల్ సోలో లెవెలింగ్- (సౌత్ కొరియా సిరీస్)- జనవరి 6 -
పిల్లలూ తల్లులూ చల్లని వారే!
దృశ్యం:1 ప్రియాంక చోప్రా తన కూతురు మాల్తీ మేరీ జోనాస్ కోసం ఇంట్లో ‘ప్లే డేట్’ నిర్వహించింది. ఈ ఆటల కార్యక్రమానికి ప్రీతీ జింటా పిల్లలు జే, గియాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘ఇన్క్రెడిబుల్ వీకెండ్’ కాప్షన్తో ప్రియాంక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ పిల్లల ఆటల ఫొటోలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. ‘మంచి ఐడియా దొరికింది. మా చిన్నారి కోసం ఇలాంటి కార్యక్రమం త్వరలో మా ఇంట్లో ఏర్పాటు చేయనున్నాను’ అని ఒక నెటిజన్ స్పందించారు. దృశ్యం: 2 అమ్మ గురించి చెప్పడానికి ఎన్నో మాటలు అక్కర్లేదు. ‘అమ్మా’ అనే పిలుపులోనే ఎన్నో వినిపిస్తాయి. తల్లి ఒమ్న కురియన్ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే మై ఎవ్రీ థింగ్’ అంటూ ఇన్స్టాగ్రామ్లో శుభాకాంక్షలు తెలియజేసింది నయనతార. తన సర్వస్వం అయిన తల్లి గురించి ఎన్నో సందర్భాల్లో నయన్ చెప్పింది. ఇటీవలే ఇన్స్టాలోకి అడుగు పెట్టింది. తన కుమారులు ఉయిర్, ఉలాగ్లతో ఉన్న ఫస్ట్ పోస్ట్ 2.6 మిలియన్ల లైక్లను దక్కించుకుంది. -
ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్!
సాధారణంగా ఉద్యోగులు లాంగ్ వీకెండ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇటువంటి అవకాశం దొరికితే అలా బయట తిరిగిరావాలని చాలామంది తపన పడుతుంటారు. ఆగస్టు 15 ఈసారి మంగళవారం నాడువచ్చింది.(ఆరోజు ప్రభుత్వ అధికారిక సెలవుదినం). దానికి ముందురోజు అంటే సోమవారం(ఆగస్టు 14). దేశంలోని చాలామంది ఉద్యోగులకు ఆరోజు జ్వరం(సెలవు కోసం) వస్తుందట. లేదా తమ ఇంటిలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లేదా శుభకార్యాలు ఉన్నాయంటూ సెలవు కోరుతున్నారు. When your sick leave for Monday is actually approved 🤭 #LongWeekend | #Fan pic.twitter.com/79Jw2yx0CD — Yash Raj Films (@yrf) August 11, 2023 సోమవారం ఒక్కరోజు గనుక సెలవు లభిస్తే, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం వరుసగా 4 రోజులు సెలవులు వస్తాయి. దీంతో లాంగ్ వీకెండ్ లభిస్తుంది. ఈ సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయవచ్చని చాలామంది భావిస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పలు మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. వాటిలో జనం సెలవు కోసం ఎటువంటి కారణాలు చెబుతున్నారో తెలియజేస్తున్నారు. అవి ఎంతో ఫన్నీగా ఉంటూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇది కూడా చదవండి: ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్ఫీల్డ్పై రావడమేంటి?.. బుక్ చేసిన టెకీకి వింత అనుభవం! Leaving office on #Friday knowing it’s a long weekend 🚀 pic.twitter.com/OWD8Rn9pfH — Hemaang (@JrSehgal) August 11, 2023 People returning to offices on 16th August after the long weekend: pic.twitter.com/WaQDHXCcjf — Kanika Choudhary (@DalRotiForLife) August 9, 2023 Every employee planning for 14 August sick leave 🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/kkiLRG56US — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) August 11, 2023 Managers permit sick leave on 14 August...😁😁😀😀 pic.twitter.com/uz3XOc3Jn7 — Gramin Banker 🏦 (@bankarBabu) August 5, 2023 *me applying 14 august sick leave* manager: pic.twitter.com/6DxW7sntpp — oh well (@highondhaniya) August 8, 2023 -
సాక్షి మనీ మంత్రా: రికార్డ్ ర్యాలీ కొనసాగుతుందా?
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. దలాల్ స్ట్రీట్లో రికార్డుల మోత మోగుతోంది. గత కొన్ని వారాలుగా లాభాల దౌడుతీస్తున్న సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైం గరిష్టాలకు చేరాయి. ఈ స్థాయిల్లో నిలదొక్కుకోవడంతోపాటు, రికార్డు ముగింపులను నమోదు చేశాయి. స్టాక్ మార్కెట్ల జోరు దోహదం చేసిన అంశాలు.. ఏయే రంగాలు లాభాల్లో ఉన్నాయి.. రానున్న వారంలో సూచీల గమనం ఎలా ఉండబోతోంది. ఏయే అంశాల స్టాక్లను కదలికలను ప్రభావితం చేయనున్నాయి. ఈ అంశాలపై సాక్షి బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు ఐడీబీఐ క్యాపిటల్కు చెందిన స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఏకే ప్రభాకర్తో వీకెండ్ విశ్లేషణ అందించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) స్టాక్ మార్కెట్కు సంబంధించిన మరిన్ని విశేషాలు, విశ్లేషణల కోసం చూడండి ➤ సాక్షి బిజినెస్ -
వీకెండ్ లో ఫుల్గా చిల్ అవుతోన్న యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
సాక్షి మనీ మంత్రా: కొత్త ఇన్వెస్టర్లకు సానుకూలమేనా?
కొన్ని రోజులుగా వరుస లాభాల్లో దూసుకెళుతూ సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసిన దేశీయ సూచీలు వారంతంలో నష్టాలు చవిచూశాయి. అయితే కొన్ని రోజులుగా అంతర్జాతీ మార్కెట్లు ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నప్పటీకి దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల బాటలోనే నడిచాయి. ముఖ్యంగా దేశంలో తయారీ రంగం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆ రంగంపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారు. ఈ వారంలో దేశీయ స్టాక్మార్కెట్లో పరిణామాలు, లాభాలు అందుకున్న స్టాక్లు, వివిధ రంగాల్లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది.. తదితర అంశాలను అషికా బ్రోకింగ్ సంస్థకు చెందిన కౌశిక్ మోహన్తో కలిసి సాక్షి బిజినెస్ కరెస్పాండెంట్ కారుణ్య రావు విశ్లేషించారు. ఇప్పటికే ఉన్న మదుపర్లతోపాటు కొత్త ఇన్వెస్టర్లకు తమ సూచనలు అందించారు. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు ) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి -
ప్రభాస్ ఆదిపురుష్ ఈ వీకెండ్ వరకు కష్టమే
-
Generation-Z: వీకెండ్ కాపురాలు..రెండు రోజులు మాత్రమే ఒకరికొకరు
పెళ్లంటే రెండు జీవితాల కలయిక. నిండు నూరేళ్ల సావాసం. ఎన్ని కష్టనష్టాలెదురైనా జీవితాంతం ఒకరి చేయి మరొకరు విడిచిపెట్టకూడదు. ఒకేచోట కలిసుంటేనే బంధం బలపడుతుంది... ఇన్నాళ్లూ పెళ్లికి మనకి ఈ అర్థాలే తెలుసు... కానీ... నేటి జనరేషన్ జెడ్ పెళ్లికి కొత్త భాష్యాలు చెబుతోంది. ‘ఎవరి జీవితం వారిది. ఎవరి ఆర్థిక స్వాతంత్య్రం వారిది. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఒకరి కోసం మరొకరు వాటిని వదులుకోనక్కర్లేదు. అందమైన జీవితాన్ని మూడు ముళ్లతో బంధించి జీవితాంతం రాజీ పడనక్కర్లేదు’ వంటి ఆలోచనల నుంచి వీకెండ్ మ్యారేజెస్ కాన్సెప్టు పుట్టుకొచ్చింది. జపాన్లోనైతే ఇవి ట్రెండుగా మారాయి. భారత్లోనూ మెల్లిగా తెరపైకి వస్తున్నాయి... వీకెండ్ మ్యారేజెస్ అంటే..? ఇవాళ రేపు ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని లేదు. భర్త బయట పని చేసి డబ్బు సంపాదిస్తే, భార్య ఇంటిని చక్కదిద్దుకుంటూ గృహిణి జీవితం గడిపే రోజులు పోయాయి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి, జీవితంలో సర్దుకుపోవడానికి ససేమిరా అంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని బిజీ లైఫ్లో గడిపేస్తున్నారు. అందుకే పెళ్లి చేసుకొని ఒకే చోట ఉండడం కంటే వీకెండ్స్లో కలిసి ఉండాలని ముందే ఒక అవగాహన కుదుర్చుకుంటున్నారు. వారంలో అయిదు రోజులు ఎవరి జీవితం వారిది, మిగిలిన రెండు రోజులు ఒకరికొకరుగా కలిసి జీవిస్తారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. గుండెల నిండా గూడు కట్టుకున్న ప్రేమని పంచుకుంటూ రెండు రోజులు రెండు క్షణాల్లా గడిపేస్తారు. వీకెండ్ కాపురాలకు కారణాలు ► ఆఫీసులో పని ఒత్తిడితో ఆడ, మగ లైఫ్స్టైల్ వేర్వేరుగా ఉంటున్నాయి. ఒకరికి ఉదయం షిఫ్ట్ అయితే మరొకరికి రాత్రి షిఫ్ట్ ఉంటుంది. ఒకరి ఆఫీసు ఊరికి ఒక మూల ఉంటే, మరొకరిది మరో మూల ఉంటుంది. దీంతో ఒకేచోట కలిసుండే పరిస్థితి ఉండడం లేదు ► పెళ్లి చేసుకున్నా ఇద్దరిలో ఎవరికి వారే తాము పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. ► ముఖపరిచయం కూడా లేకుండా పెళ్లి చూపుల్లోనే ఒకరినొకరు చూసుకునే జంటలు ఒకరితో ఒకరు ఎంతవరకు జెల్ అవగలరో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ముందుగా వీకెండ్స్లో కలిసుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ► భార్యాభర్తలకి ఒకరి నుంచి మరొకరికి ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. ఆఫీసు నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చిన వారికి భాగస్వామి తమకి అనుకూలంగా లేకపోతే చిర్రెత్తుకొచ్చి దెబ్బలాటలకి దారి తీస్తాయి. అదే వీకెండ్స్లో మాత్రమే కలిస్తే, కలిసుండేది కాస్త సమయమైనా హాయిగా గడుపుదామని అనిపిస్తుంది. మళ్లీ వారం వరకు చూడలేమన్న ఫీల్తో ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగుకొస్తుంది. సర్ప్రైజ్లు, రొమాన్స్లు కొత్తగా వింతగా అనిపించి మానసికంగా ఎనలేని సంతృప్తి ఉంటుంది. ► ఆర్థికంగా ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది. ఎవరికి వారు వాళ్ల ఇళ్లల్లో ఉంటారు కాబట్టి డబ్బుల్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ► అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఈ మధ్య అందరూ తమకి మాత్రమే సొంతమైన ఒక స్పేస్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. వీకెండ్ కాపురాల్లో ఎవరికి కావల్సినంత స్పేస్ వారికి దొరుకుతుంది. భారత్లో కుదిరే పనేనా..? వీకెండ్ పెళ్లి పేరుతో వారానికోసారి కలుస్తామంటే అంగీకరించే సామాజిక పరిస్థితులు భారత్లో లేవు. ముంబైలాంటి నగరాల్లో కొందరు ప్రయోగాత్మకంగా వీకెండ్ కాపురాలు మొదలు పెట్టారు. ఆఫీసులు చెరో మూల ఉన్నప్పుడు ఇలా వీకెండ్స్లో కలవడమే బెటర్ అని నిర్ణయించుకునే జంటలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రోజంతా ట్రాఫిక్ జామ్లో పడి ఏ రాత్రికో ఉసూరంటూ ఇంటికి చేరడానికి బదులుగా ఎవరిళ్లలో వారుంటూ వీకెండ్ వరకు ఎదురు చూడడమే మంచిదన్న అభిప్రాయానికి నేటితరం వస్తున్నా కుటుంబాలైతే అంగీకరించడం లేదు. మన దేశంలో పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. వడం. కనుక öన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు తప్పనిసరి. పెళ్లి చేసుకుంటే ఒక కమిట్మెంట్తో ఉండాలి. జపాన్, చైనా వంటి దేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లలు కనడానికి యువతరం విముఖంగా ఉంటోంది. ఏళ్ల తరబడి పిల్లల్ని కనొద్దని ప్రభుత్వం పెట్టిన ఆంక్షలే శాపంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పసిపాపల బోసినవ్వులు కనిపించి ఏళ్లవుతున్నాయి. అందుకే పెళ్లి చేసుకొని వారంలో రెండు రోజులైనా కలిసుంటే చాలన్న స్థితి వచ్చింది. మన దగ్గర ఆలా కాదు. ముఖ్యంగా పిల్లలు పుడితే ఏం చేస్తారు ? తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ మధ్య పెరగాల్సిన పిల్లల్ని కూడా వారానికొకరని పంచుకోవడం అసాధ్యం. వ్యక్తిత్వం, ఆర్థిక స్వాతంత్య్రం పేరుతో వీకెండ్ కాపురాలు చేయాలని యువతరం భావించినా పెద్దలు వారిని అడ్డుకుంటున్నారు. అందుకే భారత దేశంలోని కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటోంది. ‘‘భారత్లో పెళ్లికి ఒక పవిత్రత ఉంది. దాన్నో ప్రయోగంగా మార్చాలని ఎవరూ అనుకోరు. ఇద్దరూ వారంలో రెండు రోజులు మాత్రమే కలిసుంటే వారిద్దరి మధ్య పరస్పర నమ్మకం, అవగాహన ఏర్పడడం కష్టం. భాగస్వామిలోనున్న లోపాలను కూడా ప్రేమించగలిగినప్పుడే ఆ వివాహం పదికాలాలు పచ్చగా ఉంటుంది. కానీ లోపాలను కప్పిపుచ్చుకుంటూ మనలో ఉన్న మంచిని మాత్రమే అవతలి వ్యక్తికి చూపించాలనుకున్నప్పుడు పెళ్లి అన్న పదానికే అర్థం లేకుండా పోతుంది’’ – శ్రేయా కౌలమ్, సైకాలజిస్ట్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
నుమాయిష్ నయా లుక్..సిద్ధమవుతోన్న ఎగ్జిబిషన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. గత రెండేళ్లుగా కరోనాతో పూర్తిస్థాయి వైభవానికి దూరమైన ఈ భారీ ప్రదర్శన... ఈసారి రెట్టించిన ఉత్సాహంతో సందర్శకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కొత్త కొత్త విశేషాలను జోడిస్తున్నామని, సందర్శకుల అనుభూతిని పెంచనున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు. కోవిడ్ మహమ్మారి సమస్యల కారణంగా షెడ్యూల్ ప్రకారం నుమాయిష్ నిర్వహించలేకపోయారు. కరోనాకి ముందు 45 రోజుల వ్యవధిలో సుమారు 20 లక్షల మంది ప్రజలు నుమాయిష్ను సందర్శించేవారు. వారాంతాల్లో ఒక్క రోజులో హాజరు 40,000 ఉండేది. అయితే కరోనాతో భారీగా పడిపోయిన ఈ సంఖ్యల్ని మళ్లీ తీసుకురావాలని సొసైటీ కృతనిశ్చయంతో ఉంది. ఆరంభమే...సంపూర్ణంగా... సాధారణంగా నుమాయిష్ జనవరి 1న ప్రారంభమైనా, స్టాల్స్ మొత్తం ఏర్పాటవడం అంటే అది సంక్రాంతి పండుగ తర్వాతే జరుగుతుంది. అయితే ఈసారి అలా కాకుండా తొలి రోజు నుంచే పూర్తిగా లేదా కనీసం 80 శాతం స్టాల్ యజమానులు తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించేలా చూడాలని ఎగ్జిబిషన్ సొసైటీ తమ లక్ష్యంగా పెట్టుకుంది. ‘సందర్శకులకు, స్టాల్ యజమానులకు ఉభయకుశలోపరిగా ఉండేందుకు అధికారిక ప్రారంభోత్సవం నుంచే పూర్తిస్థాయిలో స్టాల్స్ ఏర్పాటయేలా ప్రయత్నిస్తున్నాం,’అని ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అశి్వన్ మార్గం అన్నారు. ప్రారంభమైన స్టాల్స్ కేటాయింపు.. నుమాయిష్లో 10/12 విస్తీర్ణంలో స్టాల్స్ నిర్మాణం వేగంగా సాగుతోంది. భద్రతా కారణాలు, అగ్నిమాపక నిరోధక నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేస్తున్న కారణంగా అత్యవసర వాహనాలు వెళ్లేందుకు ఎక్కువ స్థలాన్ని అనుమతించడం వల్ల ఈ సారి స్టాళ్ల సంఖ్య కొంత తగ్గనుంది. గత సోమవారం నుంచి స్టాళ్ల యజమానులకు సొసైటీ కేటాయింపు లేఖలు అందజేయనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2,000 మంది వ్యాపారుల నుంచి దరఖాస్తులు రాగా, 1,200 స్టాల్స్ను కేటాయించనున్నారు. గత ఏడాది కొందరు జీఎస్టీ కట్టకుండా వెళ్లిపోయిన దృష్ట్యా ఈ దఫా స్టాల్స్కి జీఎస్టీతో కలిపి రూ.10 వేల చొప్పున అదనంగా కేటాయింపు పెంచారు. తెలంగాణ ఉత్పత్తులు పెడతామని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎమ్ఇ)ల నుంచి 50స్టాల్స్ కోసం వినతి రావడంతో వాళ్ల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తున్నామన్నారు. సందర్శన వేళలు పెంపు... వీకెండ్స్లో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో కనీసం రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్ను అనుమతించాలని సొసైటీ సంబంధిత అధికారులను కోరనుంది. ‘నగరమంతటా అర్ధరాత్రి వరకు మార్కెట్లు తెరిచి ఉంటాయి. కాబట్టి ఎగ్జిబిషన్ కూడా రాత్రి 10.30 గంటల నుంచి మరో గంట సమయం అధికంగా సడలింపును కోరుతున్నాము, తద్వారా రద్దీ తగ్గి, సందర్శకులు ఇక్కడ షాపింగ్ చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి తగినంత వ్యవధి లభిస్తుంది’అని అశ్విన్ చెప్పారు. సందర్శకులకు ఉచిత ‘వైఫై’ సౌకర్యాన్ని అందించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం్ఙ అని అన్నారాయన. ఈ సారి స్ట్రీట్ లైట్స్ వగైరాలతో మరింత సుందరంగా తయారు చేస్తున్నాం. అలాగే ఎంత రష్ ఉన్నా ఫ్రీ మూమెంట్ ఉంటుంది. తోసుకోవడం వంటివి ఉండదు. ఒకప్పుడు కార్నర్ స్టాల్స్ వరకూ వెళ్లగలిగేవారు కాదు. ఇప్పుడలా కాదు..ప్రతీ స్టాల్ మెయిన్ స్టాల్ తరహాలో కనిపిస్తుంది. అదే విధంగా గతంతో పోలిస్తే పాత్ వే 15 అడుగుల వరకూ పెంచాం. ‘వీటన్నింటి దృష్ట్యా నాలుగేళ్ల తర్వాత నుమాయిష్ ప్రవేశ రుసుమును రూ. ఒక్కొక్కరికి 40కి పెంచుతున్నాం’ అని అశ్విన్ మార్గం చెప్పారు. (చదవండి: ఆకాశ వీధి నుంచి.. అందాల వీక్షణం ) -
మస్క్ మామ మరో బాంబు: రోజుకు12 గంటలు, ఆఫీసులోనే నిద్ర!
న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ టేకోవర్ తరువాత సంస్థలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలు కీలక ఎగ్జిక్యూటివ్లపై మస్క్ వేటు, ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో బ్లూటిక్ కోసం నెలకు 8 డాలర్ల ఫీజు తదితర పరిణామాలు చకచకా జరిగిపోయాయి. తాజాగా మరో సంచలనం విషయం వెలుగులోకి వచ్చింది. రోజుకు 12 గంటలు పనిచేయాలని కొంతమంది ఉద్యోగులను ఆదేశించినట్టు తెలుస్తోంది. అంతేకాదు సిబ్బందికి ఇప్పటికే టాస్క్లు డెడ్లైన్స్ సెట్ చేశారట. అలాగే మేనేజర్ స్థాయి ఉద్యోగులు వీకెండ్ (శుక్ర,శనివారం)లో రాత్రి ఆఫీసుల్లోనే నిద్రించినట్టుగా ఉద్యోగులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఇదీ చదవండి: Elon Musk క్లారిటీ: బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు ఎంతో తెలుసా? ఎలాన్ మస్క్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉద్యోగులకు వారానికి ఏడు రోజులు, 84 గంటలు పనిచేస్తున్నారని, ఇప్పటికే చాలా మంది సిబ్బంది సాధారణం కంటే చాలా ఎక్కువ గంటలు పని చేస్తున్నారని సీఎన్బీసీ నివేదించింది. ముఖ్యంగా కొత్త బాస్ మస్క్ ఆధ్వర్యంలో ఉద్యోగులపై భారీగా వేటు పడనుందన్న అంచనాల మధ్య తమను తాము నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. స్ప్రింట్స్ పేరుతో వారాంతంలో పని చేయడానికి మస్క్ టీం ఇంజనీర్లలో కొంతమందికి కోడింగ్ ప్రాజెక్ట్లను కేటాయించిందని ఇన్సైడర్ గతంలోనే నివేదించింది. (Moonlighting టెక్ఎం సీఎండీ కీలక వ్యాఖ్యలు, ఒక్క మాటతో..!) కాగా 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ టేకోవర్ తరువాత తొలగింపుల అంశం ఉద్యోగుల్లో గుబులు పుట్టిస్తోంది. అలాంటి దేమీ లేదని ఇటీవల మస్క్ ప్రకటించినప్పటికీ ఆందోళన కొనసాగుతోంది. అయితే ఎంతమంది సిబ్బందిని ఎప్పుడు తొలగిస్తారు, ఏయే టీంలు ఎక్కువగా ప్రభావితమవుతాయనేది ప్రస్తుతానికి అస్పష్టం. -
వారంలో ఏడు రోజులు.. వాటిలో మీకు వరస్ట్గా అనిపించే రోజు ఇదే కదా?
వీకెండ్ ముగిసి... మండే వస్తుందంటే చాలు ఎక్కడ లేని నీరసం ముంచుకొస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలామంది సోమవారంనాడు ఆఫీసులకు బద్ధకంగా బాడీని ఈడ్చుకెళ్తారనొచ్చు. ఎవరో కొద్దిమంది తప్ప... స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్, ఉద్యోగులు.. అందరిదీ దాదాపు ఇదే ఫీలింగ్. అందుకే ప్రతి సోమవారం.. #మండేబ్లూస్ లేదా #మండేమార్నింగ్బ్లూస్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ మండేబ్లూస్ సిండ్రోమ్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీన్ని గిన్నిస్ సైతం గుర్తించింది. సోమవారాన్ని ‘వరస్ట్ డే ఆఫ్ ది వీక్’గా అధికారికంగా ప్రకటిస్తూ సోమవారం మధ్యాహ్నం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అట్లా పోస్ట్ చేసిందో లేదో... ట్విట్టర్ యూజర్స్ యమ స్పీడ్గా స్పందించేశారు. సోమవారానికి చెత్తవారంగా గిన్నిస్ రికార్డు ఇవ్వడం సూపర్ అంటున్నారు. ‘ఆ ఒక్కరోజే కాదు.. సుదీర్ఘ సెలవుల తరువాత వచ్చే ఏ వర్కింగ్ డే అయినా వరస్ట్ డేనే’అని మరికొందరు రీట్వీట్ చేశారు. (చదవండి: ఒక్క గంటలో అత్యధిక కప్పుల ‘టీ’ తయారు.. మహిళకు గిన్నిస్ రికార్డ్) we're officially giving monday the record of the worst day of the week — Guinness World Records (@GWR) October 17, 2022 -
కెఎస్ఆర్ కామెంట్ : వీకెండ్ పొలిటీషియన్ పవన్
-
వీకెండ్ మూడ్లోకి ఆనంద్ మహీంద్ర, మైండ్ బ్లోయింగ్ రియాక్షన్స్
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర అపుడే వీకెండ్ మూడ్లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. రానున్న వీకెండ్లో శుక్రవారానికే నా మైండ్ స్లో డౌన్ అయిపోతోందనుకుంట. అందుకే చిన్న జోక్ను అర్థం చేసుకోవడానికి కూడా నిమిషం టైం పట్టిందంటూ ఆయన ట్విట్ చేశారు. (సంచలన నిర్ణయం: ఐకానిక్ బేబీ పౌడర్కు గుడ్బై) వీకెండ్లో జ్యూస్ అని పలకడానికి కూడా బద్ధకం ..కేవలం ‘జూ’ తో సరిపెడతాం అనే అర్థం వచ్చేలా ఉన్న ఒక పిక్ను ఆయన పోస్ట్ చేశారు. విత్ ఐస్.. జ్యూస్, వితౌట్ ఐస్ జూ , జూ + ఐస్.. ఇలా.. పలు రకాలుగా నర్మగర్భంగా ఉన్న ఈ జోక్ను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఇంకో సంగతి కూడా తన ఫ్యాన్స్తో షేర్ చేశారు. ‘జోక్ అర్థమయ్యాక బిగ్గరగా నవ్వేశాను. దెబ్బకి మా ఆవిడ కుర్చీలోంచి జంప్ చేసింది’’ అంటూ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. ఇక దీనికి యథావిధిగా పలు మీమ్స్, కమెంట్స్తో నెటిజన్లు సందడి చేస్తున్నారు.(Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?) Maybe it’s Friday & my mind is slowing down for the oncoming weekend because it took me a minute to get the joke. When I did, I laughed out so loudly my wife jumped out of her chair… pic.twitter.com/4SfjHQ8xMt — anand mahindra (@anandmahindra) August 12, 2022 pic.twitter.com/5M8mNg2s5F — sanjay kumawat (@ShoryaSanju) August 12, 2022 pic.twitter.com/8gQst5XDHc — SHIVANG (@its_shivang) August 12, 2022 -
సెల్ ఫోన్ డ్రైవింగ్ వీకెండ్లోనే ఎక్కువ.. ఎందుకంటే!
చట్టాలు కఠినతరం చేస్తున్నా, జరిమానాలు భారీగా విధిస్తున్నా ట్రాఫిక్ ఉల్లంఘనలు ఆగడం లేదు. అడ్డదిడ్డంగా వాహనాలు నడపడం, సిగ్నల్స్ పట్టించుకోకపోవడం, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఐఐపీహెచ్), మరో రెండు స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన అధ్యయనంలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్తో పరేషాన్ హైదరాబాద్లో 16.5 శాతం మంది దిచక్ర వాహన చోదకులు డ్రైవింగ్ చూస్తూ ఫోన్ మాట్లాడుతున్నారని అధ్యయనంలో తేలింది. వీరిలో 71.7 శాతం మంది ఫోన్ను చేతితో పట్టుకోకుండానే వాహనాలు నడుపుతున్నారు. అంటే ఇయర్ఫోన్స్, బ్లూటూత్ వినియోగిడం లేదా ఫోన్ను హెల్మెట్ లోపల పెట్టుకుని మాట్లాడుతున్నారన్న మాట. వీక్డేస్(35.49%)తో పోలిస్తే వారాంతాల్లో సెల్ఫోన్ డ్రైవింగ్(64.51%) చేసే వారే ఎక్కువగా ఉన్నారు. బిజీ రోడ్లలో 26.08%, రద్దీ లేని రహదారుల్లో 73.92% మంది దిచక్ర వాహనదారులు ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు. రద్దీ సమయాల్లో పోలిస్తే(30.09%), రద్దీలేని సమయంలోనే (69.91%) ఈ ట్రెండ్ ఎక్కువగా కనబడుతోంది. చట్టంలో సవరణలు చేయాలి అధ్యయంలో భాగంగా మాదాపూర్ ఐటీ కారిడార్, అమీర్పేట, మేడ్చల్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను వీడియో తీసి విశ్లేషించారు. ఏయే సమయాల్లో ఆయా రహదారులపై వాహనదారులు సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారనే విషయాన్ని లోతుగా పరిశీలించారు. ‘ఎక్కువ మంది వాహన చోదకులు హేండ్ ఫ్రీ మోడ్లోనే డ్రైవ్ చేస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ బండి నడిపే వారి సంఖ్య వీకెండ్లోనే అధికంగా ఉంటోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నాన్-బిజీ రోడ్లపై రద్దీ తక్కువగా సమయంలోనే సెల్ఫోన్ డ్రైవింగ్ ఎక్కువగా కనబడుతోంది. వీక్డేస్తో పోలిస్తే ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారి సంఖ్య వారాంతాల్లో ఒకటిన్నర శాతం అధికంగా ఉన్నట్టు గుర్తించాం. చేతులతో ఫోన్ పట్టుకుని వాహనం నడిపేవారితో పాటు హేండ్ ఫ్రీ ఫోన్ డ్రైవింగ్ చేసే వారికి కూడా జరిమానాలు విధించేలా మోటార్ వెహికల్ చట్టంలో సవరణలు చేర్చాల’ని పరిశోధకులు కోరుతున్నారు. (క్లిక్: ఫోర్త్ వేవ్కు అవకాశాలు తక్కువ.. కానీ) మూడేళ్లలో 85 వేల కేసులు సెల్ఫోన్ డ్రైవింగ్ను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. గత మూడేళ్లలో 85,862 సెల్ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. ఫోన్ మాట్లాడుతూ.. వాహనాలు నడిపే వారిపై మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 184 కింద కేసులు నమోదు చేస్తామన్నారు. 85,862 కేసుల్లో దాదాపు 68,900 కేసులకు సంబంధించి జరిమానాలు వసూలయ్యాయని.. 16,782 జరిమానాలు పెండింగ్లో ఉన్నట్టు వెల్లడించారు. 2021లో 36,566 సెల్ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. (క్లిక్: మెడికల్ పీజీ ‘బ్లాక్’ దందా!) -
Weekend Curfew: వీకెండ్ లాక్డౌన్ ఎత్తివేత
సాక్షి, బెంగళూరు: కరోనా కట్టడిలో భాగంగా విధించిన వీకెండ్ లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కోవిడ్పై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన శుక్రవారం కృష్ణా అతిథి గృహంలో అత్యవసర సమావేశం జరిగింది. హోం, ఆరోగ్య, విద్య, జలవనరుల శాఖల మంత్రులు, బీబీఎంపీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్ మీడియాకు వెల్లడించారు. ఈ నెలారంభం నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. దీనికితోడు వారాంతపు నిర్బంధంతో ఇబ్బందులు పడుతున్నట్లు సామాన్యుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో నిపుణుల సూచన మేరకు వీకెండ్ లాక్డౌన్ వెనక్కి తీసుకున్నట్లు మంత్రి ఆర్.అశోక్ వెల్లడించారు. బెంగళూరు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కొనసాగుతాయన్నారు. రాత్రి కర్ఫ్యూ యథావిధిగా ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. చదవండి: (కరోనానే పెద్ద పరీక్ష!) బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, జాతరలకు అనుమతి లేదన్నారు. పబ్లు, క్లబ్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో 50 శాతం సీట్ల సామర్థ్యానికే అనుమతించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు తదితర ప్రాంతాల్లో జనాలు గుంపులు గుంపులుగా ఉండరాదన్నారు. కాగా బెంగళూరులో మరి కొన్ని రోజుల పాటు పాఠశాలలు మూతపడే ఉంటాయని, వచ్చే వారం నిపుణులతో మరోసారి సమావేశమై పాఠశాలల పునఃప్రారంభంపై తుది నిర్ణయం ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ తెలిపారు. -
Weekend Curfew: బెంగళూరులో నిశ్శబ్దం
సాక్షి, శివాజీనగర (బెంగళూరు): కరోనా వారాంతపు కర్ఫ్యూ రెండో రోజు కూడా రాష్ట్రంతో పాటు బెంగళూరులో నిశ్శబ్దం నెలకొంది. మహమ్మారి నియంత్రణ కోసం గత వారం నుంచి వీకెండ్ లాక్డౌన్ను అమలు చేయడం తెలిసిందే. శని, ఆదివారాలు సంక్రాంతి, కనుమ సంబరాల సందడి తక్కువగానే కనిపించింది. వ్యాపార సముదాయాలు, థియేటర్లు మూతపడడంతో నగరాలు బోసిపోయాయి. కూరగాయలు, ఔషధాలు, పాలతో పాటు అత్యవసర సేవలే అందుబాటులో ఉన్నాయి. దూర ప్రాంతాలకు మాత్రం తక్కువగా కేఎస్ఆర్టీసీ బస్సులు సంచరించాయి. బెంగళూరు బస్టాండులో పెద్దసంఖ్యలో బస్సులను నిలిపివేశారు. బెంగళూరులో జనసందడి ప్రాంతాలైన కే.ఆర్.మార్కెట్, శివాజీనగర, చిక్కపేట, ఎన్పీ రోడ్డు, జయనగరతో పాటు పలు మార్కెట్లు బంద్ అయ్యాయి. చదవండి: (Hyderabad-Lockdown: మళ్లీ లాక్డౌనా అనేలా హైదరాబాద్ పరిస్థితి) -
ఢిల్లీలో వీకేండ్ కర్ఫ్యూ
-
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ
న్యూఢిల్లీ: భారత్లోనూ రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరిగిపోతోంది. వరసగా 8వ రోజు కేసుల సంఖ్య పెరిగింది. దేశ రాజధానిఢిల్లీలో ఒమిక్రాన్ వేరియెంట్ విస్తృతంగా వ్యాపిస్తూ ఉండడంతో శని, ఆదివారాల్లో కర్ఫ్యూ విధించాల ని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్టుగా ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మంగళవారం తెలిపారు. బస్సులు, మెట్రో రైళ్లు తిరిగి 100 శాతం సామర్థ్యంతో పని చేస్తాయన్నారు. బస్సులు, మెట్రోల కోసం వేచి చూసే వారు సూపర్ స్ప్రెడర్లుగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 8.37%కు చేరింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటూ ఉండడంతో కరోనా సోకింది. మరోవైపు పంజాబ్ రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలన్నీ మూసివేసింది. సినిమా హాల్స్, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి. యూపీలో జనవరి 15 వరకు విద్యాసంస్థలను మూసివేశారు. 1892కి చేరుకున్న ఒమిక్రాన్ కేసులు గత 24 గంటల్లో దేశంలో 37,379 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య 1,892కి చేరుకుంది. -
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సర్కార్ సంచలన నిర్ణయం..!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యూఎఈలోని ఉద్యోగుల పనిదినాలను అక్కడి ప్రభుత్వం మార్చింది. ఉద్యోగులు ఇక వారానికి నాలుగున్నర రోజుల మాత్రమే పనిచేయవచ్చునని పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో పోటీతత్వాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో శని, ఆదివారాలను వారాంతపు సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా డబ్ల్యూఏఎం వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అమలులోకి రానుంది. యూఏఈలో శుక్రవారం, శనివారం సెలవు దినాలుగా ఉన్నాయి. ఇకపై ఆదివారం కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం సెలవు కావడంతో ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా సెలవు ప్రకటించడానికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 2022జనవరి 1వ తేదీ నుంచి వారాంతపు సెలవులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు మొదలై ఆదివారం ముగిసే వరకు కొనసాగుతాయి. యూఏఈ ఆర్థిక వ్యవస్థను సౌదీకి పోటీగా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు విదేశీ పెట్టుబడులను, ప్రతిభావంతులను ఆకర్షించేందుకు ఇప్పటికే గతేడాది పలు నిర్ణయాలు తీసుకొంది. మొదటి దేశంగా యూఎఈ రికార్డు..! ప్రపంచంలో ఐదు రోజుల కంటే తక్కువ జాతీయ పని వారాన్ని ప్రవేశపెట్టిన మొదటి దేశం యూఎఈగా నిలుస్తోందని డబ్లూఏఎం తెలిపింది. మాజీ బ్రిటీష్ ప్రొటెక్టరేట్ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వారంలోపే ప్రకటించడం విశేషం. 2006 వరకు గురువారం-శుక్రవారం సెలవులుగా ప్రకటించగా...అది శుక్ర, శనివారాలకు ప్రైవేట్ రంగానికి అనుమతినిచ్చింది. చదవండి: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి -
ఎంత క్యూట్గా రిలాక్స్ అవుతుందో .. నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది!
వారమంతా కష్టపడి పనిచేసి.. ఆదివారం రాగానే ఈసురో మంటూ మంచానికి అతుక్కుపోతాం. కానీ వీకెండ్ ఎంజాయ్ చేయడం కూడా ఓ కళ.. అది అందరికీ సాధ్యం కాదు. చాలామంది రకరకాలుగా రిలాక్స్ అవ్వడం చూస్తూనే ఉన్నాం..! ఐతే ఈ మధ్య కుక్కలు కూడా వీకెండ్ ఆచారాన్ని పాటిస్తున్నాయేమో అనే డౌట్ వస్తుంది ఈ వీడియో చూస్తే. బాబీ ది కార్గీ అనే యూజర్ పేర ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరుబయట స్వింగ్ చైర్లో చారగిల పడుకుని, కళ్లపై కీర స్లైస్ పెట్టుకుని, పైన బెడ్షీట్ కప్పుకుని రిలాక్స్గా పడుకున్న కుక్క ఈ వీడియోలో కనిపిస్తుంది. ‘మై కైండ్ ఆఫ్ వీకెండ్’ అనే క్యాప్షన్తో, నిద్రపోతున్న ముఖంతో కనిపిస్తున్న ఈ శునకానికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు వేలల్లో తెగ కామెంట్ చేస్తున్నారు. చదవండి: Salmonella Outbreak: ఉల్లి ఎంత పని చేసింది?.. 650 మందికి తీవ్ర అస్వస్థత.. నేను కూడా నీతో జాయిన్ అవ్వొచ్చా? చాలా రిలాక్స్గా కనిపిస్తున్నావ్ అని ఒకరు, ఇంత క్యూట్నెస్గా మేము కూడా ఎంజాయ్ చేయలేం.. అని మరొకరు, ఎంత పాంపర్డ్ లైఫ్!! నువ్వు దానికి అర్హురాలివని ఇంకొకరు హార్ట్ ఎమోజీలతో సరదాగా కామెంట్ చేస్తున్నారు. కాగా ఇన్స్టాగ్రామ్లో సెప్టెంబర్ 11న షేర్చేసిన పాత వీడియో అయినప్పటికీ.. తాజాగా నెట్టింట ఈ పోస్ట్ మళ్లీ వెరల్ అవ్వడంతో.. లక్షల్లో ఈ వీడియోను వీక్షిస్తున్నారు. చదవండి: అమెజాన్లో ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేస్తే..లబోదిబో!! View this post on Instagram A post shared by 9GAG: Go Fun The World (@9gag) -
బంపరాఫర్.. ఆ కంపెనీలో వారానికి 3 రోజులే పని..!
సాక్షి, హైదరాబాద్: ‘త్రీ డే వీక్’పని విధానం.. వినడానికి కొత్తగా ఉంది కదూ. అదేనండీ.. వారానికి మూడు రోజులు పనిచేస్తే చాలు. అదీ కూడా ఆఫీసుకు వస్తే రావొచ్చు లేదా ఎక్కడి నుంచైనా పనిచేయొచ్చు. వారానికి 20 నుంచి 25 గంటల వర్కింగ్ అవర్స్. ఇది వినడానికే ఎంతో బావుంది కదూ. మనకూ ఇలాంటి జాబ్ దొరికితే చాలు.. ఇంకా ఏమీ అవసరం లేదనే భావన అందరిలో ఏర్పడటం సహజమే. అయితే ఇవన్నీ కూడా వినడానికే కాదు ఆచరణలో అమలు చేస్తోంది బెంగళూరుకు చెందిన ఫైనాన్సియల్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ (ఫిన్ టెక్ కంపెనీ) ‘స్లైస్ ’. ఇండియన్ క్రెడిట్ కార్డ్ ఛాలెంజర్ స్టార్టప్గా ‘కోడ్ ఇన్ 3’ప్రోగ్రామ్లో భాగంగా ఈ సంస్థ దీనిని ప్రారంభించింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి వారంలో మూడు రోజుల పనికి 80 శాతం జీతం ఇతర సౌకర్యాలు కల్పిస్తోంది. తాము చేపడుతున్న పెద్ద ప్రాజెక్ట్ల కోసం ఫుల్టైమ్ ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, డిజైనర్లను రిక్రూట్ చేస్తోంది. ‘కొత్తగా ఆలోచించడం, నవీన ఆవిష్కరణలపై జిజ్ఞాస పెంచేం దుకు మా ప్రాజెక్ట్లో పనిచేసే టీమ్ సభ్యులకు వారు కోరుకున్న, అనువైన పని విధానాన్ని అమలు చేస్తున్నాం. వారికి ఇష్టమైన ప్రాజెక్ట్లపై పనిచేసే అవకాశం కలి్పంచడం, నచి్చనంత సమయం పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయి’అని 28 ఏళ్ల స్లైస్ వ్యవస్థాపకుడు, సీఈవో రాజన్ బజాజ్ చెబుతున్నారు. కొన్ని స్టార్టప్ కంపెనీలు వృత్తినిపుణులు, ఉద్యోగులను కాపాడుకోవడం కోసం, తగిన నైపుణ్యాలున్న వారిని ఆకర్షించేందుకు కొత్త ఆఫర్లు ఇస్తున్నాయి. సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్ ‘మీషో’సంస్థ తమ ఉద్యోగులకు వచ్చే నెల నవంబర్లో 10 రోజుల సెలవులు ప్రకటించింది. ఫిన్టెక్ స్టార్టప్ కంపెనీ భారత్పే తమ ఉద్యోగులకు బీఎండబ్ల్యూ బైక్లు, ఎల్రక్టానిక్ గ్యాడ్జెట్లు, దుబాయ్లో క్రికెట్ హాలిడే వంటి ప్రోత్సాహకాలను అందిస్తోంది. వృత్తినిపుణులకు పెరిగిన డిమాండ్తో... భారత్లో సాంకేతిక, వృత్తి నిపుణులకు వివిధ రం గాల్లో బాగా డిమాండ్ ఉంది. అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు అనేక దేశీయ టెక్ స్టార్టప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు వివిధ ప్రాజెక్ట్ల కోసం పెద్ద ఎత్తున నియామకాలు చేసుకుంటున్నాయి. దీంతో పాటు ఐటీ ఔట్సోర్సింగ్, సిలికాన్ వ్యాలీ కంపెనీలు, గ్లోబల్ రిటైల్ సంస్థలు, వాల్స్ట్రీట్ బ్యాంక్ల టెక్నాలజీ సెంటర్లు భారీగా వృత్తినిపుణులను చేర్చుకుంటుండటంతో నిపుణుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తున్నాయి. ఇతర కంపెనీల కంటే ఎక్కువ సెలవులు, ఇళ్లల్లో పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు స్త్రీలతో సమానంగా మగవారికి కూడా ‘పేరెంటల్ లీవ్స్’, వృత్తిçపరంగా మరిన్ని నైపుణ్యాలు పెంచుకునేందుకు.. ఇలా అనేక అవకాశాలు కలి్పస్తున్నాయి. పనివిధానాన్ని మార్చేసిన మహమ్మారి... కోవిడ్ మొదటి, రెండోవేవ్లు ప్రపంచాన్ని కుదిపేసాక కంపెనీలన్నీ కొన్నాళ్లు వర్క్ఫ్రంహోం, తర్వాత కొన్నిరోజులు ఆఫీసు, కొన్నిరోజులు ఇంటి నుంచి పనిచేయడం, ఇతర రూపాల్లో ‘హైబ్రిడ్ వర్కింగ్’విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వ, ఐటీ ఉద్యోగులకు 5రోజుల పని విధానం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. విదేశాల్లో కొన్ని సంస్థలు ‘ఫోర్ డే వీక్ వర్క్’విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేశాయి. అయితే, యూకేతో సహా పలు దేశాల్లో ఈ విధానం పెద్దగా విజయవంతం కాలేదు. ఇన్ని రోజులు, ఇన్ని గంటలు పనిచేయాలనడం కంటే.. తమకు సరిపోయే పనిగంటలు, నచి్చన విధానంలో పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించొచ్చుననే అభిప్రాయం వ్యక్తమైంది. ఇకపై హైబ్రిడ్ పద్ధతే... భవిష్యత్లో త్రీ డే, ఫోర్ డే వీక్ లేదా ఇళ్లు, ఆఫీసు, మరెక్కడి నుంచైనా ఏ సమయంలోనైనా పనిచేసే హైబ్రిడ్ పద్ధతికి దాదాపుగా అన్ని కంపెనీలు మారాల్సిందే. ఐటీలో ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూర్, ముంబై వంటి మెట్రో నగరాల్లో దీంతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వాహనాల రద్దీతోపాటు కాలుష్యం తగ్గుతుంది. మెంటల్ స్ట్రెస్ తగ్గి జీవనశైలి మెరుగవుతుంది. ఐతే ఫార్మా, ప్రొడక్షన్ ఇతర రంగాల్లో ఇలాంటి విధానాలు సాధ్యం కావు. –డా. బి. అపర్ణరెడ్డి, హెచ్ఆర్ నిపుణురాలు -
వారంలో మూడు రోజులు పనిచేస్తే చాలు..! తెరపైకి మరో కొత్త పాలసీ
3-Day Work Week: కరోనా రాకతో అన్ని కంపెనీలు వర్క్ ఫ్రంహోంకే జై కొట్టాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కాస్త తగ్గుముఖం పట్టింది. అదేవిధంగా భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. దీంతో పలు కంపెనీలు వర్క్ఫ్రం హోంకు ఎండ్కార్డు పెడుతూ ఉద్యోగులను ఆఫీసులకు పిలుస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు నెలలో కొన్ని రోజులు ఆఫీసులకు వస్తే సరిపోతుందంటూ పిలుపునిస్తున్నాయి. వర్క్ఫ్రంహోంకు క్లారిటీ రాకముందే ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ టీఏసీ సెక్యూరిటీస్ సరికొత్త వర్కింగ్ కాన్సెప్ట్ను ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. వారానికి నాలుగు రోజులు పనిచేస్తే సరిపోతుందంటూ టీఏసీ సెక్యూరిటీస్ సంస్థ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: అగ్రరాజ్యాలకు పోటీగా నిలుస్తోన్న భారత్...! మూడు రోజులు వస్తే చాలు..! తాజాగా బెంగుళూరుకు చెందిన ఫిన్టెక్ సంస్థ స్లైస్ మరో అడుగు ముందుకేసి కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. కంపెనీ ఉద్యోగులు వారంలో మూడు రోజులు పనిచేస్తే సరిపోతుందని స్లైస్ వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ వ్యవస్ధాపకుడు రాజన్ బజాజ్ మాట్లాడుతూ...‘దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ది వర్క్’ భవిష్యత్తులో ఇలాంటి వర్కింగ్ పాలసీలకే పలు కంపెనీలు మొగ్గుచూపుతాయన్నారు. ఈ సరికొత్త విధానంతో ఉద్యోగులను కేవలం జాబ్కే కట్టిపాడేయకుండా వారికి మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి దోహదం చేస్తోందని అభిప్రాయపడ్డారు. స్లైస్లో సుమారు 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కొత్త పాలసీతో రాబోయే మూడేళ్లలో కొత్తగా వెయ్యి మందిని రిక్రూట్ చేసుకోవాలని స్లైన్ భావిస్తోంది. భారీ పెట్టుబడులు..భారీ ఒత్తిడి..! గ్లోబల్ ఇన్వెస్టర్లు భారత టెక్ స్టార్టప్లపై బిలియన్ డాలర్లను కుమ్మరిస్తున్నాయి. దీంతో పలు స్టార్టప్ల్లో వేగవంతంగా పనిచేసేందుకు స్టార్టప్ యాజమానులు ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నుట్లు తెలుస్తోంది. దీంతో ఆఫీసులో ఉద్యోగుల పనితీరు,మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం తదితర అంశాల భారీ ప్రభావం పడుతుంది. ఆఫీస్ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందులో చాలా మంది ఆఫీసు జీవితంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఉద్యోగులు ఫెయిల్ అవుతున్నారు. చదవండి: ఆ వెబ్సిరీస్తో నెట్ఫ్లిక్స్కు కొత్త తలనొప్పి..! -
వారానికి నాలుగు రోజులే ఆఫీస్.. తెరపైకి కొత్త పాలసీ
4 - Day Work Week : ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్టు దిగిందా, లేదా... సూపర్హిట్ మూవీ పోకిరిలో పాపులర్ డైలాగ్. ఈ సినిమాతో సంబంధం లేకపోయినా ఉద్యోగుల్లో ఇలాంటి స్ఫూర్తినే నింపుతోంది ఓ ఇండియన్ కంపెనీ. ఎంత సేపు పని చేశామన్నది కాదు క్వాలిటీ వర్క్ ఉందా లేదా అంటోంది. అందులో భాగంగానే ఇండియాలో ఇంత వరకు లేని వర్క్ కల్చర్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలా లేక వర్క్ఫ్రం హోం కంటిన్యూ చేయాలా అనే విషయంపై అనేక కంపెనీలు కిందా మీద పడుతున్నాయి. వర్క్ఫ్రం హోంపై ఓ క్లారిటీ ఇంకా రాకముందే తాజాగా వారానికి నాలుగు పని దినాల కాన్సెప్ట్ని టీఏసీ సెక్యూరిటీస్ సంస్థ తెర మీదకు తెచ్చింది. ఉద్యోగులు ఏమన్నారంటే ఆఫీసులో పనితీరు, ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం తదితర అంశాలపై ఇటీవల టీఏసీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. అందులో చాలా మంది ఆఫీసు జీవితంలో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎప్పుడూ ఆఫీసులో గంటల తరబడి పనిలో ఉంటే పనిలో ఉత్సాహం, ఉత్తేజం లోపిస్తున్నాయని వెల్లడించారు. కుటుంబ, వ్యక్తిగత పనులు చక్కబెట్టుకునేందుకు వీకెండ్స్ సరిపోతున్నాయంటూ చెప్పారు. లాంగ్ వీకెండ్ ఉద్యోగుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా టీఏసీ యాజమాన్యం కొత్త ప్రతిపాదన ఉద్యోగుల ముందుకు తెచ్చింది. వారానికి ఐదు లేదా ఆరు రోజుల పని, రోజుకు ఎనిమిది గంటలు వంటి విధానాలు పక్కన పెట్టాలని నిర్ణయించింది. వారానికి నాలుగు పని దినాలు, లాంగ్ వీకెండ్ ఉండేలా కొత్త టైం టేబుల్ సిద్ధం చేసింది. వర్క్ లోడ్ను బట్టి పని దినాల్లో లాంగ్ అవర్స్ పని చేయాల్సి ఉంటుందని ఉద్యోగుల ముందు ప్రతిపాదనలు ఉంచింది. ఉద్యోగుల్లో 80 శాతం మంది వీటికి ఓకే చెప్పారు. దీంతో అర్జంటుగా వారానికి నాలుగు రోజులే పని అనే కాన్సెప్టు అమలుకు శ్రీకారం చుట్టింది. టార్గెట్ రీచ్ అయితే చాలు వ్యక్తిగత జీవితం ఆనందంగా ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడే ఉద్యోగుల నుంచి ఎక్కువ అవుట్ పుట్ వస్తుంది. అందుకే వారు లాంగ్ వీకెండ్, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. అందుకే ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఫలితాలు సానుకూలంగానే వస్తాయని ఆశిస్తున్నట్టు టీఏసీ ఫౌండర్ త్రిష్నీత్ తెలిపారు. ఉద్యోగులు ఎన్ని రోజులు ఎన్ని గంటలు పని చేశారన్నది మాకు ముఖ్యం కాదు. మేం పెట్టుకున్న గడువులోగా పని జరిగిందా లేదా అన్నదే మాకు ప్రధానం అని ఆయన అన్నారు. ఉద్యోగుల్లో ఆనందం టీఏసీ సీఈవో త్రిష్నిత్ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో ఆసక్తి నెలకొంది. ఈ కొత్త ప్రయోగం తీరు తెన్నులు పరిశీలిస్తున్నాయి. మరోవైపు టీఏసీ ఉద్యోగులు ‘కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు... ఆనందంగా గడపడానికి కావాలొక దీవి’ అన్నట్టుగా జోష్లో ఉన్నారు. టీఏసీ మొదలు పెట్టింది స్టార్టప్గా మొదలై రాబోయే మూడేళ్లలో వన్ బిలియన్ డాలర్ కంపెనీగా ఎదిగేందుకు వడివడిగా అడుగులు వేస్తోన్న టీఏసీ సెక్యూరిటీ సొల్యూషన్ సంస్థ 4 డే వర్క్ వీక్ కాన్సెప్టుని తెర మీదకి తెచ్చింది. 2013లో ఈ సంస్థని త్రిష్నీత్కి అరోరా స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 5 మిలియన్ డాలర్లు ఉండగా 2025 కల్లా వన్ బిలియన్ డాలర్లు సంస్థగా ఎదుగుతామంటూ ఇటీవల అరోరా ప్రకటించారు. వీడు సామాన్యుడు కాదు టీఏసీ సెక్యూరిటీస్ సీఈవో త్రిష్నీత్కి వినూత్నంగా ఆలోచిస్తాడనే పేరు బిజినెస్ సర్కిల్లో ఉంది. స్కూల్ఏజ్లో బ్యాక్ బెంచర్గా ఉంటూ మిడిల్ డ్రాప్ అయ్యాడు. ఫ్యామిలీలో ఎవరికి కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లేకుండానే కేవలం 19 ఏళ్ల వయస్సులో టీఏసీ సెక్యూరిటీస్ సంస్థను 2013లో స్థాపించాడు. ఎంట్రప్యూనర్గా ఉంటూనే హ్యకింగ్పై పలు పుస్తకాలు కూడా రాశాడు. సైబర్ సెక్కూరిటీకి సంబంధించి గుజరాత్, పంజాబ్ పోలీసు శాఖలతో కలిసి త్రిష్నీత్ పని చేస్తున్నాడు. టీఏసీ క్లయింట్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఉంది.2018లో ప్రఖ్యాత ఫోర్బ్ప్ ప్రచురించిన అండర్ 30 ఏషియా లిస్టులో త్రిష్నీత్కి చోటు దక్కింది. చదవండి : వర్క్ఫ్రమ్ హోమ్: కంపెనీల కొత్త వ్యూహం -
Photo Feature: రుషికొండ బీచ్లో.. వీకెండ్ జోష్
సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తరువాత వీకెండ్ను వైజాగ్ సిటి జనులు ఆస్వాదించారు. కర్ఫ్యూ వేళలు సడలింపులతోపాటు.. పర్యాటక ప్రాంతాలు తెరుచుకోవడంతో సందర్శకులు బీచ్లో వాలిపోయారు. అలలతో ఆడుకున్నారు. కెరటాలతో సయ్యాటలాడారు. ఆకాశమే హద్దుగా సరదాగా గడిపారు. రుషికొండ బీచ్లో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. -ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement