breaking news
train journeys
-
మృత్యువు అంచుల నుంచి రాజ భోగాల వరకు.. అద్భుత ప్రయాణాలు!
రైలు ప్రయాణం అంటే మనందరికీ ఇష్టమే..! చిన్నప్పటి జ్ఞాపకాల నుంచి నేటి ప్రయాణాల వరకు.. కిటికీ పక్కన కూర్చుని, చల్లటి గాలిని ఆస్వాదిస్తూ, బయట ప్రకృతిని చూడటం ఒక అందమైన, ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది. కానీ.. అదే రైలు ప్రయాణం మృత్యువుతో పోరాటంలాంటిదైతే? ఒక్క అంగుళం పట్టాలు తప్పినా, వేల అడుగుల లోతైన లోయలో పడిపోయే భయానక వాతావరణం ఉంటే? ఇంకోవైపు.. ఒక సాదాసీదా రైలు ప్రయాణం, ఏకంగా సెవెన్ స్టార్ హోటల్ను తలపించే విలాసవంతమైన రాజభోగం అయితే?.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, అదే సమయంలో కళ్లు చెదిరేంత లగ్జరీ రైల్వే రూట్ల గురించి ఆసక్తికర విషయాలతో పాటుగా మానవ సాహసానికి, తిరుగులేని ఇంజనీరింగ్ అద్భుతాలకు నిదర్శనమైన రూట్స్ ఇవి.ముందుగా మనం మనుషులను భయపెట్టే ప్రమాదకరమైన రూట్లలోకి చూస్తే.. అర్జెంటీనాలోని 'ట్రెన్ ఎ లాస్ న్యూబ్స్' (Tren a las Nubes).. దీని అర్థం 'మేఘాల్లోకి వెళ్లే రైలు'. సముద్ర మట్టానికి ఏకంగా 13,800 అడుగుల ఎత్తున, ఆండీస్ పర్వతాల గుండా ఈ రైలు వెళ్తుంది. కింద చూస్తే గుండె ఆగిపోయేంత లోతైన లోయలు, పైన మేఘాల గుంపులు. ఈ రూట్లో ప్రయాణించేటప్పుడు ఎత్తు వల్ల ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది, అందుకే విమానాల్లో లాగే ఈ రైల్లో కూడా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో పెడతారు.ఈక్వెడార్లో ఇలా.. ఇక ఈక్వెడార్లోని 'నారిజ్ డెల్ డయాబ్లో' (Nariz del Diablo).. దీనికి 'సైతాన్ ముక్కు' అనే అర్థం ఉంది. నిట్టనిలువుగా, గోడలా ఉండే కొండ చరియలపై జిగ్జాగ్గా, వెనక్కి ముందుకీ నడుస్తూ ఈ రైలు కొండ దిగుతుంది. ఒక్క చిన్న తప్పు జరిగినా రైలు పాతాళంలోకి వెళ్లాల్సిందే. 19వ శతాబ్దం చివర్లో ఈ ట్రాక్ వేసేటప్పుడు వందలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అందుకే దీనికి సైతాను ముక్కు అనే పేరు వచ్చింది.Tren de las nubes pic.twitter.com/QM7KtHosvu— saltenials (@saltenials) August 29, 2023భారత్లో రూట్స్..భారతదేశంలో కూడా ఇలాంటి రూట్స్ ఉన్నాయా? అంటే కాస్త తక్కువ భయంకరమైనవి ఉన్నట్లు చెప్పుకోవచ్చు. తమిళనాడులోని 'పాంబన్ బ్రిడ్జ్'ని ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ పాత బ్రిడ్జ్ని సముద్రంపై నిర్మించారు. దీని మీద రైలు వెళ్తుంటే.. కింద భయంకరమైన అలలు, కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు రైలును ఊపేస్తుంటాయి. ఇక సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండే పౌర్ణమి రోజున కిటికీ లోంచి చూస్తే కేవలం అనంతమైన సముద్రం తప్ప ఏమీ కనిపించదు. ఒళ్లు గగుర్పొడిచే అడ్వెంచర్ ఇది.ट्रेन की रफ्तार और पम्बन ब्रिज की मजबूती को देखकर पता चल रहा है कि भारत सरकार का बनाया हुआ है 🚂🛤️🚃 pic.twitter.com/ttPnwQ1HID— Vipin patel 🚩 (@VVipinpatel) July 4, 2026ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం..!! లగ్జరీ! ఒక ఫైవ్ స్టార్ లేదా సెవెన్ స్టార్ హోటల్ పట్టాల మీద నడిస్తే ఎలా ఉంటుంది? ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ రైలుగా పేరుగాంచినది.. 'వెనిస్ సింప్లాన్-ఓరియంట్-ఎక్స్ప్రెస్' (Venice Simplon-Orient-Express). లండన్ నుంచి పారిస్ మీదుగా వెనిస్ వరకు సాగే ఈ ప్రయాణంలో.. రైలు లోపల అంతా 24 క్యారెట్ల బంగారం నగిషీలు, వెల్వెట్ డిజైన్లు, ప్రపంచ స్థాయి చెఫ్ల వంటకాలు, పర్సనల్ బట్లర్లు వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. 1920ల నాటి క్లాసిక్ వైబ్ని ఇది అందిస్తుంది. ఇందులో ఒక్క రాత్రి ప్రయాణానికి టికెట్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా 4 నుంచి 10 లక్షల రూపాయలు!Conheça a suíte de luxo L’Observatoire, do Venice Simplon-Orient-Express, onde cada viagem pode custar cerca de 550 MIL reais. Pagariam? pic.twitter.com/9RVUQoSonW— POINT POP (@Point__Pop) July 9, 2026రష్యాలోని 'ట్రాన్స్-సైబీరియన్ ఎక్స్ప్రెస్' కూడా అత్యంత విలాసవంతమైన రైళ్లలో ఒకటి. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే రూట్లో నడుస్తుంది. మాస్కో నుంచి వ్లాడివోస్టాక్ వరకు 9,289 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. ఎనిమిది రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ జర్నీలో సైబీరియా మంచు అందాలను, ప్రపంచంలోనే అత్యంత లోతైన బైకాల్ సరస్సు వైభవాన్ని ఒక నడిచే రాజభవనంలో కూర్చుని చూడొచ్చు.One of the most breathtaking train rides in the world.The Bernina Express travels from Chur, Switzerland to Tirano, Italy on the Rhaetian Railway. It crosses 196 bridges and 55 tunnels, climbs over the Bernina Pass, and then descends into Italy. pic.twitter.com/fun1VhgjL8— Harshvardhan Ram🇯🇵🇹🇭🇬🇧 ☮️☸️ (@FaaltuBooi7) July 5, 2026'మహారాజాస్ ఎక్స్ప్రెస్'..మన దేశంలో కూడా లగ్జరీ రైళ్లకు ఏమాత్రం తక్కువ కాదు. మన 'మహారాజాస్ ఎక్స్ప్రెస్' (Maharajas' Express) ప్రపంచంలోనే అత్యుత్తమ లగ్జరీ రైళ్లలో ఒకటిగా వరుసగా అవార్డులు గెలుచుకుంది. దీని ప్రెసిడెన్షియల్ సూట్ టికెట్ ధర దాదాపు 15 నుంచి 20 లక్షల రూపాయలు ఉంటుంది..! విదేశీయులు మన దేశ రాజసం, సంస్కృతిని, అజంతా ఎల్లోరా గుహలను, తాజ్ మహల్ అందాలను చూడటానికి ఈ రాయల్ జర్నీని ఎంచుకుంటారు. లోపలికి వెళ్తే మనం ఒక రాజు కాలంలో ఉన్నామా?? అనే భ్రమ కలుగుతుంది.India is home to some of the world’s most luxurious trains,The Maharajas’ Express often ranked among the finest luxury rail journeys globally. pic.twitter.com/T2bTHevzUX— India Plus (@india_plus_) June 30, 2026సైకలాజికల్ కోణంలో విశ్లేషిస్తే.. మనుషుల్లో రెండు రకాల తీవ్రమైన, పరస్పర విరుద్ధమైన ఎమోషన్స్ ఉంటాయి. ఒకటి.. అడ్వెంచర్, థ్రిల్ కావాలనుకోవడం, ప్రాణాలను పణంగా పెట్టైనా ప్రకృతి సవాలును జయించి ఆ డోపమైన్ రష్ను అనుభవించాలనుకోవడం. రెండోది.. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనుకోవడం, సమాజంలో తన హోదాను చాటుకుంటూ తానే ఒక చక్రవర్తిలా ఫీలవ్వడం. ఈ రెండు భిన్నమైన హ్యూమన్ ఎమోషన్స్ను, సైకాలజీని ఈ రైల్వే రూట్లు సంపూర్ణంగా satisfy చేస్తాయి. ఒకటేమో ప్రకృతిని జయించిన మనిషి మొండితనానికి, ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రతీక అయితే, ఇంకొకటి మనిషి సృష్టించుకున్న విలాసానికి నిదర్శనం.ప్రమాదకరమైన లోయలైనా, పరమ విలాసవంతమైన భోగీలైనా.. ప్రతి రైలు ప్రయాణమూ మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పుతుంది. గమ్యం కంటే ఆ ప్రయాణమే మనకు ముఖ్యం అని చెప్తుంది! మానవ మేధస్సు, ఇంజనీరింగ్ సృష్టించిన ఈ పట్టాల అద్భుతాలు భూమిపై ఎప్పటికీ నిలిచిపోతాయి.Orient Express from Venice to Paris 🚋 the Venice Simplon-Orient-Express embarks on a 24-hour journey Art deco interiors gourmet dining #SundayMorning #SundayVibes #SundayMood ☆ paris.attractive☆ sarahjmea via TT @Sarahhuniverse @CONTEMPRA_INN 🌹pic.twitter.com/TRkmHRKrmG— ContempraINN🌹 (@CONTEMPRA_INN) July 21, 2024 -
వందే భారత్లో జర్నీ.. ఈ మార్గాలు వెరీ స్పెషల్..
భారత్ అంటేనే ఎన్నో చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి. భారత్లో సీజన్ను బట్టి ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ఇలాంటి ప్రదేశాలను కవర్ చేస్తూ ఇప్పుడు వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. పర్వతాలు, తీవ్ర ప్రాంతాలు, నదులు, వాటర్ ఫాల్స్ను దాటుకుంటూ వెళ్తుండటం ప్రయాణీకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో వందే భారత్ రైలు మార్గాలు ప్రయాణీకులను ముఖ్యంగా ఆకర్షిస్తున్నాయి.వందే భారత్ రైళ్లు కేవలం వేగం, సౌకర్యం మాత్రమే కాదు.. భారతదేశ భౌగోళిక వైవిధ్యాన్ని కిటికీ నుంచి ప్రత్యక్షంగా చూపించే అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. హిమాలయ శిఖరాలు, పశ్చిమ కనుమలు, కేరళ తీరప్రాంతం, కాశ్మీర్ లోయ ఇవన్నీ ఒకే రైలు ప్రయాణంలో చూడగలిగే అవకాశాన్ని ఇస్తున్నాయి. ఇప్పటికే ప్రయాణించిన వారు.. తప్పకుండా ఆయా మార్గాల్లో ప్రయాణించాలని సోషల్ మీడియా సజెస్ట్ చేస్తున్నారు. 2026 ఫిబ్రవరి నాటికి 164 వందే భారత్ సేవలు 82 మార్గాల్లో నడుస్తూ, దేశవ్యాప్తంగా 274 జిల్లాలను కలుపుతున్నాయి. వీటిలో పలు మార్గాలు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంతకీ ఆయా మార్గాలు ఎక్కడ.. ఎలా వెళ్తున్నాయో.. తెలుసుకుందాం..1. కత్రా-శ్రీనగర్ మార్గం.. మార్గం: శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా - శ్రీనగర్దూరం: సుమారు 270 కి.మీసమయం: సుమారు 3-4 గంటలుప్రత్యేకత: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెన (359 మీటర్లు), హిమాలయ పర్వతాలు, కాశ్మీర్ లోయ.ప్రయాణం: 58 సొరంగాలు, 11 కిలోమీటర్ల పొడవైన పిర్ పంజాల్ సొరంగం, మంచుతో కప్పబడిన శిఖరాలు. మార్చి-అక్టోబర్ మధ్య కాలంలో ఈ మార్గంలో ప్రయాణించడం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. హిమాలయ పర్వతాలను దగ్గరగా వీక్షించవచ్చు. కత్రా నుంచి శ్రీనగర్ వెళ్తూ కుడి వైపు కిటికీ సీటు తీసుకుంటే వంతెన దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది.2.త్రివేండ్రం-ఎర్నాకులందూరం: సుమారు 220 కి.మీసమయం: 3–4 గంటలుప్రత్యేకత: కొబ్బరి తోటలు, బ్యాక్వాటర్స్, తీరప్రాంత దృశ్యాలు, ఆలయ పట్టణాలుప్రయాణం: అరేబియా సముద్రం తీరప్రాంతం వెంట రైలు ప్రయాణం. ఎర్రటి కప్పులతో ఉన్న సంప్రదాయ గ్రామాలు, కొబ్బరి చెట్లతో నిండిన కాల్వలు. కొల్లం, అలప్పుజా వంటి సాంస్కృతిక పట్టణాల గుండా ప్రయాణం నడుస్తుంది. డిసెంబర్-మార్చి వెళ్తే బాగుంటుంది. వర్షాకాలం (జూన్–సెప్టెంబర్)లో మరింత పచ్చదనం ఉంటుంది కానీ భారీ వర్షాలు ఉంటాయి. ఈ మార్గంలో పగలు ప్రయాణం చేస్తే కేరళ పచ్చదనం, తీరప్రాంత దృశ్యాలు పూర్తిగా ఆస్వాదించవచ్చు. 3. ముంబై-కోల్హాపూర్ మార్గం.. దూరం: సుమారు 500 కి.మీసమయం: 8 గంటలు 30 నిమిషాలుప్రత్యేకత: పశ్చిమ కనుమలు, మబ్బులతో నిండిన లోయలు, హిల్ స్టేషన్లు ఉంటాయి. ప్రయాణం: ముంబై నగరాన్ని వదిలి పశ్చిమ కనుమల్లోకి ప్రవేశం. సతారా, బెలగావి, ధారవాడ గుండా ప్రయాణం నడుస్తుంది. వర్షాకాలంలో జలపాతాలు, పచ్చని లోయలు కనిపిస్తాయి. శీతాకాలంలో మబ్బులతో నిండిన లోయలు, స్ట్రాబెర్రీ తోటలు, చారిత్రక కోటలు చూడవచ్చు. జూన్ – సెప్టెంబర్ (వర్షాకాలం)లో అద్భుతమైన జలపాతాలు కనువిందు చేస్తాయి. 4. ఢిల్లీ ఆనంద్ విహార్-డెహ్రాడూన్ మార్గం..దూరం: దాదాపు 302 కి.మీసమయం: 4 గంటల 45 నిమిషాలుప్రత్యేకత: ఉత్తర భారత మైదానాల నుంచి శివాలిక్ పర్వతాల వరకు భౌగోళిక మార్పు.ప్రయాణం: గంగానది, అడవులు, దూన్ లోయ, మంచు పర్వతాలు. ఈ మార్గంలో మార్చి-జూన్, సెప్టెంబర్-నవంబర్ మధ్య ప్రయాణించడం కను విందు చేస్తుంది.4. ముంబై-మడ్గావ్ (గోవా) కొంకణ్ రైల్వే మ్యాజిక్ మార్గం..దూరం: సుమారు 580 కి.మీసమయం: 7 గంటల 45 నిమిషాలు (వర్షాకాలంలో కొంచెం ఎక్కువ)ప్రత్యేకత: పశ్చిమ కనుమలు, కొంకణ్ రైల్వే, 84 వంతెనలు, తీరప్రాంత దృశ్యాలు.ప్రయాణం: వర్షాకాలంలో జలపాతాలు, ఆకాశం, పచ్చని లోయలు కనిపిస్తాయి. జూన్-సెప్టెంబర్ (వర్షాకాలం) లేదా అక్టోబర్-ఫిబ్రవరి మధ్య ప్రయాణం బాగుంటుంది. ముంబై నుంచి గోవా వెళ్తూ ఎడమ వైపు కిటికీ సీటు తీసుకుంటే సముద్రం, జలపాతాలు బాగా కనిపిస్తాయి.6. అహ్మదాబాద్-ముంబై మార్గం.. దూరం: సుమారు 491 కి.మీసమయం: 5 గంటలు 40 నిమిషాలుప్రత్యేకత: ఆరావళి పర్వతాలు, తీరప్రాంతాలు, మహానగర దృశ్యాలు.ప్రయాణం: ఎడారి నుంచి తీర ప్రాంతం వరకు విభిన్న భౌగోళిక దృశ్యాలు కనపడతాయి. -
సిద్దమవుతున్న సూపర్ యాప్: ఐఆర్సీటీసీ సర్వీసులన్నీ ఒకే చోట..
ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఒక యాప్.. ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుంటే మరో యాప్, ఇలా ప్రతి ఒక్కదానికీ ఒక్కో యాప్. ఈ విధానానికి ఐఆర్సీటీసీ మంగళం పడనుంది. ఇండియన్ రైల్వే 'సూపర్ యాప్' పేరుతో ఓ సరికొత్త యాప్ను ప్రారంభించనుంది.ఐఆర్సీటీసీ ప్రారంభించనున్న ఈ సూపర్ యాప్ను.. రైల్వేకు సంబంధించిన అన్ని సర్వీసులకు ఉపయోగించుకోవచ్చు. ఇది 2024 డిసెంబర్ చివరి నాటికి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ప్రయాణికులకు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్ను తీసుకువస్తున్నారు.ఇండియన్ రైల్వే లాంచ్ చేయనున్న సూపర్ యాప్ను సీఆర్ఐఎస్ (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం) అభివృద్ధి చేస్తోంది. దీనికి యాప్ టికెట్ బుకింగ్, ప్లాట్ఫామ్ పాస్లు, ఫుడ్ డెలివరీ వంటి వాటిని అనుసంధానిస్తోంది. అంటే ఈ ఒక్క యాప్లోనే టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, ప్లాట్ఫామ్ పాస్ వంటివన్నీ కూడా పొందవచ్చు. అంతే కాకుండా ట్రైన్ జర్నీ స్టేటస్ కూడా ఇందులోనే తెలుసుకోవచ్చని సమాచారం.ఇండియన్ రైల్వే సూపర్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత థర్డ్ పార్టీ యాప్ల మీద ఆధారపడే అవసరం ఉండదు. ట్రైన్ జర్నీ చేసేవారు ఎక్కువ యాప్స్ ఉపయోగించాల్సిన అవసరం తీరిపోతుంది. ఇది ప్రయాణాన్ని సులభతరం చేయడం మాత్రమే కాకుండా.. వినియోగదారు అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుందని పలువురు భావిస్తున్నారు. -
ప్రయాణికులకు సమైక్య సెగ
గుడివాడ అర్బన్, న్యూస్లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా పడుతోంది. దాదాపు 18 రోజులుగా ఆర్టీసీ బస్సులను నిలిపివేసి ఆ సంస్థ కార్మికులు సైతం ఉద్యమబాట పట్టడంతో జనం ప్రైవేటు వాహనాలు, రైళ్లలో ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రైవేటు వాహనదారులు రెట్టింపునకు పైగా చార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికుల జేబుకు చిల్లు పడుతోంది. దీంతో రోజువారీ రైళ్లలో ప్రయాణం చేసేవారి కన్నా 80 శాతం మంది ప్రజలు అధికంగా రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రైల్వే శాఖ నడుపుతున్న రైళ్లలో చోటు సరిపడక, గంటల తరబడి నిలబడి గమ్యానికి చేరుకోవటానికి ప్రయాణికులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కాదు. మచిలీపట్నం-విజయవాడ, నరసాపూర్-గుంటూరు ప్యాసిం జరు, మచిలీపట్నం-విశాఖపట్నం, భీమవరం-గుడివాడ ప్యాసింజరు రైళ్లు నడుస్తుండగా అన్నీ కిక్కిరిసిన వెళ్తున్నాయి. మామూలు రోజుల్లో అయితే గుడివాడ నుంచి రోజుకు సుమారు ఏడు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య లెక్కకు మిక్కిలిగా పెరిగింది. రైల్వేస్టేషన్లోని టిక్కెట్ కౌంటర్లు సైతం ప్రయాణికులు టిక్కెట్ల కోసం క్యూ కట్టడంతో వారు టిక్కెట్ తీసుకునేందుకు గంటల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు సరిపడునన్ని సౌకర్యాలు లేక అవస్థలు తప్పడంలేదు. మరోపక్క కిక్కిరిసిన రైళ్లలోకి ఎక్కలేక చాలామంది స్టేషన్లోనే ఉండిపోతున్నారు. ఇక పిల్లలతో ప్రయాణాలు చేసేవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. రైలు మార్గంలేని గ్రామాలకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు వాహనాల దోపిడీ.. సమైక్య ఉద్యమాన్ని అదునుగా చేసుకుని ప్రైవేటు వాహనదారుల దోపిడీ పెరిగింది. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడాన్ని ఆసరాగా తీసుకున్న ఆటో డ్రైవర్లు గుడివాడ-విజయవాడకు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యుడిపై పెనుభారం పడుతోంది. రైళ్లు మాత్రం ఒకటి రెండు తిరగడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి అదనపు వేళల్లో రైళ్లను నడిపితే ప్రయాణికులకు మేలు చేసిన వారవుతారని కోరుతున్నారు.


