breaking news
telugu professor
-
తెలుగు ప్రొఫెసర్కు అరుదైన ఘనత
వెవీయూ: వైఎస్సార్ జిల్లా కడప నగరం ప్రభుత్వ పురుషుల కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ బుసిరెడ్డి సుధాకర్రెడ్డి ప్రపంచ శాస్త్రవేత్తల జాబితాలో చేరారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో ఉత్తమ పరిశోధనలను పరిశీలించి ర్యాంకింగ్ కేటాయించే ఏడీ (అల్ఫర్–డోగర్) సైంటిఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో ప్రపంచ పరిశోధకుల జాబితాలో ఆచార్య బుసిరెడ్డికి చోటు దక్కింది. తాజాగా విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో ఆయన అంతర్జాతీయ స్థాయిలో 19,034వ ర్యాంకు, ఆసియా స్థాయిలో 4,302వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 972వ ర్యాంకు, కళాశాల స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఎస్సీఐ పరిశోధనా పత్రాలు, స్కోపస్ హెచ్–ఇండెక్స్, ఐ–10 ఇండెక్స్, సైటేషన్స్, ఓఆర్సీఐడీ, వెబ్ ఆఫ్ సైన్స్, విద్యాస్, గూగుల్ స్కారల్ డేటాబేస్ ఆధారంగా ఈ ర్యాంకులను సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రవీంద్రనాథ్, అధ్యాపక బృందం ఆయనకు అభినందనలు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్లపల్లె గ్రామానికి చెందిన డాక్టర్ బుసిరెడ్డి సుధాకర్రెడ్డికి ఇప్పటికే పలు పురస్కారాలు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాయి. గతంలో సౌత్కొరియా, స్వీడన్, ఫిన్ల్యాండ్, హాంకాంగ్, సౌత్ ఆఫ్రికా తదితర దేశాల్లో విజిటింగ్ సైంటిస్ట్గా సేవలందించారు. 70కి పైగా జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో పరిశోధక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. (క్లిక్: పాఠాలకు పక్కా క్యాలెండర్) -
ఈ తెలుగు – ఆ తమిళం
తమిళనాడులో స్థిరపడిన తెలుగు ప్రొఫెసర్... డాక్టర్ ప్రభు కుమారి వనమా. తెలంగాణ సంస్కృతి మీద ఆమె అధ్యయనం చేశారు.తమిళ జానపద నృత్యాలు,తెలంగాణ సాంస్కృతిక కళల మధ్య భావసారూప్యతలపై విస్తృతమైన పరిశీలన జరిపారు.తమిళ మహిళ ‘తమిళిసై’ తెలుగు రాష్ట్రానికి గవర్నర్గా వచ్చిన సందర్భంలో... ఈ రెండు ప్రాంతాల సాంప్రదాయిక బాంధవ్యం గురించి సాక్షితో ముచ్చటించారు. డాక్టర్ ప్రభుకుమారి పుట్టింది విజయవాడలో, బాల్యం హైదరాబాద్లో గడిచింది. తర్వాత తమిళనాడు బాట పట్టింది వాళ్ల కుటుంబం. సంగీతం, నాట్యం ఆమెకు రెండు కళ్లు. తనకు ఇష్టమైన కళలను కొనసాగించడం కోసమే ఆమె చరిత్ర, పర్యాటక రంగాల్లో అధ్యాపక వృత్తిని ఎన్నుకున్నారు. సరిగమల గురువు అమ్మ ‘‘మా అమ్మ జ్ఞాన ప్రసూన గాయని, కర్ణాటక, హిందూస్తానీ సంగీతంలో నిష్ణాతురాలు. సినిమాల్లో నేపథ్య గాయని. నాన్న పుల్లారావు ఫార్మాసుటికల్ కంపెనీ నిర్వహించేవారు. నన్ను కళారంగంలో అత్యున్నత స్థాయిలో చూడాలనేది మా అమ్మ కోరిక. అందుకోసమే మా కుటుంబం చెన్నైకి మారింది. అమ్మ స్వయంగా నాకు కర్నాటక, హిందూస్తానీ సంగీతంలో సరిగమలు నేర్పించారు. హైదరాబాద్లో ఉన్న కాలంలో భరతనాట్యం, కూచిపూడి కథక్తోపాటు జానపద నృత్యాలు నేర్చుకున్నాను. జానపద నృత్యంలో... నేను సంగీతానికి అనుగుణంగా అడుగులు వేయడం వరకే పరిమితమైపోయి ఉంటే నా ప్రయాణం ఒక ‘కళాకారిణి’ అనే మైలురాయి దగ్గరే ఆగిపోయేది. జానపద నృత్యాలకు ఆధారమైన సాహిత్యం మీద నాకు కలిగిన మమకారమే నన్ను అధ్యయనకారిణి చేసింది. వీటితోపాటు తబలా, హార్మోనియం, తంబూరా, మృదంగం నేర్చుకోవడం మీద ఆసక్తి కలిగింది. నేను ఎప్పుడు దేని మీద ఇష్టాన్ని కనబరిస్తే వెంటనే అందులో శిక్షణ ఇప్పించేది మా అమ్మ. ప్రతి రంగంలో మేటి అయిన గురువుల దగ్గర శిక్షణ ఇప్పించింది. కూచిపూడి, భరతనాట్యం సుమతీ కౌశల్ గారి దగ్గర నేర్చుకున్నాను. అంజుబాబు గారి శిక్షణలో కథక్, ఫోక్ డాన్సులు నేర్చుకున్నాను. ఆ తర్వాత బెనాసర్లో విజయశంకర్ గారి దగ్గర కథక్లో ప్రావీణ్యం సాధించగలిగాను. ప్రతి కళనూ దాని మూలాల వరకు వెళ్లి అధ్యయనం చేయాలనే కోరిక... ఈ రోజు నన్ను ప్రపంచదేశాలకు పరిచయం చేసింది. జనాన్ని కలిపేది జానపదాలే జానపద గేయాలు సాధారణంగా బృందగానాలే అయి ఉంటాయి. జానపద నృత్యాలను కూడా సామూహికంగానే చేస్తారు. జన సామాన్యాన్ని ఒక త్రాటి మీదకు తీసుకువచ్చే మాధ్యమాలివి. ముఖ్యంగా తమిళనాడు – తెలంగాణ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం చాలా బలమైనదనే చెప్పాలి. భావసారూప్యాల విశ్లేషణ చేస్తే... రెండు సంప్రదాయాలు కూడా ప్రకృతి మీద ఆధారపడి మనిషి జీవికను నిర్మించుకున్నవే అని తెలుస్తుంది. తెలంగాణలో బోనాలు అని చేస్తారు. ఈ వేడుకలో భక్తులు అమ్మవారికి పసుపు నీటిని చల్లుతూ భోజనాన్ని సమర్పిస్తారు. తమిళనాడులో చేసే ‘కరగాట్టం’ వేడుకలో కూడా కుండ తల మీద పెట్టుకుని నృత్యం చేస్తూ దేవుడికి ఆహారం, నీటిని సమర్పిస్తారు. రెండు వేడుకల్లోనూ ఘటాన్ని తల మీద పెట్టుకుని లయబద్ధంగా డాన్స్ చేయడమే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ కోలాటం– అక్కడ కోలాఠం తెలుగు రాష్ట్రాల్లో కోలాటం బాగా ప్రసిద్ధి. ఇదే ఆట తమిళనాడులోనూ ఉంది. అయితే అక్కడ ‘కోలాఠం’ అని ఠని ఒత్తి పలుకుతారు. ఆటంతా దాదాపుగా ఒకటే. ప్రత్యేకంగా ఆడపిల్లలకు నేర్పిస్తారు. తమిళనాడులో కోలాఠం ఆడడానికి ప్రత్యేకంగా పండుగలేవీ అక్కర్లేదు. ఆడవాళ్లు పనులు లేని సమయంలో ఆటవిడుపుగా కోలాఠం ఆడుకుంటారు. ఇక తెలంగాణలో మహిళలు ప్రధానంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలాంటిదే తమిళనాడులో ‘కుమ్మి’. ఆంధ్రప్రదేశ్లో గొబ్బెమ్మ ఆడినట్లన్న మాట. బతుకమ్మ అమరికలో పూలే ప్రధానంగా ఉంటాయి. గొబ్బెమ్మ ఆటలో, కుమ్మి ఆటలో ముగ్గు వేసి మధ్యలో పూలను అమర్చి చుట్టూ తిరుగుతూ ఆడుతారు. బతుకమ్మ అయినా, గొబ్బెమ్మ అయినా, కుమ్మి అయినా... అలంకరించే పూలలోనే ఉంది అసలు రహస్యం. బతుకమ్మను అలంకరించే పూలు కానీ, కుమ్మి ఆట కోసం ముగ్గు మధ్య అమర్చే పూలు... ఆడవాళ్లు జడలో పెట్టుకోని పూలే. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. మనదేశంలో పూచే ప్రతి పువ్వూ ఔషధగుచ్ఛమే. ఈ వేడుకలు జడలో పెట్టుకోని పూలలో ఉన్న ఔషధగుణాలను దగ్గర చేస్తాయి. గొప్ప బంధం సాంస్కృతికంగా తమిళనాడుకి తెలుగు రాష్ట్రాలకు విశ్వాసాల పరంగా కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. మహాభారతం, రామాయణం వంటి పౌరాణిక ఇతిహాసాల ఇతివృత్తాలతో మనం వీధి భాగవతాలు చెప్పుకుంటాం. వాటిని తమిళనాడులో తేరుకూట్ అంటారు. తమిళనాడు, తెలంగాణలు కల్చర్ను చాలా బాగా కాపాడుకుంటున్నాయి. ఏపీలో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పోవడం, ఆధునికత వైపు పరుగుల మధ్య సంస్కృతి పరిరక్షణ కుంటుపడుతోంది. సంప్రదాయం– సాధికారత మనదేశం గత కొన్ని దశాబ్దాలుగా మహిళ సాధికారత కోసం ఎన్నో ఉపాధి మార్గాలను చూపిస్తోంది, శిక్షణనిస్తోంది. అన్నింటికంటే పెద్ద ఉపాధి మార్గం మన సంప్రదాయ జానపద నృత్యంలోనే ఉంది. కల్చరల్ టూరిజం ద్వారా ప్రధానంగా మూడు అంశాలు అభివృద్ధి చెందుతాయి. స్థానిక సంప్రదాయాన్ని అంతరించి పోకుండా కాపాడుకోగలగడం సాధ్యమవుతుంది. కళారీతులను మెరుగుపరుచుకోవడంలో సృజనాత్మకత మెరుగుపడుతుంది. మూడవది టూరిజానికి నిరంతరతను సాధించడం. టూరిజానికి నిరంతరత అని ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఎంత గొప్ప టూరిస్ట్ స్పాట్ అయినా సరే... ఒక ప్రదేశానికి ఒకసారి వెళ్లిన వాళ్లు సాధారణంగా మళ్లీ వెళ్లరు. కల్చరల్ టూరిజమ్ అలా కాదు. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలు జరుగుతుంటాయి. ఒక్కో వేడుకలో ఒక్కో రకమైన సాంస్కృతిక కళల ప్రదర్శన జరుగుతుంటుంది. దాంతో ఒక టూరిస్టు... ఒక ప్రదేశానికి మళ్లీ మళ్లీ రావడానికి అవకాశాలు పెరుగుతాయి. ఒక టూరిస్ట్ రావడం వల్ల ఆదాయం వచ్చేది ఆ కళా ప్రదర్శనకు మాత్రమే కాదు. ఆ టూరిస్ట్ బస, భోజనాల కోసం హోటల్, రెస్టారెంట్ వ్యాపారాలు పెరుగుతాయి. అక్కడి ప్రత్యేకమైన వస్తువులను కొంటారు కాబట్టి హస్తకళాకృతుల అమ్మకాలు పెరుగుతాయి. అందుకే మహిళల ఆర్థిక స్వావలంబనకు మన సంప్రదాయ కళలను మించిన మార్గాలు మరేవీ ఉండవనే చెప్తాను. మన ఆట, పాట, హస్తకళ... ప్రతిదీ మనకు అన్నం పెట్టే వనరే. ఆర్థిక స్వావలంబనకు పెద్ద ఆలంబన మన ఫోక్ ఆర్ట్స్. వృత్తి– ప్రవృత్తి నేను చదివిన కోర్సు ఎంపిక నా అభిరుచికి అనుగుణంగా జరిగింది. అందుకే వృత్తి ప్రవృత్తి ఒకటిమిళితమై పోయాయి. ఒక తబలా వాదన, ఒక కథక్ ప్రదర్శన, శాస్త్రీయ– జానపద సంప్రదాయ కళలను పాఠంగా చెప్పడం... ప్రతిదీ సంతోషాన్నిచ్చే అంశాలే అయ్యాయి. ఇవన్నీ నన్ను విదేశాల్లో మన సాంస్కృతిక ప్రదర్శనల వైపు, పుస్తక రచన వైపు నడిపించాయి. ఇక నేను ఎడిటర్గా మరో అవతారం ఎత్తడానికి కారణం కూడా భారతీయ సంప్రదాయం, సంస్కృతి, సాంస్కృతి కళల ప్రచురణ కోసమే. మెడికల్, హోటల్, సినిమా ఇండస్ట్రీ తమ రంగాల కోసం జర్నల్స్ నడుపుతున్నాయి. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయం, పర్యాటకం కోసం ఒక పత్రిక రూపకల్పన చేశాను. మనదేశం గురించి తెలుసుకోవాలనుకునే విదేశీయులకు ఇది బాగా ఉపయోగపడుతోంది’’ అని చెప్పారు ప్రభుకుమారి. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు అమ్మానాన్నలతో కలిసి సాంస్కృతిక పత్రిక కాపీని అందచేస్తున్న ప్రభుకుమారి సమాజమే పెద్ద పాఠశాల ప్రభుకుమారి వనమా చెన్నైలోని భారతి ఉమెన్స్ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆమె ఎంఏ, ఎమ్టిటిఎమ్, ఎమ్ఫిల్, డబుల్ పీహెచ్డీ. తమిళ్ లిటరేచర్లో డిప్లమో, సిటిజెన్స్ లీగల్ రైట్స్లో డిప్లమో, డీలిట్ చేశారు. ప్రస్తుతం జానపద కళల మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. భారతీయ సంప్రదాయ కళల పరిరక్షణ కోసం చెన్నైలో ‘వనమా ఆర్ట్, ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్’ను నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి, చరిత్ర పరిశోధనాంశాల మీద రీసెర్చ్ చేసే పరిశోధక విద్యార్థుల కోసం ‘బై యాన్యువల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్, కల్చర్, హెరిటేజ్ అండ్ టూరిజమ్’ (జెఐఏసిహెచ్టి) పేరుతో జర్నల్ను నడుపుతున్నారు. పరిశోధనలు, జానపద కళల కోసం ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ‘ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి చేతుల మీదుగా ‘కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నుంచి ‘బాల సహ్యోగ్ అవార్డ్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ పురస్కారం అందుకున్నారు. చంఢీఘర్లో హిస్టరీ అండ్ టూరిజమ్ నిర్వహించిన సదస్సులో బెస్ట్ అకడమీషియన్ అవార్డు అందుకున్నారు. ‘ఉమెన్ స్టడీస్ అండ్ సోషల్ సైన్సెస్’ అంశం మీద ఆమె ప్రసంగించారు. ఆమె సూచించిన అనేక అంశాలను ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలుగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. ‘‘మనం అక్షరాలు నేర్చుకుని, పుస్తకాలతో చదవడం ద్వారా విజ్ఞానాన్ని సొంతం చేసుకోగలుగుతున్నాం... అని అనుకుంటాం. కానీ అక్షరాలు, పుస్తకాలు కేవలం మనకు విజ్ఞానాన్ని అందించే మాధ్యమాలు మాత్రమే. మనం నిజంగా నేర్చుకునేది సమాజం నుంచే’’ అంటారు ప్రభుకుమారి. ‘‘ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారిన నేపథ్యంలో జ్ఞానం... ఏదో ఒక మారుమూల అలా ఉండిపోవడం లేదు. ఒక మూల నుంచి మరో మూలకు సులువుగా చేరుతోంది. ఒకరి కల్చర్ మీద మరొకరికి ఆసక్తి పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో మన కల్చర్ మనకు అన్నం పెట్టే మాధ్యమం అవుతోందని మాత్రం మర్చిపోవద్దు’’ అన్నారు ప్రభుకుమారి.– వాకా మంజులారెడ్డి -
అర్ధరాత్రి ఏయూ ప్రొఫెసర్ అరెస్టు
మావోయిస్టులతో సంబంధాలున్నందుకేనన్న ఎస్పీ తెలుగు ప్రొఫెసర్ అప్పారావుతో పాటు మరో ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు వెల్లడి సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ జర్రా అప్పారావును బుధవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ప్రొఫెసర్ అరెస్టుకు నిరసనగా విద్యార్థులు ఆయన భార్యతో కలసి ఎస్పీ కార్యాలయం ఎదుట భారీయెత్తున ధర్నా నిర్వహించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రొఫెసర్ అరెస్టును ప్రజా, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సంచలనం కలిగించిన ఈ ఉదంతం వివరాలు అప్పారావు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఏయూ తెలుగు విభాగంలో అప్పారావు అసోసియేట్ ప్రొఫెసర్. వర్సిటీలోని సీ శాండ్ ఉద్యోగుల వసతిగృహాల్లోని ఆయన నివాసానికి బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సివిల్ దుస్తుల్లో ఉన్న 8 మంది వచ్చారు. అప్పారావును తమ వెంట రమ్మన్నారు. పోలీసులని భావించి వారంట్ చూపాలని ఆయన అడిగినా విన్పించుకోలేదు. మీరెవరు? ఎక్కడి కి తీసుకెళుతున్నారని అప్పారావు భార్య మైనావతి, ఇతర బంధువులు ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా తాము వచ్చిన టాటా సుమో వాహనంలోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. దీంతో వాహనం వెంటపడిన బంధువుల వద్దనున్న మూడు సెల్ఫోన్లను సైతం వారు లాక్కెళ్లారు. యువకుడైన అప్పారావును ఎవరు తీసుకెళ్లారో స్పష్టంగా తెలియకపోవడంతో తొలుత కిడ్నాప్గా సందేహించారు. దీంతో ఆయన భార్య 3వ టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. విషయం వీసీ జీఎస్ఎన్ రాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన పోలీసులను సంప్రదించడంతో నర్సీపట్నం నుంచి వచ్చిన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడైంది. భగ్గుమన్న విద్యార్థులు తమ ప్రొఫెసర్ అరెస్టు గురించి తెలియడంతో ఏయూ విద్యార్థులు భగ్గుమన్నారు. వర్సిటీ బంద్కు పిలుపునిచ్చి గురువారం ఉదయం ఎస్పీ కార్యాలయం ఎదుట అప్పారావు భార్యతో కలసి ఆందోళనకు దిగారు. పౌరహక్కుల సంఘం, గిరిజన విద్యార్థుల సమాఖ్య, గిరిజన ఉద్యోగ సంఘం, మత్స్యకార సంఘం ప్రతినిధులు పెద్దసంఖ్యలో ఆందోళన చేపట్టారు. అప్పారావును బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. దాంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో సాయంత్రం మీడియా సమావేశంలో ఎస్పీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ అప్పారావు అరెస్టును ధ్రువీకరించారు. మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలున్నందునే అప్పారావుతో పాటు వసపరి ప్రసాద్, గణపతి రాజు సుబ్బరాజు అలియాస్ వర్మ, జగదీష్లను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. విశాఖ జిల్లా న ర్సీపట్నం పోలీసులకు అందిన సమాచారం నేపథ్యంలో.. ప్రసాద్, గణపతిలను తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి పేలుడు సామగ్రి తీసుకువస్తుండగా పట్టుకున్నట్టు తెలిసింది. వారివద్ద నుంచి కొన్ని పేలుడు పదార్థాలు, సెల్ఫోన్లు, మారుతి రిట్జ్ కారు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జగదీష్ను, విశాఖలో అప్పారావును అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి మావోయిస్టులకు కావాల్సిన సరంజామాను అందిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ చెప్పారు. పలు సెక్షన్ల కింద కేసులు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సీపట్నం మండలం చాపరాతిపాలెంనకు చెందిన ప్రసాద్ దగ్గర గణపతి, జగదీష్రెడ్డిలు మైనింగ్ కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. గణపతితో అప్పారావుకు చిన్ననాటి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో అప్పారావు రెండుమూడు సార్లు మైనింగ్ కాంట్రాక్టర్లను కలసి పేలుడు పదార్థాల సరఫరాకు మధ్యవర్తిగా వ్యవహరించారని ఎస్పీ తెలిపారు. ఈ విషయాలన్నీ ఆయన సెల్ఫోన్ కాల్ డేటా రికార్డ్(సీడీఆర్)ను బట్టి తెలిసిందన్నారు. అమ్మోనియం నైట్రేట్కి పంచదార, డీజిల్ కలిపి ల్యాండ్ మైన్స్ను తయారు చేసి మనుషుల ప్రాణాలు తీసేందుకు వీరు సహకరిస్తున్నారని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరే కించేవారిని టార్గెట్ చేస్తున్నామనడంలో వాస్తవం లేదన్నారు. అప్పారావుతోపాటు నిందితులు నలుగురిపై ఐపీసీ, పీడీ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిని శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నట్టు సమాచారం. సెంట్రల్ వర్సిటీ నుంచి డాక్టరేట్ గిరిజనుడైన అప్పారావు కష్టపడి ఉన్నతస్థాయికి చేరుకున్నారు. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలోని కోరపల్లి స్వగ్రామం. ఎం.ఏ తెలుగు, పీహెచ్డీలను హైదరాబాద్ సెంట్రల్వర్సిటీలో పూర్తిచేశారు. ఏయూలో ఎంకాం, ఎంఫిల్ చేశారు. 2006లో ఏయూలో ప్రొఫెసర్గా చేరారు. విద్యార్థులకు ఎంతో అండగా ఉంటారనే పేరుంది. బాక్సైట్ తవ్వకాలపై పోరాటమే కారణమా? గిరిజన సమస్యలపై అప్పారావు పోరాడుతుంటారు. ఇదే క్రమంలో విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకరించే వారిపై మావోయిస్టు ముద్రవేసి పోలీసులు వేధిస్తున్నారని విద్యార్థి, గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలోనూ ఓసారి మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ అప్పారావును పోలీసులు విచారించారు. అప్పారావు దంపతులకు కుమారుడు ఐదేళ్ల సాయి, కుమార్తె మూడేళ్ల చరణ ఉన్నారు. అప్పారావు అరెస్టును పౌరహక్కుల, గిరిజన, ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. -
లిబియాలో హైదరాబాదీ ప్రొఫెసర్ హత్య
సాక్షి, హైదరాబాద్: లిబియాలోని ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పని చేస్తున్న హైదబాద్వాసి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. దోపిడీ దొంగలే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. యూనివర్సిటీ అధికారులు హతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ముషీరాబాద్లో విషాదఛాయలు అలముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ముషీరాబాద్కు చెందిన మహ్మద్ నజీముద్దీన్ (53) లిబియాలోని అజుదబియాలో ఉన్న బెంఘాజి యూనివర్సిటీలో ఐదేళ్ల నుంచి ఇంగ్లిష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. భార్యా పిల్లలు ఇక్కడే ఉంటుండగా, యూనివర్సిటీ క్యాంపస్లోని క్వార్టర్స్లో నజీముద్దీన్ ఒంటిరిగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా, భారత కాలమాన ప్రకారం శుక్రవారం ఉదయం 8.30 గంటలకు తన నివాసంలో నజీముద్దీన్ హత్యకు గురైన విషయాన్ని అక్కడి యూనివర్సిటీ అధికారులు గుర్తించారు. దోపిడీ దొంగలే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. మైనార్టీ కమిషన్ను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు... లిబియాలో హత్యకు గురైన నజీముద్దీన్ మృతదేహాన్ని వెంటనే స్వదే శానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు మైనార్టీ కమిషన్ చైర్మన్ ఆబిద్ రసూల్ఖాన్కు శనివారం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో మాట్లాడి సహాయక చర్యలు చేపడతామని ఆయన వారికి హా మీ ఇచ్చారు. నజీముద్దీన్కు భార్య, ఒక కూతురు ఉన్నారు.