-
ఎందుకిలా చేస్తున్నారు.. ఎవరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేది లేదు!: సుచిత్ర
సింగర్ సుచిత్ర గతంలో సుచీలీక్స్ పేరిట హీరోల పర్సనల్ ఫోటోలను లీక్ చేసి సెన్సేషన్ అయింది. చాలాకాలం తర్వాత ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వగా మరోసారి పలువురు సెలబ్రిటీల బండారాన్ని బయటపెట్టింది. ధనుష్- ఐశ్వర్య ఇద్దరూ పెళ్లయినప్పటి నుంచే ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారంది. షారుక్ఖాన్ గే అంది. వాటిపైనే ఆసక్తితన భర్త కార్తీక్ కూడా గే అని, ఈ విషయం ఎంతో ఆలస్యంగా తెలుసుకున్నట్లు చెప్పింది. కమల్ హాసన్ పార్టీలో డ్రగ్స్ వాడతారంది. సినీ విశ్లేషకుడు బైల్వాన్ రంగనాథన్పైనా విమర్శలు గుప్పించింది. అయితే తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తూ తన గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడింది సుచిత్ర. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో షేర్ చేసింది. యూట్యూబ్ ఛానల్స్ నా వ్యక్తిగత విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. అనిరుధ్తో..వారికి నచ్చింది రాసుకుంటూ, ఇష్టారీతిన థంబ్నైల్స్ పెడుతూ వ్యూస్ తెచ్చుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. సుచిత్ర ధనుష్తో ఉంది.. అనిరుధ్తో కూడా గదిలోకి వెళ్లింది.. ఇలాంటి చెత్త థంబ్నైల్స్ పెడుతున్నారు. అందుకే ఇక మీదట యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. కేవలం టీవీ ఛానల్స్కు మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తాను అని సుచిత్ర చెప్పుకొచ్చింది.చదవండి: తాగొచ్చి భార్యను కొట్టేవాడు.. చందు మారతాడనుకుంటే.. -
నా మాజీ భర్త గే.. అతడి గదిలో రాత్రి ధనుష్కు ఏం పని? సుచిత్ర సంచలన వ్యాఖ్యలు
సుచీలీక్స్తో సింగర్ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి యావత్ సినీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి సెలబ్రిటీలపై విరుచుకుపడింది. ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ గురించి మాట్లాడుతూ.. వాళ్లు పెళ్లయినప్పటినుంచి ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూనే ఉన్నారు. పెళ్లయిన విషయాన్నే మర్చిపోయి మిగతావాళ్లతో డేటింగ్ చేశారు. ఐశ్వర్య కంటే ధనుషే నయంభర్త మోసం చేశాడని ఆరోపించిన ఐశ్వర్య ఏమైనా పద్ధతిగా ఉందా? తను కూడా వేరేవాళ్లతో డేటింగ్ చేసి మోసం చేయలేదా? ఆమె కంటే ధనుషే నయం.. అయినా ఐశ్వర్య తన పిల్లలను ఏనాడూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే వారి కుమారులు యాత్ర, లింగ.. అమ్మమ్మ- తాతయ్యల వద్ద పెరిగితే బాగుంటుంది' అని సుచిత్ర చెప్పుకొచ్చింది.కార్తీక్ గేభర్త కార్తీక్తో విడాకుల గురించి మాట్లాడుతూ.. 'కార్తీక్తో పెళ్లయిన 11 ఏళ్లకు అతడు గే అని తెలిసింది. అది బయటకు చెప్పే ధైర్యం అతడికి లేదు. ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నాను. పూటుగా తాగిన తర్వాత ధనుష్, నా భర్త ఒకే గదిలో ఉండేవారు. రాత్రిపూట గదిలో నా భర్తతో ధనుష్కు ఏం పని?' అని ప్రశ్నించింది.అందుకే టార్గెట్కాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ మాజీ భర్త కార్తీక్.. సుచిత్ర మానసిక ఆరోగ్యం బాగోలేదని తెలిపాడు. అయితే తన మానసిక స్థితి బాగోలేదని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సుచిత్ర ఆరోపించింది. ఎప్పుడైతే డ్రగ్స్ వాడేందుకు ఒప్పుకోలేదో అప్పుడే తనను ధనుష్, కార్తీక్ టార్గెట్ చేశారని వెల్లడించింది.చదవండి: బాలీవుడ్లో రాణిస్తున్న బ్యూటీ.. ఫస్ట్ సినిమా తెలుగులోనే! -
Chinmayi Sripada And Rahul Ravindran: సింగర్ చిన్మయి శ్రీపాద వివాహ వార్షికోత్సవం.. అరుదైన ఫోటోలు
-
బాటిల్ విసిరిన ఆకతాయి.. సింగర్ రియాక్షన్ ఇదే!
పాపులర్ సింగర్ సునిధి చౌహాన్ ఇటీవల డెహ్రాడూన్లోని ఓ కాలేజీ ఫంక్షన్లో లైవ్ షోకు హాజరైంది. తన మధుర గాత్రంతో శ్రోతలను ఉర్రూతలూగించింది. బాలీవుడ్ హిట్ సాంగ్స్ పాడుతూ అందరిలో హుషారు నింపింది. అక్కడున్నవారిని తనతో కలిసి పాడమని ఎంకరేజ్ చేసింది. ఇంతలో ఓ వ్యక్తి ఆమెపైకి వాటర్ బాటిల్ విసిరాడు.బాటిల్స్ విసిరితే ఏమొస్తుంది?తనవైపుగా ఏదో వస్తువు వస్తోందన్న విషయం గమనించి ఆమె రెండడుగులు వెనక్కు వేసింది. అయినా పాట పాడటం ఆపలేదు. కొన్ని సెకన్ల తర్వాత ఆమె.. నాపై బాటిల్స్ విసిరితే ఏమొస్తుంది? ఈ షో ఆగిపోతుంది. ఈ షో ఆగిపోవాలనుకుంటున్నారా? అని అడిగింది. అందుకు అక్కడున్న జనాలు వద్దని ముక్తకంఠంతో బదులిచ్చారు. అదే ఉత్సాహందీంతో ఆమె అదే ఉత్సాహంతో షోని కంటిన్యూ చేసింది. ఈ షోకి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తనకు అలాంటి చేదు అనుభవం ఎదురైనా పట్టించుకోకుండా షో ముందుకు కొనసాగించిన సునిధి మంచితనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ స్థానంలో మరెవరైనా ఉంటే మైక్ అక్కడే పడేసి వెళ్లిపోయేవారని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sunidhi Chauhan (@sunidhichauhan5) -
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
సౌత్ కొరియా సింగర్ ఆండా రెండేళ్లుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. అప్పటివరకు ఎంతో యాక్టివ్గా ఉన్న ఈ బ్యూటీ ఉన్నట్లుండి సామాజిక మాధ్యమాలను ఎందుకు దూరం పెట్టిందో ఎవరికీ అర్థం కాలేదు. తాజాగా ఇన్స్టాగ్రామ్లోకి రీఎంట్రీ ఇచ్చింది ఆండా. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర వార్త బయటపెట్టింది.ఓ విషయం చెప్పాలితనకు పెళ్లైందని, ఓ బిడ్డ కూడా పుట్టిందని వెల్లడించింది. ఈమేరకు భర్తతో కలిసున్న వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేసింది. 'హలో, నా పేరు ఆండా. చాలాకాలంగా నేను సైలెంట్గా ఉండటంతో నేనెలా ఉన్నానని కంగారుపడుతున్నారేమో! నేను బాగున్నాను.. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఇది సాంగ్కు సంబంధించినది కాదు.. ఇదెలా చెప్పాలా? అని చాలాకాలంగా టెన్షన్ పడుతున్నాను. ఇక దాన్ని చెప్పేస్తున్నాను.పెళ్లి - పాపగతేడాది ఓ అద్భుతమైన వ్యక్తిని కలిశాను. మేమిద్దరం శీతాకాలంలో పెళ్లి చేసుకున్నాం. మాకు ఓ పాప పుట్టింది. మీరు ఇకపై ఆండా 2.0ను చూడబోతున్నారు. తల్లిగా, భార్యగా, సింగర్గా అన్ని పనులు నిర్వర్తించనున్నాను. మీ అందరికోసం మరింత కష్టపడతాను. థాంక్యూ' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Anda🎈 (@anda_kiss) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ సింగర్ ఉమా రామనన్ కన్నుమూశారు. ప్రస్తుతం 69 ఏళ్ల వయసులో ఉన్న ఆమె అనారోగ్య కారణాలతోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తన కెరీర్లో విజయవంతంగా రాణించారు. ఉమకు ఆమె భర్త ఏవీ రామనన్, కుమారుడు విఘ్నేశ్ రామనన్ ఉన్నారు.కాగా.. ఉమ 1977లో శ్రీ కృష్ణ లీల సినిమా కోసం ఎస్వీ వెంకట్రామన్ స్వరపరిచిన మోహనన్ కన్నన్ మురళి అనే పాటతో ఆమె ప్రయాణం ప్రారంభించింది. విజయలక్ష్మి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన ఆమె ఏవీ రామమన్ను పెళ్లాడింది. ఆ తర్వాత ఇళయరాజా రచించిన పూంగతావే చొచ్చా తకవై పాట తమిళ చిత్ర పరిశ్రమలో ఆమెకు భారీ క్రేజ్ను తీసుకొచ్చింది. ఆమె శంకర్ గణేష్, టీ రాజేందర్, దేవా, ఎస్ఏ రాజ్కుమార్, మణి శర్మ, శ్రీకాంత్ దేవా, విద్యాసాగర్ వంటి సింగర్స్తో కలిసి పనిచేశారు. హిందీ చిత్రం ప్లేబాయ్ కోసం ఉమా ఒక పాట పాడారు. ఇళయారాజాతో కలిసి ఎక్కువగా పాటలు పాడారు. Woke up to the sad news of the death of my most fav singer,Uma Ramanan.Highly under-rated singer,she didn't get a fair share of her fame compared to her contemporaries.Every song of hers is a super hit,from 'Poongathave Thazthiravai...' Condolences to AV Ramanan sir. Om Shanthi!+ pic.twitter.com/5ahzsg9KYI— Ramesh रमेश ரமேஷ் (@Udumalai_Ramesh) May 2, 2024 -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు!
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ హత్యపై ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అతను బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు వెల్లడించారు. అమెరికాలోని హోల్ట్అవెన్యూలో మంగళవారం సాయంత్రం కొందరు దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కెనడా కేంద్రంగా పనిచేసే గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్గా స్థానిక మీడియా పేర్కొంది. వాస్తవానికి ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తి వివరాలను గుర్తించిన తర్వాత ఈ పోలీసులు ఈ ప్రకటన చేశారు.కాల్పుల ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మృతుడు గోల్డీబ్రార్ కాదని లెఫ్టినెంట్ విలియం జే డూలే అని పోలీసులు వెల్లడించారు. మీరు మృతుడు గోల్డీబ్రార్ అనుకుంటే కచ్చితంగా తప్పే. అది పూర్తి అవాస్తవం. మా డిపార్ట్మెంట్కు ప్రపంచం నలుమూలల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. అసలు ఇలాంటి వదంతులు ఎలా వచ్చాయో తెలియదు. ఈ కాల్పుల ఘటనలో మరణించింది 37 ఏళ్ల జేవియర్ గాల్డ్ అని తెలిపారు.కాగా.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపైకి కాల్పులు జరిపిన ఘటనలో కూడా గోల్డీబ్రార్ పేరు తెరపైకొచ్చింది. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. గోల్డీ బ్రార్గా ప్రచారంలో ఉన్న సతీందర్ సింగ్ భారత్లో మోస్ట్వాంటెడ్ క్రిమినల్. అతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్లో అత్యంత కీలకమైన సభ్యుడు. 2022లో జరిగిన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవా హత్య కేసుతో అతని పేరు వెలుగులోకి వచ్చింది. -
కూతురితో సింగర్ హాలీడే ట్రిప్.. హేమచంద్ర ఎక్కడ?
బుల్లితెర సెలబ్రిటీలు చాలామందికి సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సినీతారలు కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ వైపు ఆకర్షితులై సొంతంగా ఛానల్ పెట్టుకున్నారు. దీని ద్వారా తమ పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా టాలీవుడ్ టాప్ సింగర్ శ్రావణ భార్గవి ఈ మధ్య యూట్యూబ్ వీడియోలతోనే ఎక్కువ సందడి చేస్తోంది. అలాగే ఈ మధ్య పాడ్ క్యాస్ట్ల హవా ఎక్కువైపోవడంతో.. ఇదేదో బాగుందని ట్రై చేద్దాం అనుకున్నట్లు ఉంది. ఫ్లిప్సైడ్ విత్ శ్రావణ భార్గవి పేరిట నెల క్రితం పాడ్క్యాస్ట్ మొదలుపెట్టింది. ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది.నీ భర్త ఎక్కడ?యూట్యూబ్ వీడియోలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ గాయని తన కూతురిని తీసుకుని హాలీడేకు చెక్కేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన జనాలు నీ భర్త హేమచంద్ర ఎక్కడ? అని కామెంట్ల రూపంలో ప్రశ్నిస్తున్నారు. హేమచంద్రను ఎందుకు వదిలేశారు? అని నిలదీస్తున్నారు. కొందరైతే మరీ హద్దులు దాటుతూ 'అయినా నువ్వు అతడికి ఏమీ సెట్ అవ్వలేదులే' అని సెటైర్లు వేస్తున్నారు. అప్పటినుంచి సింగిల్గానే..కాగా హేమచంద్ర, శ్రావణ భార్గవి జంటగా కనిపించి రెండున్నరేళ్ల పైనే అవుతోంది. అప్పటినుంచి వీరు విడిపోయారంటూ వార్తలు వస్తున్నా ఏనాడూ వాటిపై అటు హేమచంద్రకానీ, ఇటు శ్రావణ భార్గవి కానీ స్పందించనేలేదు. పైగా సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేయలేదు. దీంతో నెటిజన్లు సైతం వీరు విడిపోయారని ఫిక్సయిపోయారు. View this post on Instagram A post shared by ravuri sravana bhargavi (@ravurisravana.bhargavi) చదవండి: -
ఆ సింగర్తో ఉదిత్ నారాయణ రిలేషన్.. రియాక్ట్ అయిన సతీమణి
ఉదిత్ నారాయణ.. బాలీవుడ్ను తన పాటలతో మ్యాజిక్ చేశారు. అలా ఆయన హిందీ చిత్రసీమకే పరిమితం కాలేదు. భారతీయ పలు భాషల్లో చిత్రాల్లో తన గాత్రాన్ని వినిపించి ఎనలేని అభిమానులను సంపాదించుకున్నారు. వాస్తవంగా నేపాల్లో పుట్టిన ఉదిత్ నారాయణ తన పాటలతో ఎల్లలను చెరిపేశారు. రేడియో గాయకుడిగా మొదలైన ఆయన ప్రస్థానం భారతదేశ చిత్రపరిశమలన్నింటిలోనూ ప్రముఖ గాయకుడిగా అభిమానం సంపాదించుకునే దిశగా సాగింది. తన గాన ప్రతిభతో ఉదిత్ నారాయణ్ ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యాడు. 34 భాషల్లో 25 వేల పాటలకు పైగా పాడారు. మూడు సార్లు ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారాలు సాధించారు. ఉదిత్ నారాయణ పాటల ప్రయాణంలో సింగర్ అల్కా యాగ్నిక్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. వీరిద్దరూ కలిసి పాట పాడితే అది హిట్ కావాల్సింది. దీంతో నిర్మాతలు కూడా వీరిద్దరితో పాటలు పాడించేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు. వీరిద్దరూ కలిసి ఇండస్ట్రీకి ఎన్నో సూపర్హిట్ పాటలను అందించారు. బాలీవుడ్లో ఎక్కువగా నటులు-నటీమణుల మధ్య రూమర్స్ వస్తుంటాయి. కానీ అక్కడ ఈ సింగర్స్ జోడీ మధ్య ఉన్న రిలేషన్పై చాలా పుకార్లు వచ్చాయి. బాలీవుడ్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఈ టాపిక్ గురించి ఉదిత్ నారాయణ సతీమణి దీప చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ షాక్కు గురిచేశారు. ఒక కార్యక్రమంలో ఉదిత్ నారాయణ తన సతీమణితో పాటుగా పాల్గొన్నారు. అక్కడకు సింగర్ అల్కా యాగ్నిక్ కూడా వచ్చింది. అక్కడ సందడిగా ఉన్న ఆమెకు ఉదిత్ నారాయణ, అల్కా మధ్య ఉన్న సంబంధం గురించి ప్రశ్న ఎదురౌతుంది. అందుకు సమాధానంగా.. 'వారి సంబంధాన్ని నేను అంగీకరిస్తున్నాను' అంటూ దీప మరింతగా నవ్వేస్తుంది. 'వారిద్దరి స్నేహం పట్ల నాకు నమ్మకం ఉంది. మాకు పెళ్లై 30 ఏళ్లు దాటింది. అయినా వారి స్నేహంలో ఎలాంటి మార్పు లేదు. ఉదిత్, అల్కా మధ్య సంబంధం నిజంగా చాలా ప్రత్యేకమైనది. వారి దశాబ్దాల స్నేహం పట్ల నాకు గౌరవం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి మచ్చ లేకుండా వారి ప్రయాణం కొనసాగుతుంది. వారి గురించి ఇతరులు ఎన్ని మాటలు అన్నా కూడా అవన్నీ ఇంటి బయటి వరకే ఆగిపోతాయి. మేము అందరం ఒకే కుటుంబంలా ఉంటాం. అందుకే ఎన్ని రూమర్స్ వచ్చినా మా రెండు కుటుంబాలు కలిసే ఉంటున్నాయి. వారిద్దరూ ఎల్లప్పుడూ గౌరపరంగా ఉంటారు. భర్తలకు కూడా స్నేహితురాలు ఉంటుందనేది మనం గుర్తుపెట్టుకుంటే ఎలాంటి గొడవలకు తావు ఉండదు. అని దీప చెప్పారు. తన భర్త పట్ల ఇంతటి నమ్మకాన్ని చూపిన దీపను గౌరవిస్తూ సోషల్మీడియాలో పాజిటివ్గా కామెంట్లు వస్తున్నాయి. -
ఖరీదైన కారు కొన్న ఆర్ఆర్ఆర్ సింగర్.. ఎన్ని కోట్లంటే?
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ యానిమల్. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్లో రిలీజైన యానిమల్ దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలో కనిపించింది. అయితే ఈ చిత్రంలోని పెహేలే భీ మే, కబీర్ సింగ్ కైసే హువా అనే పాటలను ఆలపించారు ప్రముఖ సింగర్ విశాల్ మిశ్రా. తాజాగా అతను ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఆధునాతన సౌకర్యాలున్న లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ కారును సొంతం చేసుకున్నారు. ఈ కారు ధర దాదాపు రూ.3.50 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా పంచుకున్నారు. సింగర్ విశాల్ గతంలో యోధా , సత్యప్రేమ్ కి కథ, చోర్ నికల్ కే భాగే, ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ నాటు నాటు సాంగ్ పాడారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన రాబోయే చిత్రం బడే మియాన్ చోటే మియాన్లో పాటలను ఆలపించారు. ఈ చిత్రంలో మానుషి చిల్లర్, అలయ ఎఫ్, సోనాక్షి సిన్హా, రోనిత్ బోస్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఏప్రిల్ 11, 2024న థియేటర్లలో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Vishal Mishra (@vishalmishraofficial) -
సీక్రెట్గా ప్రముఖ సింగర్ వివాహం.. !
ప్రముఖ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల క్రూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం పరిణీతి చోప్రాతో కలిసి అమర్ సింగ్ చమ్కీలా అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 12న స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దిల్జీత్ దోసాంజ్ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దిల్జీత్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నట్లు అతని స్నేహితుడు ఒకరు వెల్లడించారు. ఇండియా మూలాలున్న అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని తెలిపారు. అంతే కాదు వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతని భార్య, కుమారుడు అమెరికాలో నివసిస్తున్నట్లు చెప్పారు. దిల్జీత్ తల్లిదండ్రులు మాత్రం పంజాబ్లోని లుథియానాలో ఉన్నారని అన్నారు. కాగా.. గతంలో గుడ్ న్యూజ్ మూవీ ప్రమోషన్స్లో కియారా అద్వానీ అనుకోకుండా దిల్జిత్కు ఒక కొడుకు ఉన్నాడని వెల్లడించింది. కొన్నేళ్ల క్రితం దిల్జిత్ తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. ' నా ఫ్యామిలీకి ఏదైనా చెడు జరిగితే తట్టుకోలేను. నా కుటుంబం పట్ల కించపరిచేలా లక్ష్యంగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే వారిని ట్రోల్స్, మీడియాకు దూరంగా ఉంచాలనుకున్నా. నా తప్పుల కారణంగా నా కుటుంబం బాధపడకూడదని నేను కోరుకుంటా.' అని అన్నారు. కాగా.. పరిణీతి చోప్రా, దిల్జీత్ జంటగా నటించిన అమర్ సింగ్ చమ్కిలా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజవుతోంది. ఆ తర్వాత వరుణ్ ధావన్, అర్జున్ కపూర్తో నో ఎంట్రీ- 2 చిత్రంలో నటించనున్నారు. View this post on Instagram A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh) -
'భర్త కోరికలు తీర్చలేకపోయా.. అందుకే మరో అమ్మాయితో'
ఎవరైనా తన భర్త కోసం తమ లైఫ్లో కొన్నింటిని త్యాగం చేస్తారు. ఎంత బిజీ లైఫ్ ఉన్నప్పటికీ భార్య భర్తల మధ్య అన్యోన్యత దెబ్బతినకుండా చూసుకుంటారు. కట్టుకున్న భర్త కోసం కొంత సమయమైనా కేటాయిస్తారు. ఇది సాధారణంగా ఎక్కడైనా జరిగేదే. కానీ ఓ సింగర్ తన భర్త కోసం చేసిన పని చూస్తే కచ్చితంగా షాకవ్వాల్సిందే. ఎందుకంటే తన భర్తకు సమయం కేటాయించలేకపోతున్నానంటూ బాధపడింది. అంతే కాకుండా తన భర్త కోసం ఏదో ఒకటి చేయాలనుకుంది. చివరికీ మరో అమ్మాయితో తన భర్తకు పెళ్లి చేసి ఆ లోటును తీర్చింది. ఇంతలా షాకింగ్ ఇచ్చిన ఆ సింగర్ కథేంటో తెలుసుకుందామా? ప్రముఖ మలేషియన్ సింగర్ అజ్లిన్ అరిఫిన్ తన భర్తకు రెండో పెళ్లి చేసి వార్తల్లో నిలిచింది. తన బిజీ కెరీర్ కారణంగా.. భర్త కోసం తగినంత టైం కేటాయించలేకపోయానని ఆమె తెలిపింది. అందుకే అతనికి కొత్త భాగస్వామిని తీసుకొచ్చానని సింగర్ వెల్లడించింది. ఆమె భర్త వాన్ ముహమ్మద్ హఫీజామ్ వయస్సు ప్రస్తుతం 47 సంవత్సరాలు కాగా.. 26 ఏళ్ల వైద్యురాలితో పెళ్లి చేసింది. మార్చి రెండో వారంలో వివాహం జరిగినట్లు సమాచారం. భర్తకు రెండో పెళ్లిపై అజ్లిన్ అరిఫిన్ మాట్లాడుతూ..'నా బిజీ లైఫ్లో భర్తను సరిగా చూసుకోలేకపోయా. అందువల్ల అతని కోరికలు తీర్చలేకపోతున్నా. అందుకే రెండో పెళ్లికి నేనే చొరవ తీసుకున్నా. ఈ వివాహం తర్వాత కూడా నేను అతనితో సంతోషంగా ఉన్నా. మేం ముగ్గురం ఒకే ఇంట్లో ఉంటున్నాం. నేను అతనితో నా ఖాళీ సమయాన్ని గడుపుతున్నా' అని అన్నారు. కాగా.. 42 ఏళ్ల అజ్లిన్ అరిఫిన్ ప్రతిరోజు తన వృత్తిలో భాగంగా వివిధ నగరాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో తన భర్త ఒంటరిగా ఉంటున్నాడని.. అతను ఒంటరితనం నుంచి బయటపడేందుకే తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని అజ్లిన్ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. అజ్లిన్ మొదట తన మేనేజర్ ఆడమ్ ఫామి అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరిద్దరూ 2011లో పెళ్లి చేసుకుని ఆరేళ్ల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత అస్లిన్ ఆధ్యాత్మికత వైపు మళ్లి నాలుగేళ్లపాటు సింగిల్ జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత వాన్ ముహమ్మద్ హఫీజామ్తో 2021లో రెండో వివాహంజరిగింది. -
11 ఏళ్లకే ఇంట్లో నుంచి పంపించేశారు: నటుడు
బడిలో పాఠాలు చదువుకునే రోజుల్లో గురుద్వారలో కీర్తనలు పాడేవాడు దిల్జీత్ దోసాంజ్. తర్వాత ఆ గొంతే అతడికి పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. పంజాబీ, హిందీ ఇండస్ట్రీలో సింగర్గా, నటుడిగానూ రాణిస్తున్నాడు. అతడు నటించిన అమర్ సింగ్ చంకీలా (అమర్ సింగ్ చంకీలా బయోపిక్) సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టాడు. ఒక్కమాటైనా అడగలేదు '11 ఏళ్ల వయసున్నప్పుడు నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. నా తల్లిదండ్రులను, ఊరిని వదిలేసి మా మామతో లూథియానాకు వెళ్లిపోయాను. అతడు నన్ను తనతో పంపించమని అడగ్గానే అమ్మానాన్న నాకు మంచి ఫుడ్, షెల్టర్ దొరుకుతుందన్న ఆశతో వెంటనే తీసుకెళ్లిపోమని చెప్పారు. వెళ్లడం ఇష్టమేనా? అని నన్ను ఒక్క మాటైనా అడగలేదు. అక్కడికి వెళ్లాక ఒక గదిలో ఒంటరిగా ఉండేవాడిని. టీవీ ఉండేది కాదు. అప్పుడు ఫోన్లు కూడా లేవు. అలా నా కుటుంబానికి నేను పూర్తిగా దూరమయ్యాను. నేను ఏ స్కూల్లో చదువుతున్నానని కూడా నాన్న అడిగేవారు కాదు. అందరితో నా సంబంధాలు తెగిపోయాయి. అమ్మ మాటలు వింటే.. తర్వాత నేను ఫోన్ చేసినప్పుడల్లా కాల్ కట్ చేసేముందు అమ్మ నన్ను ఆశీర్వదించేది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దీవించగానే అన్ని టెన్షన్లు ఎగిరిపోయేవి. ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించేది. తన మాటలతో నాపై ప్రేమవర్షం కురిపించేది. ఆ దేవుడి కంటే కూడా నాకు మా అమ్మే ఎక్కువ' అని చెప్పుకొచ్చాడు. దిల్జిత్ ఇటీవల క్య్రూ సినిమాలో కనిపించాడు. చదవండి: ఆ సీన్ చేయనని ఏడ్చేసిన హీరోయిన్.. విలన్గా అది తప్పదన్న నటుడు -
సింగర్ సుజాత మోహన్ బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
అలాంటి సినిమాలు చూడను.. కానీ: హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్
దక్షిణాదిలో కథానాయకిగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆండ్రియా. కేవలం నటిగా మాత్రమే కాకుండా ఒక గాయనీ, గీత రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు. డబ్బింగ్ కళాకారిణిగా కెరీర్ను ప్రారంభించిన ఆండ్రియా ఇప్పుడు హీరోయిన్గా కూడా రాణిస్తున్నారు. ఒకవైపు సింగర్గా రాణిస్తూన్నారు. అదే విధంగా హీరోయిన్గానే నటిస్తానని స్టాండ్ తీసుకోలేదు. పాత్రలో సత్తా ఉంటే విలనిజాన్ని పండించడానికై నా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానైనా నటించడానికి రెడీ అంటోంది. అలా వడచైన్నె చిత్రంలో తన భర్తను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునే పాత్రలో మెప్పించారు. మరోపక్క సంగీత కచేరీలతో బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆండ్రియా తాజాగా నటించిన కా చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందించారు. ఈ సందర్బంగా ఆండ్రియా ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను హారర్, వయలెన్స్ ఉన్న కథా చిత్రాలను చూడనని.. అలాంటి చిత్రాలు తనకు నచ్చవని చెప్పారు. అయితే అలాంటి కథా చిత్రాల్లో నటిస్తానని మాత్రం చెప్పారు. చూడడం వేరు.. నటించడం వేరు అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. కాగా మిష్కిన్ దర్శకత్వంలో కథానాయకిగా నటించిన మరో హారర్, ధ్రిల్లర్ కథా చిత్రం పిశాచి- 2 నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. -
దేవుడు నాకోసమే పంపాడు, ముంబై వెళ్లిపోతున్నా: హీరోయిన్
మలయాళ హీరోయిన్ సురభి సంతోష్ పెళ్లిపీటలెక్కింది. బాలీవుడ్ సింగర్ ప్రణవ్ చంద్రన్ను పెళ్లాడింది. హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. కొత్త లైఫ్ ప్రారంభిస్తున్న సురభికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి అనంతరం సురభి మాట్లాడుతూ.. 'మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. మేము ఎంగేజ్మెంట్ చేసుకుని చాలా నెలలు కావస్తోంది. ఒక ఆర్టిస్టును పెళ్లాడాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. చివరకు ఆ కల నెరవేరింది. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తా ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ అతడిని కలిసినప్పుడే నచ్చేశాడు.. తర్వాత ఇద్దరం ఒకరిగురించి ఒకరం తెలుసుకుని పెళ్లి చేసుకున్నాం. పెళ్లయిపోయిందని సినిమాలకు దూరంగా ఉండిపోను. తర్వాత కూడా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతాను. అతడు నాకెంతో సపోర్ట్గా ఉంటాడు. ప్రస్తుతం నేను ముంబైకి షిఫ్ట్ అవుతున్నాను. హనీమూన్ ఇంకా ప్లాన్ చేసుకోలేదు. అతడు నెక్స్ట్ మంత్ ఏదో షో కోసం హాంగ్కాంగ్ వెళ్తున్నాడు. నేనూ తనతోపాటు వెళ్తున్నాను. ఫస్ట్ టైమ్ అతడి లైవ్ షో చూడబోతున్నాను. నాకెలాంటి వ్యక్తి భర్తగా రావాలని కోరుకున్నానో అచ్చం అలాంటి మనిషినే ఆ దేవుడు నాకోసం పంపించాడు' అని సంబరపడిపోయింది. లాయర్ కాబోయి హీరోయిన్ కాగా తిరువనంతపురంలో పుట్టిపెరిగిన సురభి లాయర్ కాబోయి యాక్టర్ అయింది. బెంగళూరులో న్యాయవిద్యనభ్యసిస్తున్న సమయంలో తనకు అవకాశాలు రావడంతో సినీ ఇండస్ట్రీవైపు అడుగులేసింది. కుట్టనాదన్ మర్పప్పా, మై గ్రేట్ ఫాదర్, నైట్ డ్రైవ్, కినవల్లి, ఎన్ ఇంటర్నేషనల్ లోకల్ స్టోరీ వంటి పలు చిత్రాలతో మెప్పించింది. అటు ఎల్ఎల్బీ కూడా పూర్తి చేసింది. చదవండి: పిచ్చి కుక్కలా జైల్లో వేద్దామనుకున్నారంటూ నటి ఆవేదన.. గీతూ రాయల్పై పరువునష్టం దావా! -
Harika Narayan: ప్రియుడిని పెళ్లాడిన సింగర్ హారికా నారాయణ్ (ఫొటోలు)
-
సింపుల్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్
ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు అలా మరో టాలీవుడ్ సెలబ్రిటీ పెళ్లి చేసేసుకుంది. మొన్నీమధ్యే నిశ్చితార్థం జరగ్గా.. రెండు వారాలు కూడా గడవక ముందే ప్రియుడితో ఏడడుగులు వేసింది. చాలా సింపుల్గా జరిగిన ఈ వేడుకలో బిగ్బాస్ విన్నర్, సింగర్ రేవంత్ కనిపించాడు. ఈ క్రమంలోనే కొత్త జంటకు తోటీ సింగర్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: కాస్ట్లీ నెక్లెస్తో సెన్సేషనల్ హీరోయిన్.. రేటు ఎంతో తెలుసా?) ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరికి చెందిన హారికా నారాయణ్.. తండ్రి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కావడంతో ఉత్తరాదిలో పెరిగింది. జర్మనీ వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంది. కానీ అనుకోని విధంగా సింగర్ అయింది. నిహారిక 'సూర్యకాంతం' మూవీతో గాయనిగా కెరీర్ మొదలుపెట్టిన హారిక.. మహేశ్ బాబు, దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో ఎంట్రీ సాంగ్స్ పాడి అలరించింది. ఇకపోతే గత ఏడేళ్లుగా పృథ్వీ వెంపటి అనే కుర్రాడితో ప్రేమలో ఉన్న హారికా నారాయణ్.. ఈ విషయాన్ని పెద్దగా బయటపెట్టుకోలేదు. మార్చి 6న నిశ్చితార్థం జరిగిన తర్వాత అతడి ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ శుభాకార్యం జరిగిన రెండు వారాల్లో అంటే మార్చి 17న ఈ బ్యూటీఫుల్ లేడీ సింగర్ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి ఫొటోలు ఎక్కడా బయటకు రాలేదు. వేడుకకు హాజరైన సింగర్ రేవంత్.. తన ఇన్ స్టాలో కొత్త జంట ఫొటో పెట్టి విషెస్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: రెండేళ్లుగా సహజీవనం.. రెండోపెళ్లికి నటి రెడీ..) -
మొన్నే తూచ్ అన్నాడు.. ఇప్పుడేమో బాబుతో దర్శనం!
పంజాబ్ ర్యాపర్, దివంగత సింగర్ సిద్దు మూసేవాలా మరణం ఇప్పుడు గుర్తు చేసుకున్నా మనసు చివుక్కుమంటుంది. దేశవ్యాప్తంగా పేరు మోసిన ఈ సింగర్ను 2022లో దారుణంగా హత్య చేశారు. ఒక్కగానొక్క కొడుకు ఇక లేడన్న నిజాన్ని సిద్దూ పేరెంట్స్ జీర్ణించుకోలేకపోయారు. లెజెండ్స్కు చావు ఉండదని నమ్మారు. తన కొడుకును మళ్లీ చూసుకోవాలని మురిసిపోయారు. ఈ క్రమంలో 58 ఏళ్ల వయసులో సిద్దు తల్లి చరణ్ సింగ్ ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై సిద్దు తండ్రి బల్కౌర్ సింగ్ స్పందిస్తూ అదంతా ఏమీ లేదని, ఏ రూమర్స్నూ పట్టించుకోవద్దని చెప్పాడు. బాబుకు జన్మనిచ్చిన ర్యాపర్ తల్లి కట్ చేస్తే సిద్దూ మూసేవాలా పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఓ బాబుకు జన్మనిచ్చారు. బల్కౌర్ సింగ్ ఓ బాబును ఎత్తుకుని ఉన్న ఫోటోను ఆదివారం (మార్చి 17న) సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్గా మారింది. 'శుభ్దీప్ (సిద్దు మూసేవాలా అసలు పేరు)ను ప్రేమించిన లక్షలాది మంది ఆశీర్వాదాలతో అతడికి ఓ తమ్ముడు పుట్టాడు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఙతలు తెలియజేస్తున్నాను' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. సిద్దు మూసేవాలా మళ్లీ పుట్టాడు అని కామెంట్లు చేస్తున్నారు. పుస్తకం.. ఇకపోతే సిద్దూ జీవిత కథ ఆధారంగా ‘హూ కిల్డ్ మూసేవాలా? ది స్పైరలింగ్ స్టోరీ ఆఫ్ వాయలెన్స్ ఇన్ పంజాబ్' అనే పుస్తకం కూడా వచ్చింది. జుపిందర్ జీత్ సింగ్ ఈ పుస్తకాన్ని రచ్చించారు. పంజాబ్లో గ్యాంగ్స్టర్ల ఆధిపత్యం, మాదకద్రవ్యాల వినియోగం, ఆ రాష్ట్రంలో సంగీత ప్రపంచం వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను ఈ పుస్తకం చూపించింది. View this post on Instagram A post shared by Balkaur Singh (@sardarbalkaursidhu) చదవండి: ఒక్క సీన్ కోసం రూ. 5 కోట్లు అందుకున్న నయనతార -
మాజీ సీఎంపై కేసు.. ఆశ్చర్యం కలిగించిందన్న ప్రముఖ సింగర్!
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై లైంగికదాడి కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని ఓ 17 ఏళ్ల బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ అరెస్ట్పై ఫెమినిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయింది. ఇది తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని ట్వీట్ చేసింది. అంతే కాకుండా ఆ వార్తకు సంబంధించిన క్లిప్ను షేర్ చేసింది. కాగా.. దేశంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అన్యాయాలపై సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తోంది. మనదేశంలో మహిళలకు రక్షణ లేదని చాలాసార్లు తన ట్వీట్ల ద్వారా వెల్లడించింది. ఇటీవల స్పెయిన్ జంటపై జరిగిన లైంగిక దాడిపై కూడా చిన్మయి స్పందించిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే.. ఒక కేసులో సాయం అడిగేందుకు ఫిబ్రవరి 2న యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్నట్లు సమాచారం. యడ్యూరప్ప ఇప్పటికి మూడుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2021లో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. There is a POCSO case lodged against former Karnataka Chief Minister B S Yediyurappa for sexually harassing a minor. I am stunned. pic.twitter.com/vjY4ynwurR — Chinmayi Sripaada (@Chinmayi) March 15, 2024 -
సంగీతం వస్తేనే సింగర్ అయిపోరు అని ప్రూవ్ చేసింది!
ఎలాంటి సంగీత నేపథ్యం లేకున్నా పాటను చక్కగా ట్యూన్ చేయగలదు. ఆమె పాటలను రాసి ట్యూన్ చేసి పాడేస్తుంది. అవే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఫేమస్ అయ్యింది. అదే సినీ ఇండస్ట్రీలోకి వచ్చేల చేసింది. అంతేకాదండోయ్ ఫేమస్ పాట 'జిందగీ' పాడింది కూడా ఈమెనే. ఆమె ఎవరంటే.. లాక్డౌన్ కాలంలో దొరికిన విరామంలో ఎంతోమంది తమలోని క్రియేటివ్ టాలెంట్స్ను మెరుగు పరుచుకున్నారు. అలాంటి వారిలో హనియా ఒకరు. కేరళలోని కోచికి చెందిన హనియా నసిఫా లాక్డౌన్లో ఖాళీ సమయం దొరకడంతో సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. ‘నాకు ఎలాంటి సంగీత నేపథ్యం లేదు. అయితే పాటలను రాసి ట్యూన్ చేస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపించేది. అలా పాటలనేవి నా దిన్యచర్యలో భాగం అయ్యాయి’ అంటుంది హానియా. ఇన్స్టాగ్రామ్లో ఆమె ట్రాక్స్ వైరల్ అయ్యాయి. ఇది హానియాను లైమ్లైట్లోకి తీసుకువచ్చింది. ‘నా షార్ట్ మ్యూజిక్ క్లిప్స్కు వేలల్లో వ్యూస్ రావడం మొదలు కావడంతో మరింత ఉత్సాహం వచ్చింది. ఇక అప్పటి నుంచి పాటలను ప్రొఫెషనల్గా రికార్డ్ చేయడం ప్రారంభించాను. మ్యూజిక్ ఇన్స్ట్రూమెంట్స్ను అప్గ్రేడ్ చేశాను’ అంటుంది ఇరవై సంవత్సరాల హనియా. హనియా తన టాలెంట్తో సోషల్ మీడియా నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ఎంతో కాలం పట్టలేదు. మన తెలుగు సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో ‘జిందగీ’ అనే పాటను పాడింది. (చదవండి: ఈజీగా బరువు తగ్గేందుకు సులభమైన మూడు మార్గాలు ఇవే!) -
58 ఏళ్ల వయసులో ప్రెగెన్సీ?.. క్లారిటీ ఇచ్చిన సింగర్ తండ్రి!
దేశవ్యాప్తంగా పేరు మోసిన సింగర్ సిద్దూ మూసేవాలా రెండేళ్లక్రితం ప్రాణాలు విడిచారు. 2022లో ఆయన్ను దారుణంగా హత్య చేసి చంపారు. ఒక్కగానొక్క కొడుకు తమను విడిచి వెళ్లిపోవడంతో సిద్దు పేరెంట్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే సిద్దూ తల్లి చరణ్ సింగ్ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చిందని, 58 ఏళ్ల వయసులో మరోసారి తల్లి కాబోతోందని ప్రచారం జరిగింది. తనకు ఈ నెలలో కవలలు పుట్టబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో సిద్దు తండ్రి బల్కౌర్ సింగ్ సదరు వార్తలను ఖండించాడు. మా కుటుంబాని గురించి ఆరా తీస్తున్న సిద్దు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గురించి లేనిపోనివన్నీ రాస్తున్నారు. అనేక రూమర్లు పుట్టిస్తున్నారు. దయచేసి వాటిని ఎవరూ నమ్మవద్దని కోరుతున్నాను. ఒకవేళ ఏదైనా ఉంటే మేమే మీకు స్వయంగా తెలియజేస్తాం అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. అయితే చరణ్ తల్లికాబోతున్న విషయాన్ని సిద్దు మూసేవాలా అంకుల్ చాంకౌర్ సింగ్ ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడేమో తన గురించి వస్తున్న ఏ వార్తలనూ నమ్మవద్దని బల్కౌర్ కోరడం ఆసక్తికరంగా మారింది. చదవండి: డిప్రెషన్.. ముద్ద దిగలేదు.. ఏడుస్తూ ఉండిపోయా.. నటి కన్నీళ్లు -
స్వరమే కాదు.. అందంతో కూడా ఆహా అనిపించే ఈ సింగర్ తెలుసా! (ఫోటోలు)
-
కాంగ్రెస్ శిబిరంలోకి సింగర్ నేహా సింగ్.. పోటీ చేస్తారా?
Singer Neha Singh Rathore : లోక్సభ ఎన్నికల తేదీల ప్రకటనకు ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు మొదటి విడత అభ్యర్థుల జాబితాలు సైతం విడుదల చేశాయి. అయితే కొన్ని స్థానాలకు అభ్యర్థుల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ కాంగ్రెస్ టిక్కెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న చర్చ సాగుతోంది. ముంబైలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శిక్షణా శిబిరంలో నేహా సింగ్ రాథోడ్ ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆమె కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా నేహా సింగ్ రాథోడ్ మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్నారా అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయమని అడిగితే ఆలోచిస్తానని చెప్పారు. అలాగే త్వరలో తన కొత్త పాటను తీసుకువస్తున్నట్లు తెలిపారు. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబైలో లోక్సభ ఎన్నికల కోలాహలం అప్పుడే మొదలైపోయింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనప్పటికీ నేతలు తమ కార్యకర్తలు, అనుచరులతో సన్నాహాలు ప్రారంభించారు. ముంబైలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శిబిరంలో కార్యకర్తలతో మాట్లాడిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. వ్యక్తిగత విబేధాలను పక్కనబెట్టి పార్టీ కోసం పని చేయాలని కోరారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడి లోక్సభ స్థానాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీట్ల షేరింగ్కు ఎలాంటి ఫార్ములా ఖరారు కాలేదు. కానీ అన్ని పార్టీలు ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి. కాంగ్రెస్తో పాటు, శివసేన (యూబీటీ), ఎన్సీపీ శరద్ పవార్ వర్గం మహావికాస్ అఘాడిలో భాగంగా ఉన్నాయి. -
కుక్కూ కుక్కూ పాటకు 487 మిలియన్ల వ్యూస్.. కానీ ఒక్క పైసా..!
సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్.. తమిళం, తెలుగు తదితర భాషా చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బహుళ ప్రాచుర్యం పొందారు. ఈయన దర్శకుడు పా.రంజిత్ చిత్రాలకు సంగీతాన్ని అందించి వెలుగులోకి వచ్చారు. అలా వీరి కాంబినేషన్లో అట్టకత్తి, కాలా, కబాలి వంటి పలు చిత్రాలు రూపొందాయి. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం వైరల్ అయ్యింది. ఫేమస్ సాంగ్.. ఇటీవలే చైన్నెలో సంగీత కచేరిని భారీ ఎత్తున నిర్వహించిన సంతోష్ నారాయణన్ పలు ప్రైవేట్ ఆల్బమ్లను రూపొందించారు. అలా ఆయన సంగీతాన్ని అందించిన ప్రైవేట్ పాట ఎంజాయ్ ఎన్సామి.. 2021లో విడుదలవగా బాగా పాపులర్ అయ్యింది. ఎంతగా అంటే యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకూ 487 మిలియన్లకు పైగా వ్యూస్ను, 5 మిలియన్ లైక్స్ను పొందింది. అది సరే ఇప్పుడెందుకు దీని గురించి చెబుతున్నారు? అనిపిస్తోందా? దీనికి కారణం సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్నే. ఇప్పటివరకు ఎక్కడా చెప్పలే.. ఆయన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఎంతో పాపులర్ అయిన ఎంజాయ్ ఎన్. సామి (కుక్కూ కుక్కూ..) పాట నిమిత్తం తనకు ఇప్పటి వరకూ ఒక్క పైసా ఆదాయం రాలేదని, అంతా ఆ పాటను తెరకెక్కించిన మ్యూజిక్ సంస్థకే చేరిందని పేర్కొన్నారు. ఈ విషయం గురించి తాను ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదని, ఇప్పుడు చెప్పాలనిపించిందన్నారు. కాగా ప్రస్తుతం సంగీత కళాకారులకంటూ ప్రైవేట్ పాటల కోసం ఒక ప్లాట్ఫామ్ అవసరం ఉందని, అందుకే తాను ఒక మ్యూజిక్ స్టూడియోను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇకపై సంగీత కళాకారులు బాధ పడాల్సిన అవసరం ఉండదని, మీకు చేరాల్సింది కచ్చితంగా చేరుతుందని సంతోష్ నారాయణన్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Santhosh Narayanan (@musicsanthosh) చదవండి: మా అత్తమ్మే నాకు స్ఫూర్తి : రాంచరణ్ సతీమణి ఉపాసన
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్కు ఫ్యూజ్లు ఔట్
భారీగా పెరిగిన ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్..
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement