రైతులపై చంద్రబాబుది కపట ప్రేమ
రేపల్లె, న్యూస్లైన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి రుణ మాఫీ చేయటంతోపాటు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతన్నలను ఆదుకున్నారని టీడీపీ సీనియర్ నాయకులు శీలం సుబ్బయ్య తె లిపారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి మండలంలోని కారుమూరుకు చెందిన సీనియర్ టీడీపీ నాయకులు శీలం సుబ్బయ్య ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణారావు సమక్షంలో వైఎస్సార్ సీపీలో సీపీ చేరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో వ్యవసాయాన్ని విస్మరించటంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గురించి అవహేళనగా మాట్లాడిన చంద్రబాబు తిరిగి అధికారం కోసం రైతులపై కపట ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. ై
వెఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే శక్తి జగన్కే ఉందని విశ్వసించి పార్టీలో చేరినట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. తొలుత శీలం సుబ్బయ్యకు వైఎస్సార్ సీపీ కండువాలను కప్పి ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణారావు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఆయనతో పాటు సమ్మెట శ్రీనివాసరావు (ఎల్ఐసీ శ్రీను), ఊటా వీరప్రతాప్తో పాటు 100 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ మండల కన్వీనర్ నాంచారయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు యడం రాజేంద్రప్రసాద్, రామాయణం రత్తయ్య, మోర్ల రమణ, రావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.