breaking news
Rs 4000 crore
-
రూ.4000 కోట్లతో షాపింగ్ మాల్.. మూడువేల జాబ్స్
భారతదేశంలో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ కార్యకలాపాలను విస్తరించడానికి చైర్మన్ అండ్ ఎండీ 'ఎంఏ యూసఫ్ అలీ' ప్రయాణిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు అహ్మదాబాద్లో అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించనున్నట్లు ఈయన పేర్కొన్నారు. దీనికోసం ఇప్పటికే 3,50,000 చదరపు అడుగుల భూమిని సేకరించినట్లు కూడా అలీ వెల్లడించారు.భారతదేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని యూసఫ్ అలీ అన్నారు. ఈ మాల్ నిర్మాణం పూర్తయితే సుమారు 3000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ షాపింగ్ మాల్ నిర్మించడానికి సుమారు రూ. 4000 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా.ప్రస్తుతం భారతదేశంలో ప్రధాన నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, లక్నో, తిరువనంతపురం, కోయంబత్తూరులలో లులు మాల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో గత ఏడాది లులు మాల్ ప్రారంభమైంది.ఇదీ చదవండి: గణేష్ చతుర్థి: స్వీట్స్ ఆర్డర్లలో ఆ నగరమే టాప్.. యూఏఈలోని అబుదాబిలో ప్రధాన కార్యాలయాన్ని కలిగిన 'లులు గ్రూప్ ఇంటర్నేషనల్' మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికన్ రిటైల్ పరిశ్రమలో ట్రెండ్సెట్టర్గా పిలువబడుతుంది. ఈ సంస్థ సుమారు 49 దేశాల్లో హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లను నిర్వహిస్తోంది. ఇందులో ఈజిప్టు, ఇండియా, ఇండోనేసియా, మలేషియా మొదలైన దేశాలు ఉన్నాయి.#WATCH | Kerala: On investment in India, Chairman & Managing Director of Lulu Group International, Yusuffali M. A. says, "...I am very happy to give employment to my fellow citizens...India's biggest shopping mall is in Ahmedabad...I am getting full support from the central… pic.twitter.com/PFsxwVRRu3— ANI (@ANI) September 8, 2024 -
అంచనాలను మించిన పరోక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన 2014-2015 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల వసూళ్లు రూ. 5,46,479 కోట్ల మేర జరిగాయి. ఇది సవరించిన అంచనా మొత్తం రూ.5,42,325 కోట్లతో పోలిస్తే రూ.4,000 కోట్లు అధికం. బడ్జెట్ అంచనా మొత్తం రూ.6,24,902 కోట్లతో పోలిస్తే మాత్రం ఈ సవరించిన అంచనా మొత్తం రూ.82,577 తక్కువ. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.6.24 లక్షల కోట్ల పరోక్ష పన్నుల వసూళ్ల లక్ష్యం సవాళ్లతో కూడుకున్న అంశమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పలు సందర్భాలలో అన్నారు. తదుపరి ఆ అంచనాల్ని సవరించారు. 2013-14లోని రూ.4,97,061 కోట్ల వసూళ్లతో పోలిస్తే 2014-2015లో వసూళ్లు 9.9% మేర పెరిగాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న 4.1 శాతం ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడానికి అదనపు పన్నుల సమీకరణ తోడ్పడనుంది. ద్రవ్యలోటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 3.9 శాతానికి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 3.5 శాతానికి, 2017-18 ఆర్థిక సంవత్సరానికి 3 శాతానికి కట్టడి చేయాలని అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు.