-
కేసీఆర్ బీజేపీతో జతకట్టారనడానికి ఇదే నిదర్శనం: మంత్రి శ్రీధర్బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట బడ్జెట్పై కేసీఆర్ విమర్శలా?.. కేంద్ర బడ్జెట్పై ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు మంత్రి శ్రీధర్బాబు.. కేసీఆర్ బీజేపీతో జతకట్టారనడానికి ఇదే నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేశారాయన.. రాష్ట్ర బడ్జెట్ పెంచాలని అనుకున్నాం కానీ కేంద్రం నుంచి నిధులు రాలేదు.. సంక్షేమం, అభివృద్ధి సమభాగంలో బడ్జెట్ కేటాయింపులు జరిపామని మంత్రి అన్నారు.వ్యవసాయ రంగానికి న భూతో న భవిష్యత్ అనుకుంటున్నాం. హైదరాబాద్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మౌలిక వసతుల కోసం రూ. 10 వేల కోట్లు కేటాయించాం. హైదరాబాద్ ఎకో సిస్టం అభివృద్ధి కోసం 10వేల కోట్లు బడ్జెట్లో పెట్టాం. భవిషత్ తరాలకు అవసరం అయ్యేందుకు బడ్జెట్ కేటాయింపులు చేశాం.’’ అని శ్రీధర్బాబు వివరించారు.వ్యవసాయనికి 23వేల కోట్లు గత ప్రభుత్వం పెడితే.. ఇప్పుడు 72వేల కోట్లు పెట్టాం. వట్టి మాటలు మేము చెప్పడం లేదు.. కేసీఆర్ చెప్పి వెళ్ళారు. హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగంగా జరగబోతోంది అందుకే బడ్జెట్ ఫోకస్ ఎక్కువగా సిటిపై పెట్టాం. మాకు ఒక విజన్ ఉంది.. 2004లో మహిళలను లక్షాధికారులను చేసి చూపాం. మేము అప్పులు తెచ్చి.. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నం. జులై వరకు 35వేల కోట్లు అప్పు చేసి 42వేల కోట్ల వడ్డీలు కట్టాం. రాష్ట్రం పై కేసీఆర్కు ప్రేమ ఉంటే నిన్న ఎందుకు రాలేదు?. కేంద్రం నుంచి పిలుపు రాగానే కేసీఆర్ ఇక్కడికి వచ్చి మాట్లాడి పోయారు. తెలంగాణ హక్కుల కోసం కేంద్రాన్ని అడుగుతాం’’ అని శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
కాళేశ్వరానికి బీఆర్ఎస్ బృందం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్ట్ను కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. గురువారం సాయంత్రం కరీంనగర్లోని మానేరు డ్యాం పరిశీలించారు. రేపు(శుక్రవారం) కన్నెపల్లి పంప్ హౌజ్, మేడిగడ్డ ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు. డ్యాం పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి రంగంలో కొత్త విప్లవం తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అని.. బీడు భూములు సాగులోకి తెచ్చారని.. దేశాన్ని తలదన్నే రీతిలో ధాన్య భాండాగారంగా తెలంగాణ మారింది. వరిసాగులో పంజాబ్, హర్యానాను తెలంగాణ వెనక్కు నెట్టిందన్నారు.‘‘45 శాతం తక్కువ వర్షపాతం ఈ సంవత్సరం నమోదైంది. లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతుంది. పంపింగ్ చేయాల్సి ఉన్నా చేయడం లేదు. అధికారులు పదే పదే చెప్తున్నారు అన్ని డ్యామ్లను పంపింగ్ చేసి నింపాలని. కాళేశ్వరం నీటిని పరివాహక ప్రాంతంలో పంపింగ్ చేయాలని అన్ని రిజర్వాయర్లను నింపాలని వాస్తవాలను ప్రజలకు చెప్పే ఉద్దేశంతో మా బృందం బయల్దేరాం. లక్షల కోట్లు వృధా అయ్యాయని.. మా పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్. మేడిగడ్డ మేడిపండు అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’’ అని కేటీఆర్ మండిపడ్డారు.‘‘10 లక్షల క్యూసెక్కుల నీటి వరదను తట్టుకుని బ్రహ్మాండంగా మేడిగడ్డ నిలబడి ఉంది. ఎన్నికలు అయిపోయాయి.. సీఎం రాజకీయాలు పక్కనపెట్టి నీటిని అన్ని డ్యామ్లకు పంపింగ్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. రేపు మేడిగడ్డ, కన్నెపల్లి సందర్శిస్తాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
బడ్జెట్పై కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్పై స్పందించని కేసీఆర్, రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈమేరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారుజ కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్... రాష్ట్ర బడ్జెట్ను విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు.బీజేపీతో ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీ కి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నాడని సీతక్క విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ మెప్పుకోసమే ఆయన రాష్ట్ర బడ్జెట్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు ఆరు నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావడమే అందుకు నిదర్శనమని అన్నారు.కాగా తెలంగాణ బడ్జెట్.. రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు జల్లేలా ఉందని కేసీఆర్ మండిపడ్డారు. తమ పాలనలో ఎన్నో పథకాలు పెడితే.. వాటన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. రైతులకు, మత్య్సకారులకు.. ఇలా వర్గానికి మేలు చేసేలా లేదు. ఐటీ, పారిశ్రామిక విధానాలు లేవు. తెలంగాణ బడ్జెట్ ఒట్టి గ్యాస్.. ట్రాష్. బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఒత్తి ఒత్తి ఆర్థిక మంత్రి మాట్లాడారే తప్ప.. కొత్తగా ఏమీ చెప్పలేదు. ఏదో కథ చెప్పినట్లు.. రాజకీయ ప్రసంగంలా ఉందే తప్పా.. ఏ ఒక్క వర్గానికి మేలు చేసేలా లేదన్నారు. -
బీఆర్ఎస్ పాలనలో వామనావతారంలాగా అప్పులు: భట్టి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో బీఆర్ఎస్ పాలనను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, తాము మాత్రం జనరంజకమైన బడ్జెట్ ద్వారా ప్రజల ముందుకు వస్తున్నామని అన్నారాయన. ‘‘గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు పది రేట్లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగాలు, నీళ్లు దక్కలేదు. బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికారు. కానీ, బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది. వామనావతారం లెక్క అప్పులు పెరిగాయి. ఒంటెద్దు పోకడలతో ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అప్పులు పెరగడంతో పాటుగా బిల్లులు బకాయిలు భారీగా పెరిగిపోయాయి. కొత్త ఉద్యోగాలు సృష్టించడం కాదు.. ఉన్న ఉద్యోగాలే ఇవ్వలేదు. దశాబ్ద కాలంలో తెలంగాణ పురోగమించలేదు. జీతాలు, పెన్షన్లు చెల్లింపులు కూడా చేయలేని పరిస్థితి. ఆర్థిక క్రమ శిక్షణ పాటించకుండా తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు. పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. దుబారా ఖర్చు ఆపేసి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. రాష్ట్రంలో ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టాం. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం. ఏదో విధంగా ఎన్నికల్లో గెలవాలిని మేము హామీలు ఇవ్వలేదు. ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించే హామీలు ఇచ్చాం. మేం అధికారంలోకి వచ్చాక 31,768 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. డిసెంబర్ నుంచి పథకాల కోసం రూ.34,579 కోట్లు ఖర్చు చేశాం. ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీని రూ. 10 లక్షలకు పెంచాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఎన్నో ఏళ్లు ప్రజలు ఉద్యమం చేశారు అని భట్టి అన్నారు. ఒకానొక దశలో బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు నినాదాలు చేశారు. అయినా భట్టి తన ప్రసంగం కొనసాగించారు.2024-25 బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘ఆయిల్ పామ్ సాగుకు రైతులకు అవసరమైన సాయం అందిస్తాం. రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు, పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తాం. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రోను విస్తరిస్తాం. ఉచిత బస్సులు పథకం రాష్ట్ర అభివృద్ధి సాయపడుతోంది’ అని తెలిపారు. -
తెలంగాణపై వివక్ష.. కేంద్ర బడ్జెట్పై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష చూపారంటూ రాష్ట్ర శాసనసభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షపై విస్తృతంగా చర్చించారు. మంత్రి శ్రీధర్బాబు చర్చను ప్రారంభించగా.. తర్వాత కేటీఆర్, బీజేపీపక్ష నేత మహేశ్వర్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీశ్రావు, మాజిద్ హుస్సేన్ (ఎంఐఎం), కూనంనేని సాంబశివరావు (సీపీఐ), వివేక్ వెంకటస్వామి (కాంగ్రెస్) తదితరులు మాట్లాడారు. చివరగా ఈ తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం సభను స్పీకర్ ప్రసాద్కుమార్ గురువారానికి వాయిదా వేశారు. అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానం ఇదీ.. ‘‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం.. భారతదేశం అన్ని రాష్ట్రాల సమాఖ్య. అన్ని రాష్ట్రాల సమీకృత, సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ ఇదే ధోరణి కొనసాగుతోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఇది తెలంగాణ ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపింది. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు పలు దఫాలుగా ప్రధాన మంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలసి వివిధ విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరటంతోపాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక అభ్యర్థనలు అందించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష చూపింది. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై శాసనసభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడెŠజ్ట్కు సవరణలు చేసి.. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సభ తీర్మానం చేస్తోంది..’’ -
మీది మేనేజ్మెంట్ కోటా..మీది పేమెంట్ కోటా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బుధవారం శాసనసభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ పక్షాన మాట్లాడిన ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరుచేసిన వ్యాఖ్యలను మరొకరు దీటుగా తిప్పికొట్టారు. మధ్యలో డిప్యూటీ సీఎం భట్టి కూడా కలుగజేసుకున్నారు. అయితే ఈ మాటల యుద్ధం ప్రధానంగా రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా సాగింది. చర్చా..తీర్మానమా?: కేటీఆర్ కేటీఆర్: కేంద్ర బడ్జెట్పై చర్చ పెట్టారా? తీర్మానం చేస్తున్నారా? ఏం అర్థం కావడం లేదు. రేవంత్: కేంద్ర బడ్జెట్పై చర్చ అని స్పష్టంగా చెప్పా. అవగాహన రాహిత్యంతో మళ్లీ ప్రశ్నిస్తే ఎలా? కేటీఆర్: సీఎం మాట్లాడతారని అనుకున్నాం. మంత్రితో చర్చను ప్రారంభించారు. ముఖ్యమంత్రికి మాట్లాడడం ఇష్టం లేదేమో? రేవంత్: ఇష్టం లేనిది పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి. కేసీఆర్ ఎందుకు రాలేదు? మోదీ ఎక్కడ చూస్తారో, ఏమవుతుందోననే భయంతో ఇంట్లో కూర్చుని వీళ్లను పంపించి మాట్లాడిస్తున్నారు. వీళ్లా మాట్లాడేది? కేటీఆర్: ఈ నాయకుడి స్థాయికి మేం చాలు. కేసీఆర్ అవసరం లేదు. మీ సత్తా మాకు తెలుసు. మాకు సమాధానం చెప్పండి చాలు. మీది అవగాహనా రాహిత్యం: సీఎం కేటీఆర్: తీర్మానం ఏది? ఏం చేస్తున్నారో అర్థం కాకుండా పోతోంది. ముఖ్యమంత్రి అంటే గతంలో మంత్రిగా చేయలేదు. ఆయనకు అనుభవం లేకపోవచ్చు. అనుభవం ఉన్న మంత్రిగా మీరు (శ్రీధర్బాబునుద్దేశించి) చెప్పాలి కదా? మేం మిమ్మల్ని కోరుతున్నాం. రేవంత్: మీది అవగాహన రాహిత్యం. అనవసర వివాదాలను తేవద్దు. మీది మేనేజ్మెంట్ కోటా మాత్రమే కాదు... నయా భూస్వామ్య విధానం. నేను అయ్యా, తాత పేరు చెప్పుకుని రాలేదు. జిల్లా పరిషత్ నుంచి మండలి సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా స్వయంకృíÙతో ఎదిగి సీఎం అయ్యా. వివాదాలు వద్దు. చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు చెప్పండి. కేటీఆర్: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారికి సహనం, సంయమనం, ఓపిక ఉండాలి. నన్ను మేనేజ్మెంట్ కోటా అన్నారు. పేమెంట్ కోటాలో సీఎం సీటు కొట్టేశారని నేను అంటా. అయ్యల పేర్లు చెప్పి అని మాట్లాడుతున్నారు. మీరు రాహుల్ గురించి మాట్లాడుతున్నారా? రాజీవ్ గురించి మాట్లాడుతున్నారా? మీదాకా వస్తే కానీ అర్థం కాలేదా?: కేటీఆర్ కేటీఆర్: ప్రధాని రాష్ట్రానికి వస్తే పెద్దన్నా అంటూ అన్నదమ్ముల అనుబంధాన్ని పండించారు. కానీ ఏం జరిగింది? మీదాకా వస్తే కానీ అర్థం కాలేదా? మేం ఇన్ని రోజులు చెప్పింది అదే. వారి వ్యవహారం అలానే ఉంటుంది. తత్వం ఇప్పుడైనా మీకు అర్థమైంది చాలు. రేవంత్: మిషన్ భగీరథ కార్యక్రమానికి 2016, ఆగస్టు 7న మెదక్ జిల్లా కోమటిబండకు ప్రధాని మోదీ వస్తే కేసీఆర్ ఏమన్నారు. మాకు 50 వేల కోట్లు, లక్ష కోట్లు వద్దు. మీ ప్రే మ, ఆశీర్వాదాలు చాలు అనలేదా? ప్యార్ చాహియే అంటూ మోదీ ప్రేమలో మునిగి తేలి తెలంగాణను ముంచలేదా? బీజేపీని కాపాడింది మీరు కాదా?: రేవంత్ కేటీఆర్: ఎలివేటెడ్ కారిడార్ మేమే తెచ్చాం. రక్షణ శాఖ భూముల విషయంలో ఎంతో చేశాం. ఎవరో చేసిన దాన్ని మా ఖాతాల్లో వేసుకునే అలవాటు లేదు. ఏమీ చేయకుండానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని మేం చెప్పుకోం. కేంద్రం నిధులివ్వకపోయినా ఆగలేదు. పోరాడాం.. గర్జించాం. రేవంత్: మీరేదో పోరాటం చేసినట్టు, మీ పోరాటానికి ఢిల్లీ దద్దరిల్లినట్టు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. 2014–21 వరకు ఎన్డీయేకు రాజ్యసభలో మెజార్టీ లేనప్పుడు బీజేపీని కాపాడింది మీరు కాదా? జీఎస్టీ బిల్లు పెట్టగానే బీజేపీ రాష్ట్రాల కంటే ముందే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం చేయలేదా? ఆర్టీఐ చట్ట సవరణ బిల్లు, నోట్ల రద్దుకు మద్దతివ్వడంతో పాటు రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడికి ఓట్లు వేసిందెవరు? ఆరి్టకల్ 370 రద్దుకు మద్దతిచి్చందెవరు? ట్రిపుల్ తలాఖ్ అప్పుడు వాకౌట్ చేసిందెవరు? ఇప్పుడు అసలు విషయం పక్కనపెట్టి ఏదో చేశామని చెప్తారా? ఓల్డ్ సిటీలో అదానీ మనుషుల సంగతి చూడండి: కేటీఆర్ కేటీఆర్: కేంద్రం మోటార్లకు మీటర్లు పెట్టమంటే మేం పెట్టలేదు. రైతుల పక్షాన నిలబడ్డాం. కానీ, ఇప్పుడు హైదరాబాద్లో కరెంటును అదానీకి అప్పజెపుతున్నారని వార్తలొచ్చాయి. ఓల్డ్సిటీలో అదానీ మనుషులు వచ్చారని గొడవలు జరుగుతున్నాయి చూసుకోండి. ఎంఐఎం ఎమ్మెల్యేలతో మాట్లాడి వారిలో భరోసా కలి్పంచండి. భట్టి: అదానీ గురించి మేం ఎప్పుడూ చెప్పలేదు. సభను తప్పుదోవ పట్టించకండి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అసలు అంశాన్ని పక్కన పెట్టి ఆవు కథలాగా మళ్లీ పదేళ్ల చరిత్ర చెబుతున్నారు. బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందోనని ‘ఆవుకు నాలుగు కాళ్లు ఉండును. తోక ఉండును అని అంటున్నారు. రేవంత్: గాలివాటం వార్తలు పట్టుకుని గాలిమాటలు మాట్లాడడం కాదు. అదానీకి అప్పగిస్తామని మేమెప్పుడూ చెప్పలేదు. -
మేమెప్పుడూ ప్రజా పక్షమే
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ హక్కులు కాలరాశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. ‘ఒక రాష్ట్రానికి చేయూత అందించి మరో రాష్ట్రానికి చేయి ఇవ్వడం హక్కులను కాలరాయడమే. ఆంధ్రకు ఇవ్వడంలో తప్పు లేదు. కానీ మనకు ఇవ్వకపోవడమే బాధ కలిగిస్తోంది. అధికారంలో ఉండి పదేళ్లు మేం చెప్పిందే ఇప్పుడు మంత్రి శ్రీధర్బాబు చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి బీజేపీ వైఖరి ఇలానే ఉంది. మేము ఇచ్చినట్టే కేంద్రం చుట్టూ తిరిగి కాంగ్రెస్ నేతలు విజ్ఞాపనలు ఇచ్చారు. అయినా న్యాయం జరగలేదు. పదేళ్లు కేంద్రం ఇబ్బంది పెట్టినా మేమెక్కడా ఆగలేదు. దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపాం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరితోనూ రాజీ పడేది లేదు. ప్రభుత్వంతో కలిసి వస్తాం.. నిలబడతాం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మేమెప్పుడూ తెలంగాణ ప్రజల పక్షానే ఉంటాం. రాష్ట్ర విశాల ప్రయోజనాలే బీఆర్ఎస్కు పరమావధి..’ అని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష గురించి బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ పక్షాన కేటీఆర్ మాట్లాడారు.పార్లమెంటులో బీఆర్ఎస్ లేకపోవడమే కారణం‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన చర్చను మేము స్వాగతిస్తున్నాం.. సమర్థిస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని నిషేధిస్తే, ఇప్పుడు పార్లమెంటులో తెలంగాణ ప్రస్తావనే లేకుండా పోయింది. ఇందుకు పార్లమెంటులో బీఆర్ఎస్ లేకపోవడం, గులాబీ జెండా ఎగరకపోవడమే కారణం. గణిత శాస్త్రం ప్రకారం 8 + 8 =16 . కానీ ఇప్పుడు 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు కలిపితే గుండు సున్నా వచ్చింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసిన తర్వాత ప్రతి తెలంగాణ బిడ్డకు కలిగిన భావన ఇదే. అయితే ప్రభుత్వం అసెంబ్లీలో దీనిపై చర్చ పెట్టడం వెనుక కారణం వేరే ఉంది. మేమెవరితోనూ కలిసేది లేదు.. విలీనమయ్యేది లేదుకాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్లిన 21 ట్రిప్పులు, విమాన ఖర్చులు వృథా కావడంతో, పైసా రాకపోవడంతో ప్రజల ముందు మొహం చెల్లక ఈ చర్చ పెట్టారు. చర్చ పెట్టాల్సింది ఇక్కడ కాదు. పార్లమెంటులో ఉన్న 99 మంది కాంగ్రెస్ ఎంపీలు కలిసి కొట్లాడాలి. మేము ఎక్కడికీ వెళ్లేది లేదు.ఎవరితోనూ కలిసేది లేదు. విలీనమయ్యేది లేదు. ఇక్కడే ఉంటాం. ఆరు గ్యారంటీలు అమలయ్యేదాకా మిమ్మల్ని అడుగుతూనే, కడుగుతూనే ఉంటాం. ఐటీఐఆర్ తెస్తారా.. చస్తారా ప్రజలు చూస్తారు. మా జెండా, ఎజెండా తెలంగాణమే. ఈ విషయంలో ఎక్కడకు, ఎలా తీసుకెళ్లినా తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వంతో కలిసి వస్తాం..’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. మాపై ఎదురుదాడి ఎందుకు?కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో అధికార కాంగ్రెస్ సభ్యులు పలుమార్లు అడ్డు తగిలారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబులు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చేశారు. ఈ దశలో ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ రెండు పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగి సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కేంద్ర బడ్జెట్లో ఏం జరిగిందో చెప్పకుండా కేటీఆర్ పదేళ్ల చరిత్రను చెబుతున్నారంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ఇందుకు స్పందించిన కేటీఆర్.. తాము ఎక్కడైనా తప్పు, పొరపాటు చేసి ఉంటే ప్రజలు అందుకు తగిన శిక్ష విధించి ఇక్కడ కూర్చోబెట్టారని, తమపై ఎదురుదాడి ఎందుకని ప్రశ్నించారు.ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయండిసీఎంతో సహా మంత్రులంతా పాల్గొనాలిబీఆర్ఎస్ తరఫున వెయ్యి మంది వచ్చి మద్దతిస్తాంకేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినందున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా మంత్రిమండలి అంతా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయాలని, దానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని కేటీఆర్ చెప్పారు. ‘తెలంగాణకు నిధులు వచ్చేంతవరకు ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. అందుకు మా పార్టీ తరఫున వెయ్యి మంది వస్తాం. మేం బీజేపీతో ఎలాంటి చీకటి ఒప్పందం చేసుకోలేదు. సీఎం రేవంత్రెడ్డి మాపై అలాంటి ఆరోపణలు చేయడం సరికాదు. రామ్నాథ్ కోవింద్ దళితుడని, వెంకయ్య నాయుడు తెలుగువారైనందున వారిద్దరికీ మద్దతు ఇచ్చామే తప్ప బీజేపీకి కాదు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన యశ్వంత్సిన్హాకు రాహుల్గాంధీతో కలిసి ఆయనకు మద్దతుగా సంతకం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. చీకటి స్నేహాలు మాకు తెలియవు: చీకటి స్నేహాలు మాకు తెలియవు. రేవంత్రెడ్డికి ఢిల్లీలో బీజేపీ ఎంపీలు పని చేయిస్తారు. ఆయనే బీజేపీతో స్నేహం చేస్తున్నారు. మేం బీజేపీలో విలీనం చేయం. రేవంత్రెడ్డిలాగా పరాన్నజీ వులం కాదు.. అధికారం కోసం పార్టీలు మారడానికి. మోదీ పేరు చెప్పడానికే రేవంత్రెడ్డి ఎందుకు భయపడు తున్నారు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. మీరాకుమార్కు మద్దతెందుకు ఇవ్వలేదు: భట్టిడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోక్యం చేసుకుంటూ.. ‘బీజేపీకి బీఆర్ఎస్ ప్రతి విషయంలో మద్దతు ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు దళితుడని మద్దతిచ్చా మని అంటున్నారు.. అలాగైతే తెలంగాణ రావడంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి స్పీకర్ మీరాకుమార్ దళితురాలే. తెలంగాణ బిల్లు పాస్ కావడంలో ఆమె కీల కంగా వ్యవహరించారు. అలాంటి మీరాకుమార్కు బీఆర్ ఎస్ ఎందుకు మద్దతివ్వలేదు? బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలనుకుంటే అది మీ ఇష్టం. కానీ పక్షంలో బీజేపీతో బీఆర్ఎస్కు సంబంధం లేదని, తాము అంటకాగడం లేదని బీఆర్ఎస్ చెప్పాలి. రాజకీయ ప్రయోజ నాలు కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ప్రజలకు వెల్లడించాలి. సింగరేణి గురించైనా, దేని గురించైనా మరో రూపంలో మాట్లాడేందుకు మేము సిద్ధం..’ అని భట్టి అన్నారు. కాగా కేటీఆర్ స్పందిస్తూ, ‘మీరాకుమార్ అంటే మాకు గౌరవం ఉంది. ఆమెకు మద్దతిస్తూ తీర్మానం చేస్తే మేం ఆమోదిస్తాం..’ అని చెప్పారు. కాంగ్రెస్లో టీఆర్ఎస్ను విలీనం చేద్దామనుకున్నాందిగ్విజయ్ సింగ్ వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయిందిఅప్పుడు రేవంత్.. సోనియాను, రాహుల్గాంధీని తిట్టే పనిలో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుసాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇచ్చినందుకు 2014లో తాము అప్పటి టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేద్దామని అనుకున్నామని, అయితే దిగ్విజయ్సింగ్ వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్తో విలీనం చర్చలు జరుపుతున్నప్పుడు ఇదే రేవంత్రెడ్డి సోనియాను బలిదేవత అని, రాహుల్గాంధీని ముద్దపప్పు అని తిట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఏం చేసినా మేం బాజాప్తాగానే చేశాం..’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘కేసీఆర్పై రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన పదవుల కోసం పార్టీలు మారారు. మేం పార్టీ కోసం, తెలంగాణ కోసం పదవులు వదులుకున్నాం. మేం పదవులకు ఒకసారి కాదు వందసార్లు రాజీనామా చేశాం..’ అని చెప్పారు. ఎన్నికల సమయంలో ఆరు నెలలు రాజకీయాలు చేద్దామని, మిగతా రోజులు రాష్ట్రాభివృద్ధికి కృషి చేద్దామని సూచించారు. అంతకుముందు బీఆర్ఎస్పై సీఎం చేసిన వ్యాఖ్య లపై స్పందించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కోరగా, స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. -
కేసీఆర్ బాటలోనే రేవంత్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: గతంలో కేసీఆర్ ఎలాగైతే వ్యవహరించారో, అదే తరహాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. నాటి సీఎం కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తుండటం.. తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు. గతంలో తమ ప్రభుత్వ అసమర్థత కారణంగా కేంద్రంపై బీఆర్ఎస్ బురదజల్లిన విధంగానే నేడు కాంగ్రెస్ కూడా డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు.బుధవారం ఢిల్లీలోని అధికారిక నివాసంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానాలు చేయడమంటే బ్లాక్మెయిల్ చేయడమేనని అన్నారు. ఢిల్లీలో దీక్ష చేద్దాం.. ఆమరణ దీక్షలు చేద్దామనడంలోనే వాళ్ల ఆలోచన స్పష్టమైందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సహాయం చేయాలని గతంలో కోరిన బీఆర్ఎస్, కాంగ్రెస్.. నేడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నా యని మండిపడ్డారు. గత 8 నెలల్లో రేవంత్రెడ్డి ఢిల్లీకి ఎక్కువగా వచ్చింది కేవలం తమ పార్టీ నాయకులను, గాంధీ కుటుంబాన్ని కలవడానికేనని ఎద్దేవా చేశారు. రాజీనామా చేయాల్సింది తాను కాదని.. రేవంత్రెడ్డే చేయాలని చెప్పారు. కుర్చీ బచావో అనేది కాంగ్రెస్ నినాదమని.. డబ్బులిచ్చి సీఎం సీట్లు కొనుక్కోవడం ఆ పార్టీ సంస్కృతి అనే విషయం ప్రజలకు తెలుసునని విమర్శించారు. ఎవరి కోసం బహిష్కరిస్తున్నారు?నీతి ఆయోగ్ సమావేశాన్ని ఎవరి ప్రయోజనాల కోసం బహిష్కరిస్తున్నారని కిషన్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బహిష్కరించే సమయం ఎంతో దూరంలో లేదన్నారు. తెలంగాణ పదమే బహిష్కరించారని రేవంత్ అనడం హాస్యాస్పదమని.. తెలంగాణకు ఏం చేయాలో బీజేపీకి బాగా తెలుసునని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, పుదుచ్చేరి పదాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. వాళ్లు దీక్ష చేసినంత మాత్రాన.. తెలంగాణకు ఏం మేలు జరగదన్నారు. అమరావతికి నిధులిస్తే.. మీకు వచ్చిన ఇబ్బందేమిటి? అని రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. కేంద్రం పదేళ్లలో 10 లక్షల కోట్లు తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిందని... అయితే, కేంద్ర ప్రభుత్వ నిధులను దారిమళ్లించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన లేదుసింగరేణి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు లోక్సభ వేదికగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి పునరుద్ఘాటించారు. బుధవారం లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి విషయంలో తెలంగాణ ప్రజానీకానికి, సింగరేణి ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తరపున భరోసా కల్పించారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51%, కేంద్ర ప్రభుత్వం వాటా 49%గా ఉందని... అలాంటి సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేనే లేదన్నారు. సింగరేణి బలోపేతానికి మోదీ ప్రభుత్వం కృషిచేస్తూనే ఉందని చెప్పారు. తెలంగాణ విద్యుత్ ప్రయోజనాలను కాపాడే ఆలోచనతో.. అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటోందన్నారు. -
బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం అవాస్తవం..
కరీంనగర్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, కరీంనగర్కు మొండిచేయి చూపారని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతోపాటు ఒక సెక్షన్ మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు కరీంనగర్లో ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రం ప్రతీ పథకానికి ఖర్చు చేసే నిధుల్లో కరీంనగర్ సహా తెలంగాణకూ వాటా ఉంటుందనే సోయి మర్చిపోయి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేయడం వారి అవకాశవాదానికి పరాకాష్ట అని మండిపడ్డారు.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం గత ఐదేళ్లలో రూ.8 వేల కోట్లకుపైగా నిధులు వెచ్చించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. కరీంనగర్ నుంచి వరంగల్, ఎల్క తుర్తి నుంచి సిద్దిపేట జాతీయ రహదారి నిర్మాణం, కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణం, రైల్వేస్టేషన్ ఆధునీకరణ, స్మార్ట్సిటీ నిధులు కేంద్రానివే అన్నారు. కరీంనగర్– జగిత్యాల రహదారి నిర్మాణం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలో భాగమే అని వివరించారు. కాంగ్రెస్ మాదిరిగా వంద రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలేసే పార్టీ బీజేపీ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్లవి బ్లాక్మెయిల్ పాలిటిక్స్: కిషన్రెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్పై అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానాలు చేయడం బ్లాక్ మెయిల్ చేయడమేనని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో బుధవారం(జులై 25) ఆయన మీడియాతో మాట్లాడారు.‘కేంద్ర బడ్జెట్పై ఢిల్లీలో దీక్ష చేద్దాం.. అమరణ దీక్షలు చేద్దామనడం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆలోచనను స్పష్టం చేస్తోంది. నరేంద్ర మోదీ సర్కారు పదేళ్లుగా తెలంగాణ సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశాం. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో 35శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గతంలో కోరాయి. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు పొందుపరిచాం. ఈ బడ్జెట్ పట్ల అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందని అడుగుతున్నారు’అని కిషన్రెడ్డి విమర్శించారు. -
కేంద్ర బడ్జెట్పై అసెంబ్లీలో తీర్మానం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీలోని సభ్యులకు తీర్మానం పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారని తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదని, గత ప్రబుత్వం కేంద్రాన్ని నిలదీయలేదని మండిపడ్డారు.‘మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఢిల్లీకి వెళ్లాం. ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ప్రస్తావించాం. పెద్దన్న పాత్ర పోషించాలని మోదీని కోరాను. మోదీని పెద్దన్న అని కీర్తిస్తే నాకు వచ్చేది ఏముంది?. రాష్ట్రాలకు పెద్దన్నలగా వ్యవహరించాలని కోరానుఎవరి దగ్గర వంగిపోవడమో, లొంగిపోవడమో చేయలేదు. తెలంగాణపై కేంద్రానిది వివక్ష కాదు కక్ష. కొందరు త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు . ఎమ్మెల్యే కాకముందు మంత్రిని చేసింది కాంగ్రెస్ కాదా?పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూపాయి చెల్లిస్తే.. 45 పైసలు కూడా తిరిగి ఇస్తలేదు. అదే బిహార్ రూపాయి చెల్లిస్తే, కేంద్రం తిరిగి రూ. 7 ఇస్తోంది. గుజరాత్లో మోదీ తన ఎస్టేట్లు అమ్మి మనకు ఏమైనా ఇచ్చారా? తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 3.67 లక్షల కోట్లు వెళ్లాయి. కేంద్రం నుంచి వచ్చింది రూ. 1.68 లక్షల కోట్లు మాత్రమే. అయిదు దక్షిణాది రాష్ట్రాలు రూ. 22.66 లక్షల కోట్ల పన్నులుచ చెల్లించాయి. పదేళ్లలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ. 6 లక్షల కోట్లే. యూపీ రూ. 3.47 లక్షల కోట్లు పన్ను చెల్లిస్తే, అక్కడ కేంద్రం రూ. 6.91 లక్షల కోట్లు ఖర్చు చేసింది. దేశాభివృద్దిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది. ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని బహిష్కరించాం. పార్లమెంట్లో ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలి’ అని పేర్కొన్నారు.శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.సీఎం ఏమన్నారో ఆయన మాటల్లో..ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశ అభివృద్ధికి బాటలు వేశారు.వారి స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారు.దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు.ఆ తరువాత సోనియాగాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారు.తెలంగాణ అభివృద్ధికి కావాల్సినవన్నీ విభజన చట్టంలో పొందుపరిచి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.విభజన హామీలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.రాష్ట్రంలో మేం అధికారంలోకి రాగానే కేంద్ర పెద్దలను కలిసి మా విజ్ఞప్తులు ఇచ్చాము.ఎవరి దయా దాక్షిన్యాలతో నాకు ముఖ్యమంత్రి పదవి రాలేదు..ఎవరినో పెద్దన్న అంటే నాకు ఈ పదవి రాలేదు..రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు సార్లు ప్రధానిని కలిశా.. 18సార్లు కేంద్ర మంత్రులను కలిశాం.తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం.ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే కలిశాం తప్ప.. ఎవరి దగ్గరో వంగిపోవడానికో.. లొంగిపోవడానికో కాదు...తెలంగాణపై కేంద్రానిది వివిక్ష మాత్రమే కాదు.. కక్ష పూరిత వైఖరి...కొంతమంది త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు...ఎమ్మెల్యే కాకుండానే కొందరికి మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అని వాళ్లు గుర్తుంచుకోవాలి.తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బీహార్ కు రూ.7.26 పైసలు.తెలంగాణ నుంచి 3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే... కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1లక్షా 68వేల కోట్లు మాత్రమే..మన హక్కులు మనకు ఇవ్వకపోవడం వల్లే ఈ అంశంపై సభలో చర్చించాల్సిన పరిస్థితి.అయిదు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నది ఎంత?దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నది రూ.22లక్షల 26 వేల కోట్లుకేంద్రం ఐదు రాష్ట్రాలకు తిరిగి ఇచ్చేది రూ.6లక్షల 42వేల కోట్లు మాత్రమే.యూపీ పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చేది రూ.3 లక్షల 41వేల కోట్లు మాత్రమే..కానీ యూపీకి కేంద్రం తిరిగి ఇచ్చేది రూ.6 లక్షల 91వేల కోట్లు.ఐదు రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే యూపీకి చెల్లించేది ఎక్కువ.. ఇదీ కేంద్రం వివక్ష..దేశం 5ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధానికి స్పష్టంగా చెప్పాం.మూసీ అభివృద్ధికి, మెట్రో విస్తరణకు, ఫార్మా అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరాం.ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు.సభలో పార్టీలు, వ్యక్తుల ప్రయోజనాల కోసమే కొంతమంది మాట్లాడటం శోచనీయం.అందరం ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవటం పెద్ద కష్టం కాదు..రాష్ట్రాలకు న్యాయంగా దకాల్సిన వాటా దక్కడంలేదు.కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆఖరు నిముషం వరకు ప్రయత్నం చేశాం.తెలంగాణ హక్కులకు భంగం కలిగించినందుకు, నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. -
TG: రేపు అసెంబ్లీకి కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్షనేత హోదాలో గురువారం(జులై 25) తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణభవన్లో నిర్వహించిన బీఆర్ఎస్శాసనసభాపక్ష భేటీకి కేసీఆర్ అధ్యక్షత వహించారు. ఈ భేటీలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతురుణమాఫీ సహా పలు అంశాలపై పోరాడాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.కాగా, గతేడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలి అసెంబ్లీ సెషన్కు కేసీఆర్ హాజరవలేదు. -
TS Assembly: కేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సీనియర్ సభ్యుడని, ఆయనకు సభా వ్యవహారాలు తెలుసని అన్నారు. సభా నాయకుడికి అనుభవం లేదని కేటీఆర్ మాట్లాడటం సరికాదని అన్నారు బీజేపీకి కోపం వస్తుందని కేటీఆర్ అసలు విషయాన్ని వదిలేసి అన్నీ మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే బీఆర్ఎస్కు రాజకీయ ప్రమోజనాలు ముఖ్యమని మండిపడ్డారు.ఏడు మండలాల గురించి మీరు ఏం చేశారని, ఏడు మండలాల విషయం లేకుండానే ఏపీ పునర్విభజన బిల్లు పాస్ అయ్యిందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఢిల్లీలో యుద్ధం చేస్తామన్నారు చేశారా? కనీసం మాట అయినా అడిగారా? అని ప్రశ్నించారు. రూ. 8 వేల కోట్లుఖర్చు చేసినా ఖమ్మం జిల్లాకు నీరు ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో మూసీ, మెట్రోకు నిధులు ఇవ్వలేదని, తాము అడుగుతన్నవి హక్కుగా రావాల్సిందేనని చెప్పారు.మేం బీజేపీతో కలవడమేంటి?రాజకీయాలు పక్కనపెట్టి సర్కార్తో కలిసి రావాలి. ప్రధాని మోదీని మన వాటా అడుగుదాం. ఎందుకు కేంద్రం నుంచి నిధులు రావో చుద్దాం. తెలంగాణకు అన్యాయం జరగడంపై తీర్మానం పెట్టాలి. ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్న అన్ని పార్టీల ఆలోచన పరిగణలోకి తీసుకొని రెవల్యూషన్ తీసుకురావాలి. అన్ని పార్టీలతో కలిసి కేంద్రం వద్దకు వెళ్దాం. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నిద్దాం. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని పూడ్చడానికి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టింది.చర్చకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరాం.బీజేపీ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుల సహాయం సహకారం మాకు అందరం లేదు అనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్ఎస్ ఈ నష్టం గురించి గట్టిగా వాదిస్తుంది అనుకున్నాం. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలు తప్ప రాబడిల గురించి మాట్లాడటం లేదు. బీజేపీచ బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి.బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం నుంచి మొండిచేయి జరిగింది. అప్పుడు సభలో అంశం పెట్టి వదిలేశారు.. మేము ఇప్పుడు అట్లా కాకుండా చర్చ చేస్తున్నాం. విభజన చట్టం ద్వారా రావలసిన అంశాలు నిధులు ఈ బడ్జెట్ లో వస్తాయి అని ఆశించాం. జాతీయ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఐటిఐ ఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, అడిగాం ఇవ్వలేదు. ఆనాడు సోనియాగాంధీ తెలంగాణకు అన్యాయం జరగద్దు అని విభజన అంశాల్లో చాలా విషయాలు పొందుపరిచారు. ఆనాడు కాంగ్రెస్ పొందుపరిచిన అంశాలను కూడా ఈరోజు బిజెపి ఇవ్వడం లేదు. మూసి అభివృద్ధి, మెట్రో రైలు అభివృద్ధి, డిఫెన్స్, ఫార్మా హబ్ అడిగాం ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలు కేంద్రానికి పనులు పడుతున్నారు. హక్కు ద్వారా రావాల్సిన అంశాలు మాత్రమే అడిగాం. కేంద్ర ప్రభుత్వ ఆలోచనలపై రాష్ట్రాలు పునరాలోచన చేస్తున్నాయి. రాష్ట్రాలు దేశం గురించి ఆలోచిస్తున్నప్పటికీ... దేశం రాష్ట్రాల గురించి ఆలోచన చేయడం లేదు. దేశాన్ని పాలించే బిజెపి రాజకీయ అవసరాల కోసం పనిచేస్తుంది. కేంద్రం నుంచి ఏమైనా నిధులు వస్తాయేమో మన బడ్జెట్ మరింత పెరుగుతుంది అనుకున్నాం. గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిందే ఇప్పుడు కేంద్రం సహాయం చేస్తుంది. ఇప్పుడు కేంద్రం నుంచి ఎలాంటి సహాయం రాలేదు. సింగరేణి విషయంలో కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి వేలం పాట వేసేందుకు కారణం గత ప్రభుత్వమే. బీజేపీ ప్రభుత్వానికి ఐదేళ్లపాటు రాష్ట్ర బీఆర్ఎస్ మద్దతు పలికింది.ఏడు మండలాలు ఏపీకి పోతుంటే గత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడు మండలాలు ఏపీకి ధారా దత్తం చేశారు. -
బీఆర్ఎస్ బృందం ‘కాళేశ్వరం’ సందర్శన రేపు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం(జులై 25) బయలుదేరనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బయలుదేరనుంది. అసెంబ్లీ నుంచే నేరుగా ప్రత్యేక బస్సులో వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా మొదట ఎల్ఎండీ రిజర్వాయర్ సందర్శించనున్న బీఆర్ఎస్ బృందం గురువారం రాత్రి రామగుండంలో బస చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్ సందర్శిస్తారు. 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పరిస్థితిని పరిశీలిస్తారు. అనతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హైదరాబాద్ తిరిగిరానుంది. -
కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయలేదు: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: కేంద్రం సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు పక్కదారి పట్టిస్తుందన్నారు బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ పరిశ్రమలు ఏపీకి తరలి వెళ్ళేవని అన్నారు. కేంద్రం చేసిన పనికి తెలంగాణ కేంద్రానికి పాలాభిషేకం చేయాలని చెప్పారు.విభజన చట్టం హామీల్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. అవకాశం ఉంటేనే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలన చేస్తానని విభజన చట్టంలో ఉందన్నారు. ఫీజిబిలిటీ లేదని అధికారులు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో చెప్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 28 వేల కోట్ల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.‘మొదటినుంచి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మెయిన్ విలన్. ఆనాడు తెలంగాణను ఆంధ్రావాలతో విలీనం చేసింది నెహ్రూ. మళ్లీ కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర వాళ్ళతో తెలంగాణను విడదీసింది. విభజన చట్టంలో సరైన అంశాలను చేర్చలేదు అందుకే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఉద్యమంలో వేలమంది అమరులు అయ్యారు. ఉద్యమాన్ని తట్టుకోలేక తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కేంద్రం అన్యాయం చేసింది అని కాంగ్రెస్ భావిస్తే 8 మంది ఎంపీలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి.బీఆర్ఎస్ కాళేశ్వరం లక్ష కోట్లతో కట్టి కమిషన్లు తీసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ మూసి నది లక్ష కోట్లతో అభివృద్ధి చేస్తానంటుంది. ఎవరికోసం ఎవరికీ కమిషన్లు ఇవ్వడానికి తీసుకోవడానికి లక్ష కోట్లతో మూసీ నది అభివృద్ధి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలో బీజేపీని భాగస్వామ్యం రమ్మంటున్నారు’ అని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామా సవాళ్లకు కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ముందు బీజేపీకి చెందిన 8 మందినెంపీలు రాజీనామా చేసి తమ దగ్గరికి రావాలని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడాలని తెలిపారు.బీజేపీ వారు తెలంగాణ కోసం ఫైట్ చేయాల్సింది పోయి కాంగ్రెస్ ఎంపీలను రాజీనామా చేయమనడం విడ్డూరంగా ఉందన్నారు -
రేవంత్ Vs కేటీఆర్.. మాటల దాడితో హీటెక్కిన సభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యద్ధం నడిచింది. మేనేమెంట్ కోటా మంత్రి అంటూ కేటీఆర్ కామెంట్స్ చేయగా.. తండ్రి పేరుతో తాను రాజకీయ పదవులు పొందలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్.కాగా, సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. బడ్జెట్లో భాగంగా కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై ప్రభుత్వం తీర్మానం అంటుంది కానీ, మాకు తీర్మాన కాపీ రాలేదు. బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై మాట్లాడం ఇష్టం లేదనుకుంటాను అంటూ వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సభకు ప్రతిపక్ష నాయకుడు రాలేదు. సభకి వచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్కు భయమేస్తోంది. సభ నుంచి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంత హడావిడి చేసినా సభ నుంచి బయటకు పంపొద్దు. ఢిల్లీలో చీకటి ఒప్పందాలు బయటపడతాయిన బీఆర్ఎస్ భయపడుతోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తండ్రి పేరుతో తాను రాజకీయం చేయడం లేదంటూ కౌంటరిచ్చారు. నేనేమీ మేనేజ్మెంట్ కోటాలో మంత్రి, ముఖ్యమంత్రి కాలేదని కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. తానేమీ పేమెంట్ కోటాలో పదవులు పొందలేదన్నారు. తండ్రి పేరు అంటే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీని ముఖ్యమంత్రి అంటున్నారా? అని ప్రశ్నించారు. దీంతో, వీరి మధ్య మాటల యుద్ధం నడిచింది. సభలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. -
హరీష్ Vs సీఎం, మంత్రులు.. సభలో వాడీవేడీ చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ నడుస్తోంది. ఆర్టీసీ అంశంపై హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కౌంటరిచ్చారు. దీంతో, మూడు సభ్యులు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.హరీష్రావు కామెంట్స్..ప్రభుత్వం భాధ్యతారహితంగా సమాధానం చెబుతోంది.ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తుంది.ఆర్టీసీ పీఆర్సీని ప్రభుత్వం రాగానే ఇస్తాం అన్నారు.ఆర్టీసీ ఉధ్యోగులను ఎప్పటిలోగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో చెప్పాలి.300 కోట్లు పీఆర్సీ బకాయి చెక్కులు ఫిబ్రవరిలో ఇచ్చారు.ఇంతవరకు అది బస్భవన్కు చేరలేదు.ఆర్టీసి ప్రభుత్వంలో విలీనంపై ఎందుకు జాప్యం జరుగుతుంది..మంత్రి పొన్నం ప్రభాకర్ జాప్యం జరగటం లేదని బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు.కొత్త యూనియన్లు ఎప్పటిలోగా పునరుద్దరిస్తారు.ఆర్టీసీలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వటం లేదుగతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాము.కొత్త బస్సుల ప్రారంభం నాడు 300కోట్లు చెక్ చూపించారుమహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇచ్చింది ఎంత?సీసీఎస్ డబ్బులు మళ్ళించి కార్మికులకు జీతాలు ఇచ్చారా లేదా?హరీష్కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..హరీష్ రావుకు క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడిగాలని తెలియదా?ఈ ఉపన్యాసం ఏంటి?.కాంగ్రెస్ మేనిఫెస్టోను హరీష్ రావు బట్టి పట్టారు.. చాలా సంతోషం.సభ్యులు ప్రశ్నలు మాత్రమే అడగండి.. ఉపన్యాసాలు వద్దు.ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన చేసే హక్కు సభ్యులకు సభలో లేదు.బీఆర్ఎస్ నాయకులు సభ రూల్స్ తెలుసుకోవాలి.హరీష్ రావు రూల్స్ గురించి మాట్లాడుతున్నారు అందుకే చెప్తున్నా.బీఆర్ఎస్కు ఏదైనా అభ్యంతరం ఉంటే వేరే ఫార్మాట్ ద్వారా రావాలి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై స్పందించిన హరీష్..శ్రీధర్ బాబు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి.ప్రశ్నోత్తరాల సమయంలో సరైన సమాధానాలు రాక గతంలో కాంగ్రెస్ చాలాసార్లు వాకౌట్ చేసింది.ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..ఆర్టీసీ కార్మికుల గురించి హరీష్ రావు మాటలు హస్యాస్పదం.కార్మిక సంఘాలను రద్దు చేసి ఆర్టీసీని చంపేశారు.ఆర్టీసీ కార్మికులు చనిపోతే పట్టించుకోలేదు.2013 నుంచి ఆర్టీసీకి బకాయిలు ఉన్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని విడుదల చేసాము.ఆర్టీసీ ఏడువేల కోట్ల అప్పులతో బీఆర్ఎస్ మాకు అప్పగించింది.మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెల రెండు వందల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుంది.మూడు వేల ఉద్యోగాలు నియామకం చేశాము.ఓవర్ లోడ్ అవుతుంది.కానీ కార్మికులకు డబుల్ పేమెంట్ జరుగుతుంది.గత మూడు నెలల నుంచి ఆర్టీసీ లాభాల్లో నడుస్తోంది.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను ఎండీగా పెట్టీ ఆర్టీసీని బీఆర్ఎస్ నడిపించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆర్టీసీ ఆస్తులను అప్పనంగా అప్పగించారుఆర్టీసీకి అన్యాయం జరగకుండా భవిషత్లో అన్ని చర్యలు తీసుకుంటాంబీఆర్ఎస్ పార్టీకి ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హత లేదురిటైర్డ్ ఈడీనీ ఆర్టీసీకి ఎందుకు ఎండీగా పెట్టిందో చెప్పాలి? హరీష్కు సీఎం రేవంత్ కౌంటర్హరీష్ రావు సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ మంత్రి.హరీష్ రావుకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది.స్పీకర్ కుర్చీపై ఆరోపణలు చేయడం ఏ మంత్రికి తగదు.ఆర్టీసీ అంశం ప్రాధాన్యతతో కూడుకున్న సమస్య.ఆర్టీసీ కార్మికుల దీక్షలు చేసి 50 మంది చనిపోయినప్పుడు.. ఆనాడు ప్రభుత్వం వివక్ష చూపింది.సీపీఐ కార్మికుల కోసం కొట్లాడింది వాళ్ల కోసం మాట్లాడడానికి సీపీఐకి అవకాశం ఇచ్చారు.హరీష్ రావు మాట్లాడుతుంది చట్టాలకు విరుద్ధం.ఎవరు ప్రశ్న అడిగితే వాళ్లకే అవకాశం ఇవ్వాలి అన్నది రూల్లో లేదుప్రశ్నోత్తరాలు సభకు వస్తే అది సభ సొంతమవుతుంది.సభ సభ్యులందరి ఆస్తి.ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్నది చైర్ విచక్షణ మీద ఉంటుంది.రూల్ బుక్కు గురించి బీఆర్ఎస్ అసలు విషయం తెలుసుకోవాలి.గతంలో ఎమ్మెల్యే తన సీటును వదిలి పక్కకు వస్తే సభ నుంచి సస్పెండ్ చేశారు.గతంలో బీఆర్ఎస్ ఆనవాయితీలను ఇప్పుడు కూడా కొనసాగించాలని వాళ్లు కోరుకుంటున్నారు.కుటుంబం వల్ల కార్మిక సంఘాలను గత ప్రభుత్వం రద్దు చేశారు.కార్మికులను కార్మిక సంఘాలను రద్దుచేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై కొత్తగా బీఆర్ఎస్ బురద చల్లుతుంది.హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు.సభలో కొత్త సభ్యులు ఉన్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. -
అయినా బీఆర్ఎస్ మారలేదు: సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదు. అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తాం. విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం. .. ఏడు లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేదు. ప్రజలు ఆగ్రహించినా బీఆర్ఎస్ మాత్రం మారలేదు. తప్పులు చేశారు. ప్రజలు శిక్షించారు. అయినా మారలేదు. బీఆర్ఎస్ నేతలకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నాం’’ అని రేవంత్ తెలిపారు. కార్మికులు పక్షాన కొట్లాడే కమ్యూనిస్టులకు మైక్ ఇస్తే తప్పేంటి?. ఎమ్మెల్యే సాంబశివరావుకు మైక్ ఇవ్వటం తప్పా?. స్పీకర్పై ఆరోపణలు చేయటం తగదని సీఎం రేవంత్ అన్నారు. -
కేటీఆర్కు సీఎం రేవంత్ బర్త్డే విషెస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు కేటీఆర్కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారాయన.సిరిసిల్లా శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని… pic.twitter.com/YtJYFVTgvc— Telangana CMO (@TelanganaCMO) July 24, 2024 -
TS Assembly: కేసీఆర్ను ఢిల్లీకి రమ్మనండి, కలిసి దీక్ష చేస్తాం: సీఎం రేవంత్
Updates..👉తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. గురువారం మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.👉 ‘కేంద్ర బడ్జెట్’పై తీర్మానానికి బుధవారం తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం’ అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ముందు పెట్టారు. కేంద్ర బడ్జెట్పై అసెంబ్లీలో తీర్మానంకేంద్ర బడ్జెట్పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.అసెంబ్లీలోని సభ్యులకు తీర్మానం పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారు.తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారు. గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదు.గత ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేదు.కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది వాస్తవం: హరీష్ రావుమీరు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామంటే రావడానికి మేము సిద్ధంఢిల్లీలో దీక్ష చేద్దాం రమ్మంటే సిద్ధం.నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలని సీఎం అన్నారురుణమాఫీ గురించి నన్ను దీక్ష చేయాలని సీఎం అన్నారుఅన్ని మేమే చేస్తే.. మీరేం చేస్తారు?ఉద్యమ సమయంలో రాజీనామా చేకుండా పారిపోయింది మీరు.పదవులు గడ్డిపోసలెక్క విసిరేసింది మేముఢిల్లీలో మంత్రులు ఆమరణ దీక్ష చేయాలన్ని కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్కేసీఆర్ను ఢిల్లీకి రమ్మని చెప్పండి.నేను కూడా దీక్షలో కూర్చుంటా.ఇద్దరం సచ్చుడో, నిధులు తెచ్చుడో చుద్దాం.చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చామని మేము చెప్పలేదు.మేము ఎవరి శవాలపై రాజకీయాలు చేయలేదుకేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్సీఎం కూడా సీనియర్ సభ్యులుఆయనకు సభా వ్యవహారాలు తెలుసుసభా నాయకుడికి అనుభవం లేదని కేటీఆర్ మాట్లాడటం సరికాదుబీజేపీకి కోపం వస్తుందని కేటీఆర్ విషయాన్ని వదిలేసి అన్నీ మాట్లాడారు.రాష్ట్ర ప్రయోజనాల కంటే బీఆర్ఎస్కు రాజకీయ ప్రమోజనాలు ముఖ్యంఅమృత్ నిధుల అంశంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.అమృత స్కీం కింద వచ్చిన నిధుల గురించి మాట్లాడి అసలు విషయం డైవర్ట్ చేస్తున్నారు.రాజకీయ విషయాలు కాకుండా రాష్ట్రానికి పనికొచ్చే విషయాలు మాట్లాడాలిఅమృత్ స్కీం కింద వచ్చిన నిధులకు టెండర్ల ప్రక్రియ సాగుతోంది - విప్ ఆది శ్రీనివాస్సగం తప్పుదారి పట్టించేలాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.బీజేపీ ప్రభుత్వం అయోధ్యలో ఓడిపోయింది. ఆదిశ్రీనివాస్ విప్ఓటమి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదు - ఏలేటి మహేశ్వర్ రెడ్డితెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అక్కడ బిజెపి గెలిచింది .బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్కేంద్రం అమృత్ పథకం కింద 3500 కోట్లు ఇచ్చింది.ఆ 3,500 కోట్లను ఎవరికి తెలియకుండా కాంగ్రెస్ మంత్రులు పంచుకున్నారు.మా నియోజకవర్గానికి మూడు కోట్లు అడిగితే మంత్రులు ఇవ్వడం లేదు.మంత్రుల వాళ్ల నియోజకవర్గాలు అభివృద్ధి జరిగితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్లు కాదు.అమృత్ నిధులు టెండర్లు లేకుండా మంత్రులు లెక్కలేసుకొని పంచుకున్నారుభట్టి విక్రమార్క కామెంట్స్..కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే మంచిది.బీజేపీని అంటే బీఆర్ఎస్ ఎందుకు బయపడుతోంది. కేటీఆర్ కామెంట్స్..మేము ఎవరితోనూ చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదు.ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నిస్తూనే ఉంటాం.కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకున్నా గత పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..విభజన చట్టాన్ని కేంద్రం అమలు చేయాలి.ఇప్పటికైనా సమయం మించిపోలేదు.బడ్జెట్ ఆమోదం పొందడానికి ముందే సవరణలు చేయాలని కోరుతున్నాంవిభజన హామీల అంశాల్లో ఒక్కటి లేదు.కేంద్రంపై అందరం కలిసి ఫైట్ చేద్దాం.బీజేపీ తెలంగాణ ప్రజలపై వివక్ష చూపిందివిభజన చట్టం ప్రకారం తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు ఇవ్వాలితెలంగాణకు ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చారు.నిధులు రాబట్టడంలో బీజేపీ తెలంగాణ ఎంపీలు విఫలం అయ్యారు.దేశంలో తెలంగాణ భాగం కాదా?కేంద్రం తెలంగాణను ఎందుకు మర్చిపోయింది?కేంద్రం, బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యద్ధంకేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై ప్రభుత్వం తీర్మానం అంటుంది.కానీ, మాకు తీర్మాన కాపీ రాలేదు. రేవంత్ రెడ్డికి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై మాట్లాడం ఇష్టం లేదనుకుంటానురేవంత్ కామెంట్స్..కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్.రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సభకు ప్రతిపక్ష నాయకుడు రాలేదు.సభకి వచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్కు భయమేస్తోంది.సభ నుంచి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు.బీఆర్ఎస్ ఎంత హడావిడి చేసినా సభ నుంచి బయటకు పంపొద్దు.ఢిల్లీలో చీకటి ఒప్పందాలు బయటపడతాయిన బీఆర్ఎస్ భయపడుతోందితండ్రి పేరుతో తాను రాజకీయం చేయడం లేదు.నేనేమీ మేనేజ్మెంట్ కోటాలో మంత్రి, ముఖ్యమంత్రి కాలేదు.కేటీఆర్ కౌంటర్..పేమెంట్ కోటాలో పదవులు పొందలేదు.తండ్రి పేరు అంటే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీని ముఖ్యమంత్రి అంటున్నారా? అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..నిధుల కేటాయింపులో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందిటూరిజం డెవలప్మెంట్ అంశంలో తెలంగాణకు నిధులు నిల్.నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని ప్రత్యేకంగా కోరాం కేంద్ర బడ్జెట్పై మంత్రి సీతక్క ట్వీట్ఇది ఎన్డీఏ బడ్జెట్, ఇండియా బడ్జెట్ కాదుతనను భయపెట్టే బాబు, నితీష్ మీద మోదీ ప్రేమ కురిపించారుఏపీకి 15వేల కోట్లు, బీహార్కు 26 వేల కోట్లుఇది యూనియన్ బడ్జెట్ కాదు, కుర్చీ కాపాడుకునే బడ్జెట్ It’s NDA Budget, not INDIA Budget.AP Budget 15,000 cr Bihar Budget 26,000 cr Modi ji showed love on those who he fears ( Babu & Nithish )It’s not union Budget it’s Kursi Bachao Budget @RahulGandhi @revanth_anumula @kharge #KursiBachaoBudget #Budget2024— Danasari Seethakka (@seethakkaMLA) July 24, 2024 👉రేవంత్ తీర్మానం.. తెలంగాణకు అన్యాయం జరిగింది అని సభలో చర్చ జరపాలని తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డిఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కామెంట్స్..సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు పోతుందిరుణమాఫీ చేయడంతో రైతుల కుటుంబాలు పండుగ చేసుకుంటున్నారురాహుల్ గాంధీ వరంగల్లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశారుత్యాగాల కుటుంబం గాంధీ కుటుంబంరుణమాఫీ చేసినందుకు తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారురుణమాఫీ చేసినందుకు యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ప్రసాదం లడ్డులు అసెంబ్లీలో పంపిణీ చేసాం. అసెంబ్లీ లాబీలో హరీష్రావు చిట్చాట్..కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేదు.వీహెచ్ వంటీ సీనియర్ నేతకు ఏ పదవి దక్కలేదు.నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చిన కేశవరావుకు మాత్రం పదవి ఇచ్చారు.మరో సీనియర్ నేత కోదండరెడ్డిని కూడా పక్కకు పెట్టారు.అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి చిట్చాట్..బీఆర్ఎస్కు సభలో మాట్లాడేందుకు వాయిస్ లేదువాయిస్ లేదు కాబట్టే ఆర్టీసీ అంశాన్ని మాట్లాడింది.బీఆర్ఎస్కు అసెంబ్లీలో హరీష్ రావు తప్ప వేరే లీడర్లు లేరు.బీఆర్ఎస్ పార్టీ పోయి తీహార్ జైల్లో పడింది.ఇక, వాళ్ల పార్టీలో ఎవ్వరూ ఉండరు.కేంద్రం తెలంగాణకు మొండి చెయ్యి చూపించింది.తెలంగాణ పేరు ఎత్తకుండా సెంట్రల్ బడ్జెట్ పెట్టడం వివక్షే.తెలంగాణలో బీజేపీకి మంచి గుణపాఠం చెప్తం.సెంట్రల్ బడ్జెట్పై రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడలేక వాయిస్ పోయింది. అసెంబ్లీ లాబీలో మంత్రి సీతక్క చిట్చాట్..10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజా స్వామ్యం కనిపిస్తోంది.బీఆర్ఎస్ హయంలో అసెంబ్లీలో ప్రొటెస్ట్ చేస్తే సస్పెండ్ చేసే వారుతెలంగాణ ఏర్పడిందే నియామకాల కోసం అలాంటి నియామకాలు మీద అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ స్పందించలేదు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలతో పాటు, జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాంఅధికారం పోయాక బీఆర్ఎస్కు నిరుద్యోగులు గుర్తుకు వచ్చి ప్రొటెస్ట్ చేయటం హాస్యాస్పదంగా ఉంది.పదేళ్లుగా ఉద్యోగాల భర్తీని పట్టించుకోని బీఆర్ఎస్, జాబ్ క్యాలెండర్ కోసం డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందిఅసెంబ్లీ పోడియంలోకి వెల్లినా, ప్లకార్డులు ప్రదర్శించినా గత ప్రభుత్వం సస్పెండ్ చేసేదికానీ మా ప్రభుత్వం అలా చేయడంలేదుగతంలో నిరసనలను అణగదొక్కిన బీఆర్ఎస్, ఇప్పుడు నిరసనకు దిగడం ఆశ్చర్యంబీఆర్ఎస్ నిరసనలతో రాష్ట్రంలో ఎంత ప్రజాస్వామ్యం ఉందో అర్థం అవుతుందిఉద్యోగాల భర్తీలో ఉన్న చిక్కు ముడులను విప్పి నియామకాలు చేపట్టాముత్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం గ్రూప్ పరీక్షలపై సభలో హరీష్ రావు కామెంట్స్..జీవో-55 ప్రకారం 1:50 క్యాన్సిల్ చేసిందికాస్ట్ వారీగా మేము 1:50 మేము తీసుకున్నాం.కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ దాన్ని తొలగించి జీవో-29 తెచ్చింది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారుసీఎం రేవంత్ 1:100 సాధ్యం కాదు అంటున్నారు.కానీ 2006లో వైఎస్సార్ ఈ రేషియో ప్రకారం గ్రూప్-1 చేశారు.వైఎస్ జగన్ గ్రూప్-2 కూడా చేశారువాళ్లకు లేని ఇబ్బంది. మీకు ఎందుకు వస్తుందిగ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల సంఖ్య పెంచండి అంటున్నాముఇబ్బంది వస్తుంది అని సీఎం రేవంత్ అంటున్నారు.కానీ మేము యాడ్ చేశాం.. మాకు రాని లీగల్ సమస్య మీకు ఎందుకు వస్తుంది2008-09లో కాంగ్రెస్ సర్కార్ పోస్టుల సంఖ్య పెంచిందికానీ రేవంత్ సర్కార్ మాత్రం పోస్టుల సంఖ్యను పెంచడం లేదుపలు సమస్యలపై హరీష్ కామెంట్స్..ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందిరాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తున్నారుఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంఆర్టీసీ యూనియన్ ను పునరుద్ధరణ చేయడంఇలాంటి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టలేదునేను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడుగా రాజీనామా చేశానుమేము ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేక వాయిదా వేసి పారిపోయిందిమేము అసెంబ్లీలో నిరుద్యోగులపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారుఊసరవెల్లి సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి భయపడుతుందికాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయిందిఅధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందిగ్రూప్-1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారురాష్ట్రంలో నిరుద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారునిరుద్యోగులపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వడం లేదురాష్ట్రంలో 21 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయికాంగ్రెస్ వస్తే 25వేల పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు 👉 బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కామెంట్స్..మా నియోజకవర్గాలకు చెందిన ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాట్లాడాలంటే స్పీకర్ అవకాశం ఇవ్వలేదుబీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నకు సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావుకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారుసభలో సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలిప్రశ్న అందరి ప్రాపర్టీ అని సీఎం అంటున్నారు కాబట్టి అందరికీ అవకాశం కల్పించాలని కోరుతున్నాం 👉అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యులకు టీ బ్రేక్..బీఆర్ఎస్, బీజేపీ వాయిదా తీర్మానం తిరస్కరణ..తెలంగాణ రాష్ట్రంలో పంటల నష్టం గురించి బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్.నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇతర న్యాయపరమైన డిమాండ్లపై బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లు చర్చించాలని కోరుతూ కేటీఆర్ వేసిన ప్రతిపాదనను తిరస్కరించిన స్పీకర్ pic.twitter.com/ViedsXuvAB— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024వీడియో క్రెడిట్.. Telugu Scribe సీఎం రేవంత్ కామెంట్స్.. హరీష్ రావు సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ మంత్రి.హరీష్ రావుకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది.స్పీకర్ కుర్చీపై ఆరోపణలు చేయడం ఏ మంత్రికి తగదు.ఆర్టీసీ అంశం ప్రాధాన్యతతో కూడుకున్న సమస్య.ఆర్టీసీ కార్మికుల దీక్షలు చేసి 50 మంది చనిపోయినప్పుడు.. ఆనాడు ప్రభుత్వం వివక్ష చూపింది.సీపీఐ కార్మికుల కోసం కొట్లాడింది వాళ్ల కోసం మాట్లాడడానికి సీపీఐకి అవకాశం ఇచ్చారు.హరీష్ రావు మాట్లాడుతుంది చట్టాలకు విరుద్ధం.ఎవరు ప్రశ్న అడిగితే వాళ్లకే అవకాశం ఇవ్వాలి అన్నది రూల్లో లేదుప్రశ్నోత్తరాలు సభకు వస్తే అది సభ సొంతమవుతుంది.సభ సభ్యులందరి ఆస్తి.ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్నది చైర్ విచక్షణ మీద ఉంటుంది.రూల్ బుక్కు గురించి బీఆర్ఎస్ అసలు విషయం తెలుసుకోవాలి.గతంలో ఎమ్మెల్యే తన సీటును వదిలి పక్కకు వస్తే సభ నుంచి సస్పెండ్ చేశారు.గతంలో బీఆర్ఎస్ ఆనవాయితీలను ఇప్పుడు కూడా కొనసాగించాలని వాళ్లు కోరుకుంటున్నారు.కుటుంబం వల్ల కార్మిక సంఘాలను గత ప్రభుత్వం రద్దు చేశారు.కార్మికులను కార్మిక సంఘాలను రద్దుచేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై కొత్తగా బీఆర్ఎస్ బురద చల్లుతుంది.హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు.సభలో కొత్త సభ్యులు ఉన్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 👉రేపు కేబినెట్ భేటీ..రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం.రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం తెలపనున్న కేబినెట్.మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు. 👉మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..ఆర్టీసీ కార్మికుల గురించి హరీష్ రావు దయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారు.కార్మిక సంఘాలను రద్దు చేసి ఆర్టీసీని చంపేశారు.ఆర్టీసీ కార్మికులు చనిపోతే పట్టించుకోలేదు.2013 నుంచి ఆర్టీసీకి బకాయిలు ఉన్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని విడుదల చేసాము.ఆర్టీసీ ఏడువేల కోట్ల అప్పులతో బీఆర్ఎస్ మాకు అప్పగించింది.మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెల రెండు వందల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుంది.మూడు వేల ఉద్యోగాలు నియామకం చేశాము. ఆర్టీసీకి ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల కోట్లు చెల్లించాం - మంత్రి పొన్నం ప్రభాకర్ pic.twitter.com/3do5ayZUDF— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024వీడియో క్రెడిట్: Telugu Scribeఓవర్ లోడ్ అవుతుంది.కానీ కార్మికులకు డబుల్ పేమెంట్ జరుగుతుంది.గత మూడు నెలల నుంచి ఆర్టీసీ లాభాల్లో నడుస్తోంది.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను ఎండీగా పెట్టీ ఆర్టీసీని బీఆర్ఎస్ నడిపించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆర్టీసీ ఆస్తులను అప్పనంగా అప్పగించారుఆర్టీసీకి అన్యాయం జరగకుండా భవిషత్లో అన్ని చర్యలు తీసుకుంటాంబీఆర్ఎస్ పార్టీకి ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హత లేదురిటైర్డ్ ఈడీనీ ఆర్టీసీకి ఎందుకు ఎండీగా పెట్టిందో చెప్పాలి? 👉హరీష్రావు Vs మంత్రి శ్రీధర్ బాబు.. హరీష్రావు కామెంట్స్..ప్రభుత్వం భాధ్యతారహితంగా సమాధానం చెబుతోంది.ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తుంది.ఆర్టీసీ పీఆర్సీని ప్రభుత్వం రాగానే ఇస్తాం అన్నారు.ఆర్టీసీ ఉధ్యోగులను ఎప్పటిలోగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో చెప్పాలి.300 కోట్లు పీఆర్సీ బకాయి చెక్కులు ఫిబ్రవరిలో ఇచ్చారు.ఇంతవరకు అది బస్భవన్కు చేరలేదు.ఆర్టీసి ప్రభుత్వంలో విలీనంపై ఎందుకు జాప్యం జరుగుతుంది..మంత్రి పొన్నం ప్రభాకర్ జాప్యం జరగటం లేదని బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు.కొత్త యూనియన్లు ఎప్పటిలోగా పునరుద్దరిస్తారు.ఆర్టీసీలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వటం లేదుగతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాము.కొత్త బస్సుల ప్రారంభం నాడు 300కోట్లు చెక్ చూపించారుమహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇచ్చింది ఎంత?సీసీఎస్ డబ్బులు మళ్ళించి కార్మికులకు జీతాలు ఇచ్చారా లేదా? 👉హరీష్కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..హరీష్ రావుకు క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడిగాలని తెలియదా?ఈ ఉపన్యాసం ఏంటి?.కాంగ్రెస్ మేనిఫెస్టోను హరీష్ రావు బట్టి పట్టారు.. చాలా సంతోషం.సభ్యులు ప్రశ్నలు మాత్రమే అడగండి.. ఉపన్యాసాలు వద్దు. 👉సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..రోడ్డు, కరెంటు లేకుండా తండాను గ్రామ పంచాయతీలు చేశారు.ప్రతీ తండా నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు వేస్తాం.ప్రతీ తండాకు తాగు నీటితో పాటు కరెంటు, రోడ్డు వేస్తాం.ఏడు లక్షల ఇళ్ళకు గత ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదు.బీఆర్ఎస్ నేతలు ఎక్కడికి వెళ్తారో చెప్పండి తీసుకెళ్తాం.ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదు.తండాల అభివృద్ధి జరిగినప్పుడే సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంది.సరైన రోడ్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. 👉ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య..తండా గ్రామపంచాయతీలు చెట్ల కింద ఉండి పాలన సాగుతుంది.సర్పంచ్ల నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళించింది.సర్పంచ్ల ఆత్మహత్యకు బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం.ఎమ్మెల్యే వంశీకృష్ణ కామెంట్స్..నెంబర్ కోసమే అన్ని తండాలను గ్రామపంచాయతీలు చేశారు.ఒకే తండాను రెండుగా విడగొట్టి, రెండు గ్రామపంచాయతీలు చేశారు.తండా గ్రామపంచాయతీల అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్..62 కోట్ల మంది మహిళలు ఫ్రీ ఆర్టీసీ బస్సును ఉపయోగించుకున్నారు..ఫ్రీ బస్సు వల్ల దేవాలయాల వద్ద రద్దీ పెరిగింది.కొత్త బస్సులు కొనుగోలు చేసి.. ఆర్టీసీ సర్వీసులు పెంచాలి.రోడ్డు భధ్రత వారోత్సవాలపై మరింత అవగాహన పెంచాలి .మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా బస్సు టైమింగ్స్ సెట్ చేస్తున్నాం.ఆర్టీసీ ప్రయాణం భధ్రత విషయంలో రాజీపడం.ఆర్టీవోలు కఠినంగా వ్యవహరించాలి.ప్రభుత్వ విప్ రాంచంద్ర నాయక్గత ప్రభుత్వం ఓట్ల కోసం నామమాత్రంగా తండాలను గ్రామపంచాయతీలను చేసింది.తండా గ్రామపంచాయతీలకు ఎటువంటి ఫండ్స్ లేవు.ప్రస్తుతం ప్రభుత్వం ప్రతీ తండా గ్రామపంచాయతీలకు ఆఫీస్తో పాటు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. మీడియా పాయింట్.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్స్..బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది.విభజన తరువాత 2 రాష్ట్రాలు చాలా నష్ట పోయాయి..నిర్మల సీతారామన్ తెలంగాణలో పర్యటన సమయంలో..రేషన్ షాప్ల దగ్గర ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదు అని డీలర్ను, కలెక్టర్ను ప్రశ్నించారు.తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని నిర్మల సీతారామన్, కిషన్ రెడ్డి, సంజయ్ వస్తారుమూసీకి ఇతర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని సీఎం ఎన్నో సార్లు అడిగారుతెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు క్షమాపణ చెప్పాలిహైదరాబాద్లో వారిని తిరగనివ్వం.ఇలాంటి ఆర్థిక మంత్రి దేశానికి ఉండటం అరిష్టంవిభజన చట్టంలో ఉన్న అంశాలు పరిష్కారం చేయకపోవడం బాధాకరంఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోకోవాలినిన్న బడ్జెట్లో తెలంగాణ పేరు తీయకపోవడం విచారకరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేపీ వివేకానంద కామెంట్స్..కేంద్ర బడ్జెట్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీరని అన్యాయం చేసిందిబీఆర్ఎస్ హయాంలో కేంద్రం ఎన్నో ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు వెళ్ళిందిదేశానికి ఆదాయం అందించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి మూడు, నాలుగు స్థానాల్లో ఉందితెలంగాణలో కేసీఆర్ నాయకత్వం ఉండకూడదని కుట్ర చేశారుకేంద్ర బడ్జెట్పై సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకాలకు తెరదీశారుమోదీని బడే భాయ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారుఅసెంబ్లీలో చర్చ పెట్టి హామీలను నెరవేర్చకుండా కేంద్రంపై నెపంవేసే ప్రయత్నం సీఎం చేస్తున్నారుతెలంగాణకు ఎలాంటి ఐఐఎం ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి సీఎంకు లేఖ రాశారుతన కేసుల కోసం కేంద్ర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి రాజీపడ్డారుబీజేపీతో కుమ్మక్కు అయ్యి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనుకుంటున్నారు. 👉బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొట్టి రూపాయి కూడా తీసుకురాలేదుతెలంగాణలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి చెరో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఇచ్చారుతెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 16 ఎంపీ సీట్లు ఇస్తే ఎన్ని వేల కోట్లు వచ్చే అవకాశం ఉండేదో ఆలోచించండిఏపీకి 15 వేల కోట్లు ఇచ్చారుతెలంగాణపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డ్రామాలు బంద్ చేయాలితెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తామురెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడ చేశారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి 👉నేడు రెండో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదట సభ్యులు అడిగిన ప్రశ్నలకు సదరు మంత్రులు సమాధానం చెబుతారు.👉షార్ట్ డిస్కషన్ కింద కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చ చేపట్టాలని స్పీకర్ను ప్రభుత్వం కోరనుంది. ఈ క్రమంలో స్పీకర్ అనుమతి ఇస్తే కేంద్ర బడ్జెట్పై సభలో చర్చ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం.. సభలో తీర్మానం చేయనుంది.👉మరోవైపు.. గోదావరి పరివాహక ప్రాంతంలో పంట నష్టంపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు.నేడు అసెంబ్లీలో ఇలా..1) ప్రశ్నోత్తరాలు .2) ప్రభుత్వ రిజల్యూషన్3) నిన్న బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు ఉభయసభల్లో టేబుల్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.4) వివిధ శాఖల్లో యాన్యువల్ రిపోర్టులను ఉభయ సభల్లో టేబుల్ చేస్తారు.ఇదిలా ఉండగా..1. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ 23వ వార్షిక రిపోర్టును సభలో ప్రవేశపెడతారు.2. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ యాన్యువల్ రిపోర్టును విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు.3. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెడతారు.4. ఇటీవల దివంగతులైన మాజీ శాసనసభ్యులు డాక్టర్ నెమురు గొమ్ముల సుధాకర్ రావు, మహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్, ధర్మపురి శ్రీనివాస్, రమేష్ రాథోడ్లకు సభలో సంతాపం వ్యక్తం చేయనున్నారు.5. శాసనసభలో స్వల్పకాలిక చర్చ(యాక్టివిటీస్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్ మెట్రో సిటీ).శాసనసభలో చర్చకు వచ్చే ప్రశ్నోత్తరాలు..1.పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్నెస్ తనిఖీలు.2.తండాలు గ్రామపంచాయతీలుగా ఉన్నతీకరణ3.ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు.4.వాణిజ్య పనుల శాఖలో అవకతవకలు.5.నిజామాబాద్ పట్టణ శాసనసభ నియోజకవర్గంలో క్రీడా సముదాయం.6.తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐటీ ఏర్పాటు.7.ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లింపు.8.రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు.9.జాతీయ రహదారి విస్తరణ పనులు.10.మూసీ నదికి ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ చెరువుల అనుసంధానం. -
వివక్ష కాదు.. కక్ష.. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై బుధవారం శాసనసభలో చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిరసనను తెలియజేస్తూ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ అనే పదాన్నే నిషేధించిన కేంద్రం వైఖరిని ఎండగట్టడానికి శాసనసభలో జరిగే చర్చలో అన్ని పార్టీలు పాలుపంచుకోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చర్చలో పాల్గొనాలని సూచించారు. ‘కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షతో కాదు.. కక్ష పూరితంగా వ్యవహరించింది..’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ను కుర్చీ బచావో బడ్జెట్గా అభివరి్ణంచారు. నితీశ్, నాయుడు డిపెండెంట్ అలయెన్స్గా ఎన్డీఏ మారిందని ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ విషయంలో వైఖరిని మార్చుకుని, బడ్జెట్ను సవరించి విభజన హామీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కోరిన అంశాలకు అనుగుణంగా కేటాయింపులు జరపాలని కోరారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పెద్దన్నలా వ్యవహరించాలని కోరినా.. ‘మా ప్రభుత్వం, మంత్రివర్గ సహచరులు 18 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర హోం మంత్రి,ని ఇతర మంత్రులను కలిశారు. స్వయంగా నేను మూడుసార్లు ప్రధానిని కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని కోరా. రాష్ట్రానికి వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో పెద్దన్నలా వ్యవహరించాలని ప్రధానికి చెప్పాం. కానీ మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదం పలకడానికే కేంద్రం ఇష్టపడలేదు. వారి మనసులో తెలంగాణ పట్ల ఇంత కక్ష ఉందని అనుకోలేదు. పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఏపీకి నిధులు కేటాయించిన కేంద్రం, అదే చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు?..’అని సీఎం నిలదీశారు. వికసిత్ భారత్లో తెలంగాణ భాగం కాదా? ‘బయ్యారం, ఖాజీపేట కోచ్ఫ్యాక్టరీ, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు, గిరిజన యూనివర్సిటీకి నిధుల ఊసు లేదు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది బోగస్ నినాదం. వికసిత్ భారత్లో తెలంగాణ భాగం కాదని ప్రధాని భావిస్తున్నారా? ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు.. కుర్చీ బచావో బడ్జెట్. బిహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదు. ఇంతటి వివక్ష, కక్షపూరిత వైఖరి ఎప్పుడూ చూడలేదు. బీజేపీని 8 సీట్లలో గెలిపించిన రాష్ట్రానికి ఇంత మోసం చేస్తారా? కేంద్ర వైఖరికి నిరసనగా కిషన్రెడ్డి కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేసి బయటకు రావాలి. ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే.. ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కేవలం క్విడ్ ప్రో కో విధానంలో కుర్చీ కాపాడుకునేందుకే ప్రధాని బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ నిరసన తెలుపుతుంది. బడ్జెట్ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం, ఖాజీపెట్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. లేకపోతే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లే. కిషన్రెడ్డి మౌనం, బానిస మనస్తత్వంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. మంత్రి పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టొద్దు..’అని రేవంత్ అన్నారు. త్వరలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం ‘ఏపీలో అమరావతికి వేల కోట్లు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్లో అభివృద్ధి పనులకు, మౌలిక వసతుల కల్పనకు నిధులు ఎందుకు ఇవ్వదు? పోలవరానికి నిధులు ఇచ్చినప్పుడు.. తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు ఇవ్వరు? బిహార్, ఏపీ కోసం బడ్జెట్ పెట్టినట్లు ఉంది. కుర్చీ లాలూచీలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాస్తే ఊరుకోం. పార్లమెంట్లో నిరసనకు బీజేపీ ఎంపీలూ, ఎంఐఎం కూడా కలిసి రావాలి. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోంది. అందుకే త్వరలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నా. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక సీఎంలు ఒప్పుకున్నారు. కేరళ, ఆంధ్రప్రదేశ్ కలిసి వస్తాయో లేదో చూస్తాం. వివక్షతోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నాం.’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చర్చలో కేసీఆర్ పాల్గొనాలి.. ‘బుధవారం ప్రశ్నోత్తరాల తరువాత స్పీకర్ అనుమతితో కేంద్ర బడ్జెట్పై తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి చర్చించాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబుకు సూచిస్తున్నా. ఈ చర్చలో ఎవరు విలీనాల ప్రక్రియలో ఉన్నారో.. ఎవరు చీకటి ఒప్పందాలు చేసుకున్నారో బయటపడుతుంది. తెలంగాణ హక్కులు, నిధులపై జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొనాలని సూచిస్తున్నా. లేకపోతే కేసీఆర్ కూడా మోదీకి మోకరిల్లినట్లే భావించాల్సి వస్తుంది..’అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సమావేశంలో మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేను గరళ కంఠుడిని.. బాధను దిగమింగుకుంటున్నా!: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘రాజకీయంగా ఎదుర్కొనలేక నా కూతురు కవితను కేసులో ఇరికించారు. తండ్రిగా నాకు ఎంతో బాధ ఉన్నా సంయమనంతో మౌనం పాటిస్తున్నా. గరళ కంఠుడిలా బాధను దిగమింగుకుంటున్నా. అగ్ని పర్వతంలా ఉన్నా. నాకు ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో తెలుసు. పార్టీలో ఉండే వారు ఉంటారు.. వెళ్లే వారు వెళ్తారు. పార్టీలో ఉండాలా.. వద్దా అనేది వాళ్ల ధర్మం. కాంగ్రెస్కు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా మళ్లీ అధికారంలోకి వచ్చారు. ప్రజలు తలచుకుంటే ఏమైనా జరగొచ్చు. పార్టీకి ఇది క్లిష్ట సమయం అనే వాదన సరికాదు. లక్షలాది కార్యకర్తలు ఉన్న పార్టీ మనది. ధైర్యం చెడకుండా ఇష్టంతో జనంతో మమేకమవుదాం’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్లో మంగళవారం సుమారు మూడు గంటలపాటు కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి దారితీసిన పరిస్థితులు, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులు, రాబోయే రోజుల్లో అసెంబ్లీ లోపలా బయటా పార్టీ పరంగా అనుసరించాల్సిన కార్యాచరణ తదితరాలపై కేసీఆర్ ప్రసంగించారు. ‘అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తయారు చేసిన చరిత్ర బీఆర్ఎస్కు ఉంది. ఉద్యమ కాలంలో ఢిల్లీతోపాటు స్థానికంగా బలమైన శక్తులతో పోరాడాం. రాష్ట్ర సాధన, అభివృద్ధిలో మనది విజయగాథ. అందరం ఇష్టంతో పనిచేద్దాం. ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారు’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. హనీమూన్ పీరియడ్ ముగిసింది ‘రేవంత్రెడ్డి ప్రభుత్వానికి వివిధ రంగాలకు సంబంధించిన విధానాలు రూపొందించేందుకు కొంత వ్యవధి ఇచ్చాం. అయితే 8 నెలలు కావస్తున్నా విద్య, వైద్యం, విద్యుత్ సహా ఏ రంగంపైనా ఒక స్పష్టత లేకుండా పోయింది. కొత్త విధానాలు రూపొందించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన హనీమూన్ పీరియడ్ ముగిసినందున ఇకపై ప్రజాక్షేత్రంలో మనం నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది. ఏకకాలంలో రుణమాఫీ అనేది పెద్ద మోసం.. ఈ అంశాన్ని అసెంబ్లీలో ఎండగట్టాలి. అధికారంలోకి వచ్చేందుకు పార్టీలు హామీలు ఇవ్వడం సహజం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నించకపోవడం ప్రజలను మోసగించడమే’అని కేసీఆర్ పేర్కొన్నారు. వివిధ రంగాల్లో రాష్ట్ర అవతరణ మొదలుకుని బీఆర్ఎస్ దూరదృష్టితో అమలు చేసిన పథకాలు, పనులను సోదాహరణంగా వివరించారు. వ్యవసాయ రంగం స్థిరీకరణకు చేసిన ప్రయత్నాలను సుదీర్ఘంగా వివరించారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాలను ఎండగట్టాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. -
అగ్ని పర్వతంలా రగిలిపోతున్నా.. కన్న తండ్రిగా బాధ ఉండదా?: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ బీఆర్ఎస్ఎల్పీ భేటీలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. శాసనమండలిలో భారాస పక్ష నేతగా మధుసూదనాచారిని కేసీఆర్ ప్రకటించారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తాను అగ్ని పర్వతంలా రగిలిపోతున్నానని అన్నారు. ఎన్నో విషయాలను దాచుకొని మౌనంగా ఉన్నానని తెలిపారు. రాజకీయ కక్షతోనే తన కూతురుని (ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత) జైల్లో పెట్టారని మండిపడ్డారు. సొంత బిడ్డ జైలులో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేల వలసలపై ఆందోళన చెందవద్దని నేతలకు కేసీఆర్ సూచించారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితిలో తెలంగాణను సాధించామని గుర్తు చేశారు. గతంలో ఆగురురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలో రాలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయింది. కాంగ్రెస్ నేతలు పాలనపై దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎందుకు అదుపుతప్పాయి?. ఎక్కడో ఉన్న వాళ్ళు ఎన్నికల్లో గెలిపిస్తే పదవులు వచ్చాక పార్టీ వీడుతున్నారు. పార్టీ వదిలి వెళ్ళిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.’ అని తెలిపారు. -
బడ్జెట్లో ‘తెలంగాణ’ అనే పదాన్ని నిషేధించారు: సీఎం రేవంత్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణపై కేంద్ర కక్షపూరితంగా వ్యవహరించినట్లు ప్రజలు భావిస్తున్నారని అన్నారు. 18 సార్లు ఢిల్లీ వెళ్లి నిధులు ఇవ్వాలని కేంద్రాన్నికోరినట్లు తెలిపారు. తానే స్వయంగా మూడుసార్లు ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు, వివక్ష లేకుండా నిధులు కేటాయించాలని మోదీని కోరినట్లు పేర్కొన్నారు. బడ్జెట్లో తెలంగాణ అనే పదం నిషేదించారని, తెలంగాణ అని పలకడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు బడ్జెట్ చూస్తే తెలంగాణపై ఎంత కక్ష ఉందో అర్థం అవుతుందన్నారు. వివక్ష అనుకున్నాం కానీ కక్ష పూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే మోదీ తప్పుబట్టారని విమర్శించారు.ఇది బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్.. ‘ఏపీకి ఎందుకు ఇచ్చారు అని అడగం. కానీ తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు. మూసీ రివర్ ప్రాజెక్టు కోసం నిధులు అడిగాం.. ఒక్క రూపాయి ఇవ్వలేదు. మెట్రోకి నిధులు లేవు. ఐటీఐఈఆర్ కారిడార్ ప్రస్తవన లేదు. ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్. ఏపీ, బిహార్లకు తాయిలాలు ఇచ్చి కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇది మోదీకి గౌరవంవం తెచ్చిపెట్టదు. బీజేపీకి తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచ్చారు 35 శాతం ఓట్లు ఇచ్చారుకిషన్ రెడ్డిదే బాధ్యత.. రాజీనామా చేయాలి..తెలంగాణ కృతజ్ఞత చూపాల్సిన బీజేపీ వివక్ష ప్రదర్శించింది. తెలంగాణ ప్రజల నిర్ణయం వల్లే మోదీ పీఎం పదవిలో కూర్చున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్రెడ్డిదే బాధ్యత. కిషన్ రెడ్డి తక్షణమే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలి. బయ్యారం, కాజీపేట రైల్వేఫ్యాక్టరీ, ఐఐఎం ఊసేలేదు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వట్లేమని నేరుగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాకు లేఖ రాశారు. ఐఐఎం ఇవ్వనప్పుడు కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగడం ఎందుకు?క్విడ్ ప్రో కో అన్నట్లు ఉంది బడ్జెట్..మేము కేంద్రంతో సఖ్యతగా ఉండాలని అనుకున్నాం.. కానీ దాన్ని చేతగాని తనంగా తీసుకుంటున్నారు. మోదీని పెదద్దన్నగా మేం బావించాం.. కానీ మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సవరించే బడ్జెట్లో మా విభజన హామీలు అమలు చేయాలి. పార్లమెంటు సమావేశంలో మా నిరసన తెలియజేస్తాం. కేవలం క్విడ్ ప్రో కో అన్నట్లు ఈ బడ్జెట్ ఉంది.కేంద్ర కక్షపూరిత వ్యవహారంపై రేపు అసెంబ్లీలో చర్చిస్తాం. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానికి పంపుతాం. బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయండి. బండి కిషన్ రెడ్డి తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయండి. ఐఐఎం ఇవ్వమని చెప్పారు.. ఎందుకు ఇవ్వరో చెప్పాలి కదా? ఎవరి దయాదక్షిణ్యాల మీద తెలంగాణ ఆధారపడి లేదు. విభజన చట్టం హామీలు ఏపీకేనా.. తెలంగాణకు వర్తించదా?. దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ విక్ష చూపిస్తోంది. ఈ వివక్ష ఇలాగే కొనసాగితే అది మరో ఉద్యమానికి దారి తీస్తుంది’ అని పేర్కొన్నారు. -
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, ప్రజల కోసం పెట్టింది కాదని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. బీజేపీ మిత్రక్షాులైన టీడీపీ, జేడీయూని ప్రసన్నం చేసుకునేందుకు రూపొందించినట్లు ఉందన్నారు. బిహార్కు రూ.41వేల కోట్లు ఆర్థిక సాయం.. ఏపీకి రూ.15వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు కేటాయించి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను, ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.‘2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది 11వ బడ్జెట్, కానీ కొత్త రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేసింది. 2014 తర్వాత మొదటిసారిగా, బడ్జెట్లో 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం' పేరుతో ప్రత్యేక అధ్యాయాన్ని పొందుపరిచారు, కానీ ఆర్థిక 58 పేజీలు, 14,692 పదాలున్న తన మొత్తం ప్రసంగంలో మంత్రి తెలంగాణ అనే పదాన్ని ప్రస్తావించలేదని అన్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రస్తావనను పూర్తిగా దాటవేయడాన్ని ఖండింస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించనప్పటికీ, తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నాం, ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రుల బృందం గత ఏడు నెలలుగా అన్ని మంత్రిత్వ శాఖలకు నిధులు ఇవ్వాలని కోరుతూ పలు దరఖాస్తులు సమర్పించాంపోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలమూరు రంగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇచ్చిన హామీ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆశిస్తున్నాం'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్న ఆశతో తెలంగాణ ప్రజలు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు, హైస్పీడ్ రైలు కనెక్టివిటీ చట్టంలో చేసిన ఇతర వాగ్దానాలు అమలు చేయాలి.రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంపిక చేసి గ్రాంట్లు మంజూరు చేశారు. అయితే తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల ప్రస్తావనను దాటవేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సహా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన వాటాను పొందడంలో విఫలమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి వనరులు, సంక్షేమ పథకాల్లో వాటా దక్కకుండా చేసిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ కలిగించింది’ అని అన్నారు.