సాక్షి ప్రతినిధి, బెంగళూరు :రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్పై సీబీఐ దర్యాప్తు చేయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఢిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీబీఐతో దర్యాప్తు చేయించే విషయమై న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. అక్రమ మైనింగ్పై గతంలో తాను వెలిబుచ్చిన అభిప్రాయాలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిపై కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవడానికి వెనుకాడేది లేదన్నారు.
అక్రమ మైనింగ్ వల్ల ఖజానాకు వాటిల్లిన నష్టాన్ని వసూలు చేయడానికి ఉన్నత స్థాయి సమితి ఏర్పాటు చేసే విషయమై న్యాయ నిపుణులతో సమాలోచనలు జరిపి సత్వరమే నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా కేపీసీసీ అధ్యక్షుడు జీ. పరమేశ్వర, మాజీ మంత్రి డీకే. శివ కుమార్కు మంత్రి వర్గంలో స్థానం కల్పించే విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వాన్ని సజావుగా నడపడానికి అవసరమైన సంఖ్యా బలం ఉన్నందున ‘ఆపరేషన్ హస్తం’ ఆవశ్యకత ఉండబోదన్నారు. లోక్సభ ఎన్నికల్లో 20 నుంచి 22 స్థానాలను గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. మడె స్నానను ఆది నుంచీ వ్యతిరేకిస్తున్నామని, మూఢ నమ్మకాలను ప్రోత్సహించడానికి అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్పారు.
ఎంపీలతో సమావేశం:కర్ణాటక భవన్లో ముఖ్యమంత్రి రాష్ర్ట ఎంపీలకు ఉదయం అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర పథకాలకు కేంద్రం అనుమతిని పొందడంలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని ఎంపీలను కోరారు. ఎంపీ లాడ్ నిధులను సద్వినియోగం చేయాలని కోరారు. ఇదే సందర్భంలో ఎంపీ లాడ్ నిధుల వినియోగంపై జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసే విషయమై చర్చించారు. వెంకయ్య నాయుడు, అనంత కుమార్ సహా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. మాజీ ప్రధాని దేవెగౌడ గైర్హాజరయ్యారు.
ఖర్గే అసంతృప్తి :రాష్ర్టంలో రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరించడం లేదని రైల్వే మంత్రి ఖర్గే ఆరోపించారు. భూసేకరణ ఫైళ్లను పరిష్కరించడంలో జాప్యం చేస్తున్నా రన్నారు. భూమిని ఇవ్వకపోతే నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేయడం అసాధ్యమన్నారు. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరినప్పుడు సీఎం స్పందిస్తూ, ఆరు నెలల్లో అన్ని పనులు పూర్తి చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అక్రమ మైనింగ్పై సీబీఐ దర్యాప్తు
Published Wed, Aug 28 2013 2:43 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేయూ వైస్ చాన్స్లర్ రమేశ్పై సమగ్ర విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
చెట్టు మీదపడి కూలీ మృతి
నిజ బృందావన దర్శనం
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
ఊరంతా సుంకులమ్మ, ముత్యాలయ్యలే
‘బలగం’తో మంచి గుర్తింపు
గిరిజన గురుకులాల దరఖాస్తుకు నేడు ఆఖరు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
మిద్దైపె నుంచి పడి యువకుడి మృతి
ఖాదర్లింగ స్వామి ఉరుసు ప్రారంభం
తప్పక చదవండి
- జనసేన నాయకుడి దౌర్జన్యం
- బైక్పైనే ముద్దుముచ్చట
- ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- కొండెక్కిన చికెన్ ధర
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- Telangana: ప్రారంభమైన టెట్ పరీక్ష
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
Advertisement