
మాన్యువల్ విధానంలోనే బదిలీలు జరపాలి
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలను మాన్యువల్ విధానంలోనే జరపాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశాయి. అలా కాని పక్షంలో ఎంతదూరమైనా పోవడానికి సిద్ధమని ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేశాయి. జిల్లాలో ఎస్జీటీలకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు.. మ్యానువల్ ముద్దు అనే నినాదంతో ఆదివారం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు.మాన్యువల్ కౌన్సెలింగ్ జరపాలనే ఏకై క నినాదంతో జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార విషయమై గతంలో సంఘాలు ధర్నాకు పిలుపును ఇచ్చినప్పుడు కమిషనర్ మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ జరుపుతామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు మాట తప్పి ఆన్లైన్ ద్వారా కౌన్సెలింగ్లో వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలని ప్రకటించడం సబబుగా లేదన్నారు. గతంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు మోపురు శివారెడ్డి, ఇలియాస్బాష, నర్రెడ్డి సంగమేశ్వర్రెడ్డి, సురేష్ బాబు,గుజ్జల తిరుపాల్,బండి విశ్వనాథరెడ్డి,లక్ష్మి రాజా, పాలేం మహేష్, శ్యాంసుందర్ రెడ్డి, ఖాదర్ బాషా, చెన్నయ్య, కొండారెడ్డి, బత్తిని నాగేశ్వరరావు, రామాంజనేయులు, ప్రవీణ్ కిరణ్, శివశంకర్ రెడ్డి,సజ్జల రమణారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, ఏబీ రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
● ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నేడు డీఈఓ కార్యాలయ వద్ద చేపట్టనున్న నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం కడపలోని డీఈఓ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు.
ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక
డీఈఓ కార్యాలయం ముట్టడి