నేడు ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’

Jun 9 2025 6:59 AM | Updated on Jun 9 2025 6:59 AM

నేడు ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’

నేడు ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’

కడప సెవెన్‌రోడ్స్‌: డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుండి 10 గంటల వరకు జరుగుతుందని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ప్రజలు 08562–244437 ల్యాండ్‌ లైన్‌ నంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చన్నారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో విజ్ఞప్తి చేశారు

నేడు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: జిల్లావ్యాప్తంగా స్వచ్ఛభారత్‌లో పనిచేస్తున్న కార్మికులకు ఆయా గ్రామ పంచాయతీల వారీగా పెండింగ్‌లో ఉన్న జీతాలు తక్షణమే ఇవ్వాలంటూ స్వచ్ఛభారత్‌ కార్మికుల యూనియన్‌ సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనుంది.దీనిని జయప్రదం చేయాలని యూనియన్‌ గౌరవాధ్యక్షుడు కేసీ బాదుల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం రూ. 10,000 అమలు చేయాలన్నారు. కార్మికులకు పని చేసేందుకు అవసరమైన పనిముట్లు, రక్షణ దుస్తులు అందించాలన్నారు.

కాల్‌ సెంటర్‌ 1100 సేవలు వినియోగించుకోండి

కడప సెవెన్‌రోడ్స్‌: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్‌ సెంటర్‌ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్‌ చేయవచ్చునన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు.

సభాభవన్‌లో

పీజీఆర్‌ఎస్‌ నిర్వహణ

కడప సెవెన్‌రోడ్స్‌: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)ను ఈ సోమ వారం సభాభవన్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చునన్నారు. ‘ప్రజా ఫిర్యా దుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్‌ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్‌ కార్యాలయాల్లో కూడా సమర్పించుకోవచ్చునన్నారు.

1340 మెట్రిక్‌ టన్నుల యూరియా రాక

కడప అగ్రికల్చర్‌: ఉమ్మడి కడపజిల్లాకు 1340 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చినట్లు జిల్లా జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరావు తెలిపారు. ఇందులో కడప జిల్లాకు 950 మెట్రిక్‌ టన్నులు రాగా ఇందులో 550 మెట్రిక్‌ టన్నులను ప్రైవేటు డీలర్లకు, 400 మెట్రిక్‌ టన్నులు మార్కె ఫెడ్‌కు కేటాయించి నట్లు తెలిపారు. అలాగు అన్నమయ్యజిల్లాకు 390 మెట్రిక్‌ టన్నులు రాగా ఇందులో 120 మెట్రిక్‌ టన్నులు ప్రైవేటు డీలర్లకు, 270 మెట్రిక్‌ టన్నులు మార్కెఫెడ్‌కు కేటాయించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement