భవిష్యత్తు తరాలకు దిక్సూచిలా ’యోగా’ | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు తరాలకు దిక్సూచిలా ’యోగా’

Jun 9 2025 6:59 AM | Updated on Jun 9 2025 6:59 AM

భవిష్యత్తు తరాలకు దిక్సూచిలా ’యోగా’

భవిష్యత్తు తరాలకు దిక్సూచిలా ’యోగా’

కడప అర్బన్‌: యోగా భవిష్యత్తు తరాలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఓ అద్భుతమైన మార్గదర్శి, ’దిక్సూచి’ లా పనిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఏ.ఆర్‌, సివిల్‌, ఇతర విభాగాలు, ఏపీఎస్పీ అధికారులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ’యోగాంధ్ర – 2025’ కార్యక్రమానికి జిల్లా ఎస్‌.పి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధుల్లో మానసిక ఒత్తిడికి గురయ్యే పోలీస్‌ సిబ్బంది అనారోగ్య సమస్యలు రాకుండా యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకుని సంపూర్ణ ఆరోగ్యం తో జీవించవచ్చని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో మానసిక దృఢత్వానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆయుష్‌ విభాగం నుండి హాజరైన యోగా శిక్షకులు ప్రసాద్‌, జ్యోతి లకు జిల్లా ఎస్‌.పి పోలీస్‌ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ బి.రమణయ్య, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ ఎన్‌.సుధాకర్‌, కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు, ప్రొద్దుటూరు డీఎస్పీ.భావన, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌, పులివెందుల డీఎస్పీ బి.మురళినాయక్‌, ఆయుష్‌ డి స్ట్రిక్ట్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ మురళి పాల్గొన్నారు.

పోస్టర్ల ఆవిష్కరణ

జిల్లాలో మాదక ద్రవ్యాల నిరోధానికి తమ వంతు క్రియాశీల పాత్ర పోషిస్తామని పోలీస్‌ అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఆదివారం పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ లోని యోగాంధ్ర వేదికపై ఈగల్‌ (ఎలైట్‌ యాంటి–నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ ) ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ‘మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, ఏ ఒక్కరూ డ్రగ్స్‌ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్‌ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియచేస్తానని డ్రగ్స్‌ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవుతామంటూ’ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.

జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement