
అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
ఇన్ఛార్జి డీఆర్వో శ్రీనివాసులు
కడప సెవెన్రోడ్స్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని ఇన్చార్జి డీఆర్వో శ్రీనివాసులు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో ఇన్చార్జి డీఆర్వో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కార నివేదికను అందివ్వాలని ఆదేశించారు. అనంతరం అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, సోషల్ వెల్ఫర్ డీడీ సరస్వతి, ఎస్డీసీ వెంకటపతి, జిల్లా రిజిస్ట్రార్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.