
తలసేమియా బాధితుడికి ఆర్థికసాయం
మర్రిగూడ: మండలంలోని శివన్నగూడ గ్రామానికి చెందిన బల్లెం స్వరూప అబ్బయ్యల పెద్దకుమారుడు బల్లెం ప్రణయ్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఆపరేషన్ చేయించేందుకు కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడంతో బుధవారం సాక్షి దినపత్రికలో ‘దాతలు సహాయం చేయరూ’ శీర్షికన కథనం ప్రచురించింది. శివన్నగూడ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, రామలింగేశ్వరస్వామి దేవాలయ చైర్మన్ రాపోలు యాదగిరి స్పందించి ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం రూ.లక్ష చెక్కును ప్రణయ్ తల్లిదండ్రులకు శుక్రవారం అందజేశారు. గట్టుప్పల్కు చెందిన టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సిద్ధగోని మహేష్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సమస్యను వివరించగా బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.

తలసేమియా బాధితుడికి ఆర్థికసాయం