
లక్ష్యం దాటిన కొనుగోళ్లు
మూడు రోజుల్లోనే నగదు జమైంది
శోభనాద్రిపురం శివారులో మాకు వ్యవసాయ భూమి ఉన్నది. యాసంగిలో వరి సాగు చేశాను. 720 క్వింటాళ్ల దిగుబడి రాగా స్థానిక కొనుగోలు కేంద్రంలో పోశాను. నా సీరియల్ త్వరగానే వచ్చింది. తూకం వేసిన మూడు రోజుల్లోనే ధాన్యం డబ్బులు ఖాతాలో జమ అయ్యాయి. గతంలో ఎన్నడూ ఇంత తొందరగా డబ్బులు వచ్చిన దాఖలాలు లేవు.
–కర్రె సంతోష్కుమార్, రైతు, వెల్లంకి
రామన్నపేట: యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 375 కేంద్రాలను మూసేశారు. అకాల వర్షాలతో కాస్త ఆలస్యమైనా సివిల్ సప్లై నిర్దేశించిన లక్ష్యానికి మించి ధాన్యం సేకరించారు. 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు టార్గెట్గా కాగా అదనంగా 17,479 మెట్రిక్ టన్నులు సేకరించారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.849.32 కోట్లు కాగా ఇప్పటికే రూ.825.27 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకా రూ.28.04 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఒకటిరెండు రోజుల్లో మిగిలిన రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశం ఉన్నది.
2,75,315 ఎకరాల్లో వరి సాగు
యాసంగి సీజన్లో 2,75,315 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 5,56,723 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 3,50,009 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 375 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ 124, పీఏసీఎస్ 237 , రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో 14 కేంద్రాలను నిర్వహించారు. 374 కేంద్రాల్లో కొనుగోళ్లు, ఎగుమతులు పూర్తయ్యాయి. 40,975 మంది రైతుల నుంచి 3,67,479 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇది నిర్దేశించిన లక్ష్యం కంటే 17, 479 మెట్రిక్ టన్నులు అదనం. గత ఏడాది యాసంగి కంటే కూడా 15,856 మెట్రిక్ టన్నులు ఎక్కువ. ఇదిలా ఉండగా ఈసారి రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే నగదు జమ కావడం విశేషం.
05ఎన్కెఎల్204:
టార్గెట్ 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
ఫ అదనంగా 17 వేల మెట్రిక్ టన్నులు సేకరణ
ఫ రైతుల ఖాతాల్లో రూ.825.27 కోట్లు జమ
ఫ పూర్తయిన కొనుగోళ్లు.. కేంద్రాల మూసివేత
వరి సాగు 2,75,315 ఎకరాలు
లక్ష్యం 3,50,009 మెట్రిక్ టన్నులు
సేకరణ 3,67,479 మెట్రిక్ టన్నులు
ధాన్యం విలువ రూ.849.32 కోట్లు
చెల్లించింది రూ.825.27 కోట్లు

లక్ష్యం దాటిన కొనుగోళ్లు