మళ్లీ 40 డిగ్రీలు దాటిన ఎండ | - | Sakshi
Sakshi News home page

మళ్లీ 40 డిగ్రీలు దాటిన ఎండ

Jun 7 2025 1:14 AM | Updated on Jun 7 2025 1:14 AM

మళ్లీ 40 డిగ్రీలు దాటిన ఎండ

మళ్లీ 40 డిగ్రీలు దాటిన ఎండ

భువనగిరిటౌన్‌ : జిల్లాలో మళ్లీ ఎండ తీవ్రత పెరిగింది. శుక్రవారం పలుచోట్ల 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ, ఉక్కపోతతో జనం అవస్థ పడ్డారు. సాధారణంగా రోహిణి కార్తెలో ఎండలు ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈ ఏడాది వాతావరణం మారింది. రోహిణి కార్తెకు ముందు వర్షాలు కురిశాయి. కార్తె ప్రవేశించాక కూడా వానలు పడ్డాయి. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా ముందే వచ్చాయి. దీంతో సాధారణం కంటే ఐదారు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది వేసవి ముగిసినట్టేనని అంతా భావించారు. కానీ, నైరుతి నెమ్మదించడంతో వాతావరణం మళ్లీ వేడెక్కింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటిరెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం బీబీనగర్‌లో 40.8, మోత్కూరు, గుండాలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరి కొన్ని చోట్ల 39 డిగ్రీలు దాటింది. మరో వారంపాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. విత్తనాలు విత్తవద్దని రైతులకు సూచిస్తున్నారు.

ఫ పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు

ఫ బీబీనగర్‌లో 40.8 డిగ్రీలు నమోదు

శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీలలో)

మండలం ఉష్ణోగ్రత

బీబీనగర్‌ 40.8

మోత్కూరు 40

గుండాల 40

అడ్డగూడూరు 39.5

ఆత్మకూర్‌(ఎం) 39.3

బి.రామారం 39

రామన్నపేట 38.9

ఆలేరు 38

భువనగిరి 38

నారాయణపురం 37.9

వలిగొండ 37.6

యాదిరిగుట్ట 37.5

పోచంపల్లి 37

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement