
భవిష్యత్కు ‘నవోదయం’
నవోదయ విద్యాలయాల్లో 2026– 2027 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
- 10లో
ప్రతి పేదవాడికి ఆహారభద్రత
– మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఆహారభద్రత కల్పించడమే ధ్యేయమని భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ కల నేరవేర్చేందుకే సన్నబియ్యం పథకం తీసుకువచ్చి, అమలు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏఒక్క పని పూర్తి చేయలేదని, వాటన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి వ్యక్తి, ప్రతి రైతు మూసీ పునరుజ్జీవానికి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. బునాదిగాని కాల్వ, పిల్లాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వలను పూర్తి చేస్తామని, భూసేరణ బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గంధమల్ల రిజర్వాయర్ను ముంపు లేకుండా సామర్థ్యాన్ని 1.4 టీఎంసీలకు తగ్గించి 60 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.