
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు
శాలిగౌరారం: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన 365వ నంబర్ జాతీయ రహదారిపై శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామ సమీపంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన మందుల ముఖేష్, బూరుగుల సన్నీ, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన కట్టెకోల సాయిచరణ్ కలిసి ద్విచక్ర వాహనంపై 365వ నంబర్ జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్కు వెళ్తుండగా.. అదే సమయంలో హైదరాబాద్ నుంచి మరిపెడ బంగ్లాకు అతివేగంగా వెళ్తున్న కారు శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామ సమీపంలోని ఫంక్షన్హల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు కాగా.. మందుల ముఖేష్, బూరుగుల సన్నీ, కట్టెకోల సాయిచరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. కారు జాతీయ రహదారి పక్కన బోల్తా పడడంతో కారు నడుపుతున్న వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మందుల ముఖేశ్, కట్టెకోల సాయిచరణ్ను మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సాయిచరణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
ఫ నలుగురికి గాయాలు
ఫ ఒకరి పరిస్థితి విషమం

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు