ఆలయ భద్రత కట్టుదిట్టం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆలయ భద్రత కట్టుదిట్టం చేయాలి

Jun 4 2025 2:22 AM | Updated on Jun 4 2025 2:22 AM

ఆలయ భద్రత కట్టుదిట్టం చేయాలి

ఆలయ భద్రత కట్టుదిట్టం చేయాలి

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌ అన్నారు. ఇటీవల ఆలయ ప్రసాద విక్రయశాలలోని గోదాములో చింతపండు దొంగతనం జరిగిన నేపథ్యంలో మంగళవారం ఆయన ప్రధానాలయంతో పాటు ఆలయ క్యూకాంప్లెక్స్‌, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, మాఽఢ వీధిల్లో పర్యటించి, ఎస్‌పీఎఫ్‌, హోంగార్డుల పనితీరును పరిశీలించారు. పలు వివరాలను ఎస్‌పీఎఫ్‌ ఆర్‌ఐ శేషగిరిరావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన వెంట అడిషనల్‌ డీసీపీ లక్ష్మీనారాయణ, సిటీ సెక్యూరిటీ టీమ్‌ అడిషనల్‌ డీసీపీ వినోద్‌కుమార్‌, ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు, టౌన్‌ సీఐ బి.భాస్కర్‌, రూరల్‌ సీఐ శంకర్‌గౌడ్‌, సీఎస్‌డబ్ల్యూ రిజర్వ్‌ ఇన్స్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు, ఎస్‌పీఎఫ్‌ ఆర్‌ఐ శేషగిరిరావు, డీఈవో భాస్కర్‌, ఆలయాధికారులు దయాకర్‌రెడ్డి, రామారావు, శ్రీనివాస్‌రెడ్డి, సిటీ సెక్యూరిటీ టీమ్‌ అధికారులు ఉన్నారు.

ఫ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement