
ప్రయాణికులను కుటుంబ సభ్యులుగా భావించాలి
యాదగిరిగుట్ట: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడిని సిబ్బంది తమ కుటుంబ సభ్యులుగా భావించి గమ్యస్థానాలకు చేర్చాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానిరెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో మంగళవారం నల్లగొండ రీజియన్ త్రైమాసిక ప్రగతి చక్ర పురస్కారాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రీజియన్లోని 7 డిపోల్లో ఈ త్రైమాసికంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లతో పాటు గ్యారేజీ ఉద్యోగులకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. ప్రమాదాలు జరగకుండా ప్రతి డ్రైవర్ బస్సులు నడపాలన్నారు. కండక్టర్లు ప్రయాణికులతో మంచిగా ప్రవర్తించాలన్నారు. గ్యారేజీలో మెకానిక్లు బస్సులను మంచి కండీషన్లో ఉంచేందుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఆపరేషన్ సుచరిత, డిప్యూటీ రీజినయల్ మేనేజర్ మెకానికల్ ఎస్. భీమ్రెడ్డి, ఆయా డిపోల మేనేజర్లు మురళీకృష్ణ, శ్రీనాథ్, రామ్మోహన్రెడ్డి, ఎస్. లక్ష్మీనారాయణ, బి. శ్రీనివాస్, యాదగిరిగుట్ట డిపో అసిస్టెంట్ మేనేజర్ ఎం. ప్రవీణ్, రీజినల్ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ వెంకటమ్మ, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానిక్ ఆర్. హనుమాన్ నాయక్, ఎల్. జయప్రకాష్ తదితరులున్నారు.
ఫ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానిరెడ్డి
ఫ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, గ్యారేజీ
ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత