యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.41కోట్లు | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.41కోట్లు

Apr 30 2025 5:18 AM | Updated on Apr 30 2025 5:18 AM

యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.41కోట్లు

యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.41కోట్లు

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకలను మంగళవారం కొండ కింద గల శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం హాల్‌లో ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపులో భాగంగా నగదు రూ.2,41,35,238, మిశ్రమ బంగారం 143 గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 250 గ్రాములు వచ్చిందని ఈఓ వెల్లడించారు. ఇందులో అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, నేపాల్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌, మలేషియా, శ్రీలంక, థాయిలాండ్‌ తదితర దేశాలకు సంబంధించిన కరెన్సీని సైతం భక్తులు హుండీల్లో కానుకలుగా సమర్పించారని పేర్కొన్నారు. ఈ హుండీ ఆదాయం 34రోజులదని ఈఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement