
యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.41కోట్లు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకలను మంగళవారం కొండ కింద గల శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం హాల్లో ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపులో భాగంగా నగదు రూ.2,41,35,238, మిశ్రమ బంగారం 143 గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 250 గ్రాములు వచ్చిందని ఈఓ వెల్లడించారు. ఇందులో అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నేపాల్, సౌదీ అరేబియా, సింగపూర్, మలేషియా, శ్రీలంక, థాయిలాండ్ తదితర దేశాలకు సంబంధించిన కరెన్సీని సైతం భక్తులు హుండీల్లో కానుకలుగా సమర్పించారని పేర్కొన్నారు. ఈ హుండీ ఆదాయం 34రోజులదని ఈఓ తెలిపారు.